NenuEvaru Posted August 19, 2019 Report Posted August 19, 2019 కొత్త ఐటీ సెజ్ రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన మహతా ఇన్ఫర్మేషన్ ఇండియా నానక్రామ్గూడలో 7.172 ఎకరాల్లో ఏర్పాటుకు దరఖాస్తు 12,870 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి సూత్రప్రాయ ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు, హైదరాబాద్: దాదాపు దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కొత్త ఐటీ సెజ్ ఏర్పాటు కాబోతోంది. రాష్ట్రంలో 68 సెజ్(స్పెషల్ ఎకనమిక్ జోన్)లు ఉన్నాయి. ఇందులో 42 ఐటీవి. మిగిలినవి ఇతర రంగాలవి. చివరిసారిగా 2009లో ఐటీ సెజ్ ఏర్పాటయింది. ఐటీ రంగంలో ఒడిదుడుకుల కారణంగా ఆ తర్వాత ఈ రంగంలో కొత్త సెజ్లు ప్రారంభంకాలేదు. తాజాగా మహతా ఇన్ఫర్మేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని నానక్రామ్గూడలో రూ.1,147 కోట్ల పెట్టుబడితో 7.172 ఎకరాల్లో దీనిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంది. మొత్తం రూ.2,088 కోట్ల విలువైన ఎగుమతులు సాధిస్తామని, 12,870 మందికి ఉపాధి కల్పిస్తామని నివేదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని అనుమతుల మండలి ఆమోదం కోసం దీనిని పంపించింది. ఈ నెల ఆరున మండలి సమావేశం జరిగింది. అందులో దీనిపై చర్చించారు. మండలి నుంచి అధికారికంగా అనుమతి రావాలి. అది లభించిన వెంటనే సెజ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. భారీ ఉపాధి అంచనాలతో కొత్త ఐటీ సెజ్ వస్తూండడం ఈ రంగంలో ఆశావహ పరిణామం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.