TheBrahmabull Posted August 27, 2019 Report Posted August 27, 2019 హైదరాబాద్: అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వాడుకుని అనుకున్నదేదో సాధించడం ఒక ఎత్తు. అవకాశాలు సృష్టించుకుని మరీ అనుకున్నది సాధించడం బీజేపీ ఎత్తు. ఔను ! ఆరునూరైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటున్న కమలదళం ఇప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతోంది. సెప్టెంబర్ పదిహేడు, తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలక నేత అరెస్ట్.. ఈ రెండు వేర్వేరు టాపిక్స్ ఇప్పుడు గులాబీ బాస్కు చెమట్లు పట్టిస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రాన్నీ తమ ఖాతాలో వేసుకుంటూ దేశం యావత్తూ కాషాయ పతాకం కిందకు తీసుకురావాలని చూస్తున్న మోడీ- షా సైన్యం ఇప్పుడు తెలంగాణ కోటపై జెండా ఎగురవేయడానికి అవకాశాలు సృష్టించుకునే పనిలో పడింది. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం విషయంలో రెండు నాల్కల ధోరణితో ఉన్న కేసీఆర్కు ఇప్పుడు ఆ డేట్ గుర్తుకు వస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సెప్టెంబర్ 17 లోపు తెలంగాణలోని ఒక కీలకమైన నేతను అరెస్ట్ చేసి ఆ తరువాత జరిగే పరిణామాలను సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని చేరువకావాలనే ఆలోచనలో కమల దళపతులు ఉన్నారని సమాచారం. తెలంగాణలో ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను, మీడియాను తన గుప్పిట్లో పెట్టుకొని తనకు ఎదురేలేదని అనుకుంటున్న టీఆర్ఎస్ నేతకు జెట్ స్పీడ్ వ్యూహాలతో దూసుకొస్తున్న బీజేపీ భూతంలా కనిపిస్తోంది. వారి నుంచి ఎలా బయటపడాలో తెలియక రెవెన్యూ శాఖ రద్దు, కొత్త చట్టాల తయారీ అంటూ రోజుకో కొత్త అంశం తెరపైకి తెస్తూ ప్రజలను గందరగోళంలో ఉంచుతున్నారు. ఎవరికి భయపడి సెప్టెంబర్ 17ను విమోచన దినం ఉత్సవాలను నిర్వహించడం లేదో.. ఆ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని తెలంగాణాలో తాను అనుకున్నది సాధిస్తున్న కేసీఆర్కు ఈసారి బలమైన దెబ్బ పడాలని బీజేపీ గురిగా కనిపిస్తోంది. అందుకు తగిన ఆయువుపట్టుపై గట్టిగా కొట్టాలని వ్యూహాలు సిద్ధం చేసింది. ఇదే ఇప్పుడు కేసీఆర్కు నిద్ర పట్టనివ్వడం లేదు. బీజేపీ చేతిలో ఉన్న ఈ రెండు అస్త్రాలని గురి తప్పకుండా ప్రయోగిస్తే మాత్రం గులాబీ గిలగిలలాడటం ఖాయంగా కనిపిస్తుంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.