Jump to content

Recommended Posts

Posted

 

ప్రతి ఒక్కరికీ ఒక టైం వస్తుంది. అంతకు ముందు చవిచూసిన చీకటి రోజులు మరిచిపోయి ఇక భవిష్యత్తు అంతా నాదే అనుకుని గర్వపడితే.. మళ్లీ సూర్యాస్తమయం, మళ్లీ చీకట్లూ తప్పవు. ఈ చిన్న లాజిక్ మరిచిపోయి బీ.జే.పీ చేస్తున్న రాజకీయాలు ఈరోజు కాకపోయినా రేపయినా దేశాన్ని ఏకం చేస్తాయి. దానికి ఒక కొత్త నాయకత్వం రావచ్చు. చెప్పలేం. ఏ.పీ విషయంలో బీ.జే.పీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణా వాడికి కూడా బాధ కల్గించేంత ఘోరంగా ఉంది. ఏ.పీ కి బీ.జే.పీ చేసిన అన్యాయానికి చంద్రబాబు, జగన్ లు బీ.జే.పీ లో చేరినా ఏ.పీ ప్రజలు క్షమించే స్థితిలో లేరు. అనుక్షణం ఆంధ్రా ను అనాథ గా వదిలేస్తూ, అవమానిస్తూ, నిర్లక్ష్యం చేస్తున్న బీ.జే.పీ ఆ రాష్ట్రంలో ఎలా ఎదుగుదాం అనుకుంటుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 
అయితే ఏ.పీ వాళ్లు అన్నీ మరిచిపోతారు అలాగే బీ.జే.పీ చేసిన మోసాలు కూడా మరిచిపోతారు అని భ్రమ పడుతున్న బీ.జే.పీ కి తానా వేదిక గా గట్టి దెబ్బ తగిలింది. ఎన్.ఆర్.ఐ వేదిక నుంచి తెలుగు రాజకీయాలను నరుక్కువద్దామని ప్రత్యేక ఆహ్వానం తో వెళ్లిన డ్రామా మాధవ్ తీవ్ర అవమాన భారం తో తానా వేదిక దిగాల్సి వచ్చింది. అదేంటి పిలిచి అవమానిస్తారా అనొచ్చు. అది ఒకరిద్దరి సమావేశం కాదు... వేలాది తెలుగు వాళ్ల సమావేశం. ప్రతి తెలుగు వాడిలో గూడు కట్టుకుని ఉన్న బాధ ఒక్కసారిగా అందరి గొంతు లో ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వని కి వేదిక మీద నుంచి రమ్ మాధవ్ అడుగులు కిందకు పరుగు తీసే పరిస్థితి. అయినా బీ.జే.పీ ఏ.పీ కి చేసిన మోసం, అవమానంతో పోలిస్తే ఇదెంత. కొన్ని సార్లు బీ.జే.పీ అనుకోవచ్చు ‘‘మేము ఇబ్బంది పెట్టింది చంద్రబాబును కదా, తెలుగు వారెందుకు ఫీలవుతున్నారు ?’’ అని. చంద్రబాబు ను ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర అభివృద్ధి పై ఉక్కు పాదం మోపిన విషయం ఏ.పీ పౌరులకు తెలియదా? అంతెందుకు.... నిన్నటికి నిన్న ఏ.పీ కి బడ్జెట్లో ఎంత మోసం జరిగిందో తెలియదా? పేపరు చదివే తెలుగు వచ్చిన చిన్న పిల్లాడికి కూడా తెలుసు. ఏ.పీ లో ప్రజలకు బీ.జే.పీ మీద కోపం కాదు మంట ఉంటుంది. 
పైగా రాజకీయాలు తప్ప ఏ.పీ ప్రాణం పోయినా మాకేం సంబంధం అన్నట్లు వ్యవహరించే డ్రామా మాధవ్ వంటి వారిని చూసి తెలుగు వారికి ఇంకా గట్టిగా మండింది. ఎవడో ఉత్తరాది బీ.జే.పీ వాడు మనల్ని మోసం చేశాడంటే.. ఏదో అనుకోవచ్చు, ఏ.పీ కన్నబిడ్డలై ఉండి... కేవలం పార్టీ కోసం జన్మభూమి కి అన్యాయం చేసే రమ్ మాధవ్ వంటి వారిపై మోడీ మీద కంటే ఎక్కువ కోపం ఉంటుంది ఏ.పీ ప్రజలకు ! అది ఏ స్థాయిలో ఉంటుందో మొన్న జరిగిన తానా వేదికపై ప్రతిబింబించింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో.. .ఎన్.ఆర్.ఐ లు కూడా బీ.జే.పీ కి వ్య‌తిరేకంగా డిజిట‌ల్ ప్ర‌చారం గట్టిగా చేశారు. ఇదంతా తెలిసి కూడా డ్రామా మాధ‌వ్, పిలిచిన వెంటనే పొలోమంటూ తానా స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యాడు. ఏ.పీ ని మోసం చేసిందే కాకుండా ఈ వేదిక ద్వారా రాజకీయం చేద్దామనుకున్న రమ్ మాధవ్ కు ఎన్.ఆర్.ఐ లు గట్టిగా బుద్ధి చెప్పారు. రమ్ మాధవ్‌ మాట్లాడటం మొదలు పెట్టిన వెంటనే వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుపడ్డారు. అనూహ్య ప‌రిణామం తో షాక్ తిన్న రమ్.. ఎన్.ఆర్.ఐ లు కేకలు వేస్తున్నా ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశాడు. అయితే, కొందరు బీ.జే.పీ ని, మోడీ ని తిడుతూ కేకలు వేయడం తో ఇంకొంత సేపు ఉంటే కొడతారేమో అని భావించిన రమ్ మాధవ్ నొసలు చిట్లించు కుంటూ ప్రసంగాన్ని ఆపేశాడు. ఆ క్షణంలో డ్రామా మాధవ్ మొహం.లో నెత్తురు చుక్క కూడా లేదు.

