Armanii Posted February 16, 2020 Report Share Posted February 16, 2020 ఎన్నికల్లో పోలింగ్ బూత్కు వెళ్ళకుండానే ఓటు వేయడానికి వీలు కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. దీని కోసం ఐఐటీ-మద్రాస్ సహకారం తీసుకుంటోంది. ఈ వివరాలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా వెల్లడించారు. ’’ఉదాహరణకు లోక్సభ ఎన్నికల సమయంలో చెన్నై ఓటరు ఢిల్లీలో ఉంటే, తన నియోజకవర్గంలో ఓటు వేయడానికి వెళ్ళకుండా, ఎన్నికల సంఘం (ఈసీ) ముందుగా నిర్ణయించి, ఏర్పాటు చేసిన కేంద్రానికి వెళ్ళి, ఉదాహరణకు కన్నాట్ ప్లేస్లో ఉంటే, అక్కడికి వెళ్ళి, ఓటు వేయవచ్చు’’ అని సక్సేనా తెలిపారు. ముందుగా నిర్ణయించిన కేంద్రానికి, ముందుగా నిర్ణయించిన సమయంలో ఓటరు వెళ్ళవలసి ఉంటుందని చెప్పారు. ఓటరు తన ఇంటి దగ్గర నుంచి ఓటు వేయవచ్చునని భావించరాదని వివరించారు. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం పరిశోధన, అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలిపారు. దీనిని బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించి అభివృద్ధిపరుస్తున్నట్లు వివరించారు. ఇది టూ-వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అని, ఇది దీనికోసమే కేటాయించిన ఇంటర్నెట్ లైన్స్పై వైట్ లిస్టెడ్ ఐపీ డివైస్లు, బయోమెట్రిక్ పరికరాలు, వెబ్ కెమెరాలతో పని చేస్తుందని తెలిపారు. ఈ రిమోట్ ఓటింగ్ ప్రాసెస్ ఎన్నికల సంఘానికి చెందిన బయోమెట్రిక్స్, వెబ్ కెమెరాలను ఉపయోగించే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్పై పని చేసే బహుళ అంచెల ఐటీ ఎనేబుల్డ్ విధానమని, దీని ద్వారా ఓటరు గుర్తింపు, అధికారిక సమ్మతి పొందవలసి ఉంటుందని చెప్పారు. ఓటరు గుర్తింపు రుజువైతే ఈ-బ్యాలెట్ తయారవుతుందన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆ ఓటును భద్రపరుస్తామన్నారు. దీనికి సంబంధించిన బ్లాక్ చైన్ హ్యాష్ట్యాగ్ జనరేట్ అవుతుందని, ఈ హ్యాష్ట్యాగ్ నోటిఫికేషన్ను అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు పంపుతామని చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted February 16, 2020 Report Share Posted February 16, 2020 Manollu security pