Armanii Posted January 11, 2020 Report Posted January 11, 2020 పది మంది లేరు అని అవహేళన చేసారు వందల సంఖ్యలో రైతులు రోడెక్కారు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు ఆగ్రహంతో వేలాదిగా మహిళలు రంగంలోకి దిగి కదం తొక్కారు 4 గ్రామాల వారే ఉద్యమం చేస్తున్నారు అని నవ్వారు వేలాదిగా విద్యార్థులు ఉద్యమానికి తోడై జాతీయ రహదారులను సైతం స్తంభించారు 29 గ్రామాల్లో జరిగితే ఉద్యమమా?రైతు అనేవాడు గోచి కట్టుకొని నోరు మూసుకొని బురదలో ఉండాలి అని ఎద్దేవా చేసారు 2 జిల్లాల ప్రజలు రోడ్ల పైకి వచ్చి సింహాల్లా గర్జించారు డ్రామా కంపెనీ వాళ్లు రోడ్ల పైకి వచ్చారు అంటూ కించపర్చారు 4 జిల్లాలో ఉద్యమం పురుడు పోసుకొని అమరావతి కోసం గొంతు విప్పుతున్నారు వాళ్లంతా రైతులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ అరవడం మొదలు పెట్టారు 13 జిల్లాలో మాకు వద్దు ఈ మూడు రాజాధానులు,ముప్పై రాజధానులు అంటూ సకల జనులు నినదిస్తున్నారు మహిళల్ని రోడ్ల పై ఈడ్చుకెళ్ళి,లాఠీ ఛార్జ్ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత కూడా స్టేషన్ లో నిర్బంధించారు ఈ ప్రభుత్వానికి బొంద పెడతాం అంటూ మహిళలు పోలేరమ్మ కు మొక్కారు అనారోగ్యంతో చస్తే ఉద్యమం కోసం చనిపోయారు అని బిల్డ్ అప్ ఇస్తున్నారు అని అన్నారు ప్రాణాలైనా అర్పిస్తాం ,అమరావతి ని సాధిస్తాం అని రైతులు ,మహిళలు ,విద్యార్థులు అనే పరిస్థితి తెచ్చారు పాకిస్తాన్ బోర్డర్ ని తలపించేలా పోలీసులను రంగంలోకి దించారు ప్రభుత్వం అంతు చూస్తాం అంటూ ఉద్యోగులు ,లాయర్లు,డాక్టర్లు,యాక్టర్లు అమరావతి కోసం గళం ఎత్తుతున్నారు ఇప్పుడు చెప్పండి ఉద్యమానికి ఊపిరి పోసి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నది ఎవరు ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.