snoww Posted June 23, 2019 Report Posted June 23, 2019 నిగ్గుతేల్చిన సీఆర్డీఏ అధికారులు..! ప్రజావేదిక నిర్మాణంలో అవినీతిని బయటపెట్టిన ఏపీ ప్రభుత్వం బయటపెట్టింది. సీఆర్డీఏ అనుమతి లేకుండానే నిర్మాణాలు జరిపినట్లు ప్రభుత్వం నిర్థారించింది. రూ.5 కోట్ల అంచనాలను రూ.8.90 కోట్లుగా మార్చినట్లు సీఆర్డీఏ నివేదికలో తేల్చింది. మున్సిపల్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్డీఏ అధికారులు నివేదిక అందజేశారు. అంతేకాదు కృష్ణానది కరకట్టలో నిర్మాణానికి అనుమతి నిరాకరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే నారాయణ మాటతో టెండర్లు లేకుండానే పనులు అప్పగించినట్లు అధికారులు నివేదికలో వెల్లడించారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమే..! నివేదిక అందిన అనంతరం మీడియాతో మాట్లాడిన బోత్స.. గత ఐదేళ్లలో కలెక్టర్ల హాల్ కూడా చంద్రబాబు నిర్మించలేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకే ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారన్నారు. ప్రజావేదిక నిర్మాణంలో కూడా చంద్రబాబు దోపిడీ చేశారన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని.. వాటిని ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తామని బొత్స చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం విపక్ష నేతకు ఎలాంటి గౌరవం ఇచ్చిందో తాము కూడా ఆవిధంగానే వ్యవహరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.