snoww Posted July 10, 2019 Report Posted July 10, 2019 సాక్షి, అమరావతి : విభజన తర్వాత ప్రజలు ఆశించినంతగా పరిపాలన జరుగలేదని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. జాతీయ సగటుతో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి తక్కువేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...ఏపీలో వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందని.. ప్రస్తుతం ఆ అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంపై 3 లక్షల 62 వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపారన్నారు. తమ ప్రభుత్వం మానవ వనరులపై దృష్టి సారించి వారిపైనే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే యోచనలో ఉందన్నారు. రెవెన్యూ లోటు రూ. 66 వేల కోట్లు ‘2014-17 మధ్య రాష్ట్రంలో 5 శాతం వృద్ధిరేటు మాత్రమే నమోదైంది. ద్రవ్యోల్బణం జాతీయస్థాయిలో తగ్గింది. కానీ, ఏపీలో మాత్రం వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం ఆ పరిమితిని దాటి అప్పులు చేసింది. పన్ను రూపంలో వచ్చే ఆదాయం పరంగా చూసినట్లైతే తెలంగాణ కంటే మనం బాగా వెనుకబడి ఉన్నాం. మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. రాష్ట్ర రెవెన్యూ లోటు 66 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. తెలంగాణకు వచ్చినంతగా మనకు పన్ను ఆదాయం రావడం లేదు’ అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వృద్ధిరేటు ఎలా పెరిగినట్లు? ‘వ్యవసాయరంగంలో 1999- 2004 మధ్య కాలంలో 3.66 శాతం వృద్ధిరేటు ఉంది. 2004- 2009 మధ్య ఐదేళ్ల కాలంలో 6.14 శాతం నమోదైంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి తగ్గింది. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరిగిందనీ.. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించామంటూ అంచనాలు తయారు చేశారు. చేపల పెంపకం పెరిగినంతమాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది’ అని బుగ్గన ప్రశ్నించారు. మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి ‘గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను నీరుగార్చి ప్యాకేజీని ఆహ్వానించింది. ప్యాకేజీ ద్వారా చంద్రబాబు సర్కారు సాధించిందేమీ లేదు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రమే చెల్లించారు. నియమ నిబంధనలు విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలు రుణ సేకరణ చేశాయి. వివిధ కార్పోరేషన్లకు రూ. 18 వేల కోట్ల బకాయిలు మిగిల్చారు. అంగన్వాడీ మిడ్డే మీల్స్, హోంగార్డులు, ఔట్సోర్సింగ్, విద్యా, వైద్య, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖకు భారీగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యల నుంచి త్వరలోనే గట్టెక్కుతాం. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాం. ముఖ్యంగా విద్యా రంగానికి పెద్దపీట వేయాల్సి ఉంది. ఉదాహరణకు అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళను తీసుకుంటే అక్కడ రెవెన్యూ వచ్చేది హ్యూమన్ నుంచే. దేశ విదేశాల్లో పనిచేస్తూ వారు ఆదాయం పొందుతున్నారు. హ్యూమన్ క్యాపిటల్ను పెంచినట్లైతే అభివృద్ధి జరుగుతుంది’ అని బుగ్గన పేర్కొన్నారు. Quote
snoww Posted July 10, 2019 Author Report Posted July 10, 2019 ఏపీ ప్రభుత్వ శ్వేతపత్రాలపై స్పందించిన నారా లోకేష్ 10-07-2019 22:11:43 అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ‘‘ఆర్థికమంత్రిగారూ! మీరు శ్వేతపత్రాలు అన్నప్పుడే సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా ఉంటాయని ఊహించాం. మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారు?. ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. 2018-19 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2 లక్షల 49 వేల కోట్లు కేంద్ర ఆర్థికమంత్రి కూడా పార్లమెంట్లో అదే చెప్పారు. మీరు రూ.3 లక్షల 62 వేల కోట్లని అన్నారు. ఒకేసారి ఇంత ఎలా పెరిగింది. మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా.’’ అని లోకేష్ పేర్కొన్నారు. Quote
psycopk Posted July 10, 2019 Report Posted July 10, 2019 veedu yanamala live debate petali apudu evadi Telivi ento janalaki telustadi.. Patha gov appulu sare.. lafangi gadi dagra nundi chekka bodi gadi dagara nundi manaki ravalsina vati sangati enti?? daniki kuda oka 50 commitees vesada mana dog squad?? Quote
snoww Posted July 10, 2019 Author Report Posted July 10, 2019 1 minute ago, snoww said: ఏపీ ప్రభుత్వ శ్వేతపత్రాలపై స్పందించిన నారా లోకేష్ 10-07-2019 22:11:43 అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. ‘‘ఆర్థికమంత్రిగారూ! మీరు శ్వేతపత్రాలు అన్నప్పుడే సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా ఉంటాయని ఊహించాం. మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారు?. ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. 2018-19 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2 లక్షల 49 వేల కోట్లు కేంద్ర ఆర్థికమంత్రి కూడా పార్లమెంట్లో అదే చెప్పారు. మీరు రూ.3 లక్షల 62 వేల కోట్లని అన్నారు. ఒకేసారి ఇంత ఎలా పెరిగింది. మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా.’’ అని లోకేష్ పేర్కొన్నారు. the new government had inherited a debt burden of Rs 2.58 lakh crore, besides off-budget borrowings of Rs 58,000 crore and outstanding dues of Rs 18,375 crore to power sector, Rs 10,000 crore to civil supplies department and Rs 18,000 crore to other departments. Quote