 

Posted

https://www.facebook.com/satish.vemana

 

రామ్‌మాధవ్‌కు ఘనస్వాగతంతో పెద్దపీట వేసిన తానా

ఆయనకు అవమానం జరగలేదని వేమన, డా.మూల్పూరి వివరణ.

వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించిన 22వ తానా మహాసభల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్‌కు అవమానం జరిగిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఆయనకు తానా ఆధ్వర్యంలో మంగళవాయిద్యాలతో అమెరికా రాజధాని నగరంలో ఘనస్వాగతం పలికి ఆయనకు ప్రధాన వేదికపై ప్రముఖ స్థానం కల్పించామని తానా అధ్యక్షుడు వేమన సతీష్, సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావులు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. 22వ తానా సభలకు అన్ని రాజకీయ పార్టీల నుండి ప్రజాప్రతినిధులను ఆహ్వానించామని అందరికీ సమున్నత రీతిలో సమాదరణ కల్పించామని వారు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, , భాజపా నుండి రామ్‌మాధవ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ సీ.ఎం.రమేష్‌, వైకాపా నుండి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు, ఆంధ్ర ప్రదేశ్ శాశనసభ విప్ కోరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తెదేపా నుండి ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, తెలంగాణా శాశనసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రసమయి బాలకిషన్ తదితరులు హాజరయ్యారని ఈ సభల్లో వారి గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఆదరించామని వీరు తెలిపారు.

రామ్‌మాధవ్ ప్రసంగానికి 15నిముషాలు కేటాయించగా ఆయన 12నిముషాల ప్రసంగం అనంతరం తానా సభలకు వచ్చిన వెనుక చివరి వరుసలోని అతిథులు కొందరు అడ్డుతగిలారని, ముందు వరుసలో ఉన్న తానా కార్యవర్గ సభ్యులు గానీ, ప్రతినిధులు గానీ, విరాళాలు అందించిన దాతలు గానీ రామ్‌మాధవ్ ప్రసంగానికి అడ్డుచెప్పలేదని పేర్కొన్నారు. 20వేల మంది ప్రవాస అతిథులు సభలో నిండుగా ఉన్నప్పుడు రామ్‌మాధవ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారని, అలంటి సందర్భంలో ఎవరో వెనుక వరుసలోని వారు వేసిన కేకలు రామ్‌మాధవ్‌ను ఉద్దేశించినవి కావని, ఆయనను తానా సంస్థ అపారంగా గౌరవిస్తోందని వేమన సతీష్, వెంకటరావులు తెలిపారు. రామ్‌మాధవ్‌ను ప్రసంగం అనంతరం ఘనంగా సన్మానించామని, దేశంలోనే శక్తిమంతులయిన తెలుగువారిలో ఒకడిగా సభకు పరిచయం చేశామని ఆయన తిరుగుప్రయాణంలో విమానాశ్రయానికి వెళ్లబోయే ముందు కూడా సభలోని ఏర్పాట్ల పట్ల హర్షం వెలిబుచ్చారని తెలిపారు. తానా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను, కవులను, కళాకారులను, ప్రతిభావంతులను సమరీతిలో గౌరవిస్తుందని రామ్‌మాధవ్‌ను సంస్థ అవమానించిందనేది వాస్తవ విరుద్ధమని, అలాంటి వార్తలను తాము ఖండిస్తున్నామని వీరు వెల్లడించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...