Jump to content

Recommended Posts

Posted
భారత క్రికెట్‌ను ఇక దేవుడే రక్షించాలి 

ద్రవిడ్‌కు నోటీసులపై గంగూలీ 
దిల్లీ

8sports2a_5.jpg

విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేయడంపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ద్రవిడ్‌కే నోటీసులిచ్చారంటే భారత క్రికెట్‌ను ఇక దేవుడే రక్షించాలని అన్నాడు. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజయ్‌ గుప్తా ఆరోపణలపై అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ద్రవిడ్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించాడు. ‘‘భారత క్రికెట్లో విరుద్ధ ప్రయోజనాల అంశం ఇప్పుడు ఓ తమాషా అయిపోయింది. వార్తల్లో ఉండడానికి అదో అత్యుత్తమ మార్గం. భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే రక్షించాలి. విరుద్ధ ప్రయోజనాలపై బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నుంచి ద్రవిడ్‌కు నోటీసు వచ్చింది’’ అని గంగూలీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అతడికి హర్భజన్‌ సింగ్‌ మద్దతిచ్చాడు. ‘‘నిజంగా ద్రవిడ్‌కు నోటీసులిచ్చారా? ఇది ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. భారత క్రికెట్‌కు ద్రవిడ్‌ కన్నా మంచి వ్యక్తి దొరకడు. అలాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడమంటే వాళ్లను  అవమానించడమే. భారత క్రికెట్‌కు వాళ్ల సేవలు అవసరం’’ అని అన్నాడు. భారత జూనియర్‌ కోచ్‌గా, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉన్న ద్రవిడ్‌.. చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్య సంస్థ ఇండియా సిమెంట్స్‌లో ఉపాధ్యక్షుడిగా ఉండడం విరుద్ధ ప్రయోజనాలకు కిందికి వస్తుందన్నది సంజయ్‌ గుప్తా ఆరోపణ. అతడు ఇంతకుముందు సచిన్‌, లక్ష్మణ్‌లపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు.

Posted

Adi tappu kadu as per rule dravid should not be in india cements . Of course dravid is great person but adi rules ni violate chete tappe kada

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...