Anta Assamey Posted July 10, 2019 Report Posted July 10, 2019 Central and State cheptunna Appula Numbers enduku different vunnayi ... Quote
Anta Assamey Posted July 10, 2019 Report Posted July 10, 2019 1 minute ago, snoww said: the new government had inherited a debt burden of Rs 2.58 lakh crore, besides off-budget borrowings of Rs 58,000 crore and outstanding dues of Rs 18,375 crore to power sector, Rs 10,000 crore to civil supplies department and Rs 18,000 crore to other departments. Just now, Anta Assamey said: Central and State cheptunna Appula Numbers enduku different vunnayi ... Thanks for clarifying .. Quote
Sucker Posted July 10, 2019 Report Posted July 10, 2019 3 minutes ago, Anta Assamey said: Central and State cheptunna Appula Numbers enduku different vunnayi ... Appulu yeggotti Vijay Malya la UK polema baa Quote
Anta Assamey Posted July 10, 2019 Report Posted July 10, 2019 1 minute ago, Sucker said: Appulu yeggotti Vijay Malya la UK polema baa Ante Jagan and CBN paripovali antava... Quote
Sucker Posted July 10, 2019 Report Posted July 10, 2019 Just now, Anta Assamey said: Ante Jagan and CBN paripovali antava... Anthe ga mari... Quote
snoww Posted July 10, 2019 Author Report Posted July 10, 2019 8 minutes ago, psycopk said: veedu yanamala live debate petali apudu evadi Telivi ento janalaki telustadi.. Patha gov appulu sare.. lafangi gadi dagra nundi chekka bodi gadi dagara nundi manaki ravalsina vati sangati enti?? daniki kuda oka 50 commitees vesada mana dog squad?? Buggana is very knowledgable vuncle. Root Canal Yanamala ni rafe sesi paaresthadu live debate lo Quote
psycopk Posted July 10, 2019 Report Posted July 10, 2019 Just now, snoww said: Buggana is very knowledgable vuncle. Root Canal Yanamala ni rafe sesi paaresthadu live debate lo Neku anti tdp evadu ** knowledgable ee including sulleman.. man i dont see that Quote
Android_Halwa Posted July 10, 2019 Report Posted July 10, 2019 11 minutes ago, psycopk said: veedu yanamala live debate petali apudu evadi Telivi ento janalaki telustadi.. Patha gov appulu sare.. lafangi gadi dagra nundi chekka bodi gadi dagara nundi manaki ravalsina vati sangati enti?? daniki kuda oka 50 commitees vesada mana dog squad?? avi release chesindi andhra jyothi paper odu kadu, Ministry of Finance, Government of AP official documents, Finance secretary create chesina documents avi, legally valid. Yanamala tho debate petanika idemana party vishayam anukunava samara... Quote
Hydrockers Posted July 10, 2019 Report Posted July 10, 2019 lokesh tweet chesada pressmeet pettada? మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖల ee rendu words correct ga anagalada? Quote
snoww Posted July 10, 2019 Author Report Posted July 10, 2019 అవగాహన లేమితో అసత్య శ్వేతపత్రం విడుదల: యనమల 10-07-2019 19:40:16 గుంటూరు: ప్రభుత్వం నేడు విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అవగాహన లేమితో అసత్య శ్వేత పత్రాన్ని విడుదల చేశారని విమర్శించారు. అది శ్వేతపత్రం కాదని, వాస్తవాల వక్రీకరణ పత్రం అని దుయ్యబట్టారు. టీడీఎల్పీ సమావేశం అనంతరం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. శ్వేతపత్రం పేరుతో టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని అన్నారు. రెండంకెల వృద్ధి రేటును కొనసాగించలేక వాస్తవాలను వక్రీకరించారన్నారు. రాష్ట్ర వృద్ధి రేటును కొనసాగించలేమని గుర్తించే.. శ్వేతపత్రంతో చేతులెత్తేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్థిక శాఖ శ్వేత పత్రంలో విద్యా, వైద్య రంగాలను ఏ అవగాహనతో కలిపారో చెప్పాలన్నారు. కష్టాల్లోనూ తెలుగుదేశం ప్రభుత్వం ఘనమైన వృద్ధి సాధించిందన్నారు. కొత్తగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల రాష్ట్ర వృద్ధి అర్థం కాక పొరబడ్డారేమోనని ఎద్దేవా చేశారు. వ్యవసాయాభివృద్ధి గురించి మంత్రికి అర్థం కాలేదో.. లేక అధికారులు ఆయనకు సరిగా చెప్పలేదోనని సందేహం వ్యక్తం చేశారు. అన్ని అనుబంధ రంగాల సమాహారమే వ్యవసాయ రంగం అని యనమల పేర్కొన్నారు. వాటిని విడదీసి వ్యవసాయ వృద్ధి లేదనడం సరికాదన్నారు. రాయలసీమలో వ్యవసాయం కంటే ఉద్యానవనం ఎక్కువ అని వివరించారు. వాస్తవాలను వక్రీకరించేందుకే వ్యవసాయం నుంచి ఉప రంగాలను విడదీసి చెప్పారని ఆరోపించారు. సేవారంగంలో హైదరాబాద్ లాంటి రాజధాని ఏపీకి లేదనే విషయాన్ని గుర్తించాలని మంత్రి బుగ్గనకు సూచించారు. పారిశ్రామికాభివృద్ధి 5ఏళ్లు తరుగుదల లేకుండా ఉందన్నారు. అప్పుల విషయంలోనూ మంత్రి అమాయకత్వం స్పష్టం కనిపిస్తోందని యనమల విమర్శించారు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం, ఏ దేశం లేదని పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.