ariel Posted September 30, 2019 Author Report Posted September 30, 2019 #సచివాలయ జాబ్స్ ల #స్కామ్ నీ నేను #బైటపెడతా ఒక్క సారి #అవకాశం ఇవండీ #CM గారు Quote
ariel Posted September 30, 2019 Author Report Posted September 30, 2019 జగనన్నా...ఇదేం న్యాయం అన్నా? నాన్నను రిలయన్స్ వాళ్లే చంపేశారని నువ్వంటే.. వారి బంకులు తగలబెట్టాం చంద్రబాబు హయాంలో పెద్దాయన ప్రతీవర్ధంతికి మా నాన్న హత్యపై దర్యాప్తు చేయాలనేటోడివి. ఇప్పుడేమైందన్నా? అస్సలు ఆ ఊసే లేదు. ..................................................................................................... మానుకోటలో నీపై రాళ్లేయించిన ముక్కోడిని నానా బూతులు తిట్టాం ఆంధ్రోళ్లది పేడబిర్యానీ అంటే.. ఆడి గబ్బు నోరు మూయించాం ఆంధ్రా బేపనోళ్లకి మంత్రాలు సదవీనికి సరిగా రాదన్న కచరాని మంత్రాలతోనే తిప్పికొట్టాం. అటు సోనియానీ, ఇటు కేసీఆర్నీ ఎదిరించిగల ఒకే ఒక పులివెందుల పులని జైకొట్టాం. నువ్వేమో పిల్లిలా మారిపోయి ప్రగతిభవన్ లో మ్యావ్ మ్యావ్ అంటున్నావు..నీకేమైందన్నా? ............................................................................................................ సమైక్యాంధ్ర ప్రదేశ్ కి కట్టుబడి ఉంటానంటివి..చంద్రబాబువి రెండుకళ్ల సిద్ధాంతమని ప్రచారం జేస్తివి. ఇప్పుడు ఉన్న మెల్లకన్నునూ పొడిచేసి...తెలంగాణ కంటితో చూస్తున్నావు. నీకు ముఖ్యమంత్రి కంటివెలుగు పథకంలో చూపించుకోరాదే అన్నా. .......................................................................................................... 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలంటివి.. చట్టం జేస్తివి వాచ్ మన్, తట్టలు మోసేవి, రిక్షాలు తొక్కేవి స్థానికులకు ఇచ్చి .. నెలకు 4లక్షలకు పైగా వచ్చే సలహాదారు ఉద్యోగాలన్నీ తెలంగాణవాళ్లకిస్తివి. రాష్ర్ట విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మి.. సమైక్యాంధ్రగా ఉన్నప్పుడే ఏపీ గొంతు నొక్కాలని విశ్వప్రయత్నాలు చేసిన తెలంగాణ మేధావులైన జర్నలిస్టులు దేవులపల్లి అమర్, కొండుభట్ల రామచంద్రమూర్తి, అరవింద్ యాదవ్ లకు ఒక్కొకరికీ నెలకు 4 లక్షలకు పైగా చెల్లిస్తూ ఏపీని ఏం చేయాలనుకుంటున్నావన్నా? వీళ్లంతా నువ్వు తెచ్చిన 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాల చట్టం వర్తించదా అన్నా? .......................................................................................................................... వెల్లువెత్తిన వరదతో డ్యాంలు కొట్టుకుపోతాయేమోననే ఆందోళనలోనూ పోతిరెడ్డిపాడుకు నీరు తీసుకెళ్లకుండా ఫిర్యాదులు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి గోదావరి జలాలు రాయలసీమకు తెస్తానని నమ్మబలుకుతున్నావు..ఇది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడంలాంటిదే అన్నా. .......................................................................................................................... రాజధాని పోతే పోయింది..పోలవరాన్ని ఎటువంటి ఇబ్బందుల్లేకుండా కట్టుకోవాలనే ఆలోచనతో 7 ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయించిన గొప్ప ముందుచూపున్న చంద్రబాబు 70 శాతం పోలవరం పనులు పూర్తిచేస్తే..30 శాతం పనులు పూర్తి చేసి ఆంధ్రుల జీవనాడిని అందించాల్సింది పోయి కేసీఆర్ ఎత్తులకు చిత్తయి పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలేవైతే ఉన్నాయో , అవి చాలా అన్యాయం జగనన్న. .......................................................................................................................... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గుడిలో బడిలో నామినేటెడ్ పదవులన్నింటిలోనూ 50 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన పదవులు ఇస్తామని చట్టం తెచ్చిన నువ్వే...ఒక్క రాష్ర్టస్థాయి నామినేటెడ్ పోస్టూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వకుండా మొత్తం మీ రెడ్లతో నింపేశావు..ఇదేనా అన్నా నువ్వు తెచ్చిన చట్టం చేసిన సామాజిక న్యాయం? .......................................................................................................................... కొరతలు, కోతలకు చంద్రబాబుకు కారణమని ఆరోపిస్తున్న మీరు..చంద్రబాబు హయాంలో జరిగిన ప్రగతి పనుల ఫలాలకు వస్తున్న అవార్డులను మాత్రం ఎగేసుకుని వెళ్లీ మరీ అందుకుంటున్నారు. సిగ్గనిపించడంలేదన్నా? .......................................................................................................................... ప్రమాణస్వీకారం చేశాక కుల,మత,ప్రాంతాలకు అతీతంగా పార్టీలను పట్టించుకోకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు, పథకాలు అందిస్తామని మాటిచ్చిన మీరు... రెడ్లకు తప్పించి ఎవరికైనా న్యాయం చేశారా అన్నా? మీ వైకాపా వారికే వలంటీర్లు, గ్రామ సచివాలయం పోస్టులు ఇప్పించుకున్నారని విజయసాయిరెడ్డి గారే ప్రకటించారు. వైకాపాలోనే మళ్లీ రెడ్లకే అత్యధికం వచ్చేలా చేసిన మీరు కుల, మత, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పనిచేస్తానని చెప్పిన మాట తప్పుడే కదా అన్నా. .......................................................................................................................... సన్నబియ్యం అని ..ఆ తరువాత నాలుక మడతేసి నాణ్యమైన బియ్యం ప్రకటించి చివరికి నానిన బియ్యం ఇచ్చిన మీరు రూపాయి బియ్యానికి 9 రూపాయిల సంచికి ఇవ్వడం మడమ తిప్పి..డబ్బు కోసం తప్పుడు పని చేశారా కాదా అన్నా? .......................................................................................................................... అన్నం పెట్టే క్యాంటీన్లకు సున్నం వేయడమేనా రాజన్న రాజ్యము? .......................................................................................................................... సాక్షిలో పనిచేసే ఉద్యోగుల మొత్తాన్ని ప్రభుత్వంలోకి రకరకాల పేర్లతో తీసుకుని నెలకు వంద కోట్లు వారికి జీతాలు రూపేణా, సౌకర్యాల పేరిట పందేరం చేస్తున్న జగనన్న..రైతన్న నీకేం అన్యాయం చేశాడన్నా? అప్పుల్లో మునిగిన అన్నదాత నోటికాడ రుణమాఫీని 7,582 కోట్లు లాక్కున్నావు. నీకున్న లక్షల కోట్లలో ఇదెంతన్నా? అన్నం పెట్టేవాడికి కన్నం పెట్టావు కదన్నా? .......................................................................................................................... టీడీపీ హయాంలో అవినీతి అంటూ నరేగా బిల్లులు చెల్లించొద్దంటూ కేంద్రానికి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో ఫిర్యాదులు చేయించావు. అవినీతి ఏం లేదని కేంద్రం తేల్చింది. మీరు అధికారంలోకొచ్చాక మీ ఫిర్యాదులతో నిలిచిన నిధులు, ఏపీకి రావాల్సినవి రూ. 1969 కోట్లు విడుదల చేసింది. వీటితో పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..అలా చేయడంలేదు. రాష్ర్టవాటా జమ చేయాల్సి ఉన్నా చేయడంలేదు. ఉపాధిలో ఫస్ట్ ఉన్న రాష్ర్టాన్ని లాస్ట్ చేశావు కదన్నా? ........................................................................................................................ MGNREGA పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ 2014 నుంచి 2019 ఆరంభం వరకూ 26000 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు, 6 వేల అంగన్ వాడీ భవనాలు నిర్మాణం, 2200 గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణం , 12,000 కిలోమీటర్ల రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 7,00,000 పంట కుంటలు తవ్విదేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నిలిచింది. ఇప్పుడు మీరు అప్పుడు కట్టిన భవనాలన్నింటికీ వైకాపా రంగులేస్తున్నారు. అప్పుడు సాధించిన ప్రగతికి వచ్చిన అవార్డులు అందుకుంటున్నారు. శ్మశానాలకు సైతం బులుగు రంగు పులుముతున్నారు. కూలీలకు వేతనాలు పెండింగ్, ఉపాధి క్షేత్రస్థాయి ఉద్యోగులను నడిరోడ్డున పడ్డారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం జగనన్నా? .......................................................................................................................... .........ఒక్క చాన్స్ ఇచ్చి వందేళ్లు వెనక్కి వెళ్లిన దగా పడిన సీమాంధ్రుడు............ Quote
ariel Posted September 30, 2019 Author Report Posted September 30, 2019 ఎన్ని ఘోర అసత్యాలు ప్రచారం చేశార్రా? అధికారం కోసం ఎన్ని అన్యాయాలు చేశార్రా? పేటీఎమ్ డబ్బుల కోసం ఒక రాష్ర్టాన్నే నాశనం చేశారు కదరా. నెలకు 15 వేలు తీసుకుని ఫేక్ పోస్టులు, మార్ఫింగులతో సోషల్ మీడియాలో చెలరేగిపోయి ఆంధ్రప్రదేశ్ ని అనాథ గా మార్చారు. ..................................................... పింక్ డైమండ్ కరకట్ట ఇంట్లో ఉందంటాడు ఒక నీతిలేని అర్చకుడు బ్రాహ్మణి హారంలో ఉన్నదే పింక్ డైమండ్ అంటాడు వైకాపా అర్భకుడు మీరు అధర్మంగా తెచ్చిన మీ ధర్మారెడ్డి అస్సలు పింక్ డైమండే లేదంటున్నాడు. ఇదెందుకో తెలుసా? టీటీడీ వేసిన పరువునష్టం కేసు నుంచి వైకాపా నీడల్ని తప్పించేందుకు. పింక్ డైమండ్ పేరుతో వైకాపా మంకీలు ఎంత అసత్యప్రచారం చేశారో? ఇప్పుడు మీ నవరంధ్రాల్లో ఏం పెట్టుకుంటార్రా? ................................................................. శేఖర్ రెడ్డి వద్ద లోకేశ్ 100 కోట్లు తీసుకుని టీటీడీ సభ్యుడ్ని చేశారని ఆరోపించారు. ఇప్పుడెన్ని కోట్లు తీసుకుని శేఖర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడ్ని చేశారో చెప్పగలవా? ,................................................ పట్టిసీమ వేస్ట్..అది కట్టిన మేఘా క్రిష్ణారెడ్డి చంద్రబాబు బినామీ అని ఆరోపించావు. ఇప్పుడు అదే క్రిష్ణారెడ్డికి పోలవరం అప్పజెబుతున్న జగన్ ఎవరి బినామీయో తేల్చండి. ........................................................................ ప్రకాశం బ్యారేజీకి అడ్డంగా బోటు పడితే తీయడానికి వారం రోజులు పట్టింది మీకు. గోదావరిలో బోటు మునిగి రెండు వారాలైంది. నేటికీ తీయించే దమ్ములేదు. జగనన్న సత్తా అంటూ చెత్త రాతలు రాసిన వాళ్లంతా ఏడ చచ్చార్రా? ............................................................. సినిమా షూటింగ్ కోసం పుష్కరాలలో 29 మందిని చంపేశారని ప్రచారం చేశారు. ఇప్పుడు గోదావరిలో ఏ షూటింగ్ చేస్తూ 50 మందిని ముంచేశార్రా? ............................................................................. జన్మభూమి కమిటీ సభ్యులపై అరాచకాలంటూ ప్రచారం చేశారు. మీ వైకాపా గ్రామ వలంటీర్లు నరరూపరాక్షసులయ్యారు. ఇప్పుడేమంటారు? ............................................................................ 35 మంది కమ్మ డీఎస్సీలకు ప్రమోషన్లిచ్చారని గగ్గోలు పెట్టారు. అందులో ఐదుగురే కమ్మ అయినా మీ విషప్రచారం కొనసాగించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక 200 పదవులు, పోస్టులలో రెడ్లను నియమించుకున్నారు. సచివాలయ పోస్టులూ వారికే. ఇప్పుడు మీ నోట్లో ఏ గడ్డ అడ్డుపడింది మాట్లాడటానికి? .......................................................................... టీడీపీ హయాంలో 4 శాతం ఎక్సెస్ కి టెండర్ వేసినోడు ..100 రోజులలో పూర్తి చేసిన పని 0.90 శాతం. అంటే అస్సలు పనే ప్రారంభించలేదు. అదే సంస్థ ఇప్పుడు లెస్ కి అదేనండి రివర్స్ లో దాదాపు 50 కోట్లు మిగిల్చేలా పనిచేస్తామని ఒప్పుకుంది.. అంటే రివర్స్ లో ఈ పని ఎప్పటికవుతుందో ఒక్కడి నోరూ పెగలదేం? ................................................................................... అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతి అని అరిచారు. 11 కోట్లతో సున్నమేసి మూతేశారు. మూసేందుకు సున్నమేసి 11 కోట్లకు కన్నమేసిన వైకాపాపై ఒక్క పోస్టూ పెట్టరెందుకు? ...................................................................................................... ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతోందని సభలు సమావేశాలు పెట్టిన అజయ్ కల్లం రెడ్డి, ఐవైఆర్ క్రిష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లక్ష్మణరెడ్డి, బీసీ సంఘం క్రిష్ణయ్య, ఆంజనేయరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, లక్ష్మీపార్వతి వంటి వారందరికీ నోర్లు పడిపోయాయా? లేదా పక్షవాతం వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ అన్యాయమైపోతున్నా..ఒక్క ఒక సమావేశం పెట్టరేం? జాతి, నీతి అంటూ కంచం ప్లేటు కొట్టిన ముద్రగడ, అడిగిన వెంటనే రిజర్వేషన్లు చంద్రబాబు ఇచ్చేశాడనే కోపంతో అదే ఖాళీ కంచం మింగేశాడా ఏంటి? నోరు పడిపోయింది. జగన్ రెడ్డి కాపు రిజర్వేషన్లు ఎత్తేసినా నోరెత్తకుండా, చంద్రబాబుకే ప్రేమలేఖలు రాస్తున్నాడెందుకు? .................................................................................. కమలపుష్పాలైన వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి, కన్నా, జీవీఎల్ వంటి వారు కూడా నోటికి ప్లాస్టరేసుకున్నట్టున్నారు. కన్నాని అడ్డుకున్నా..ఆలయాల స్థలాలు ఇతర మతాలకు ధారాదత్తం చేసినా, టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నా.. అన్నివర్గాలను తొక్కేసి రెడ్లనే అందలం ఎక్కిస్తున్నా..క్రిస్టియానిటీకి పెద్ద పీట వేస్తున్నా కమలనాథులు కామ్ గా ఉండటం వెనుక అంతరాత్థం ఏమిటో? ............................................................... ఏం జరిగినా చంద్రబాబు వైఫల్యమే అంటూ పోస్టులయి కూశారు, అసత్యాలు రాశారు. ఇప్పుడు మీరంతా ఎక్కడున్నారు? నాలుగు నెలల్లో 4 దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయి దయనీయస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేవి మీకు ఉంటే ఒక్క ముక్కయినా మాట్లాడండి.. ఒక్క పోస్టయినా పెట్టండి..ఒక్క ట్వీటైనా ట్వీటండి. లేదంటే రెమ్యూనరేషన్ తీసుకుని నటించి వెళ్లిపోయే నటులకు, తాత్కాలిక సుఖం కోసం వెంపర్లాడే విటులకు మీకు తేడా లేకుండా పోతుంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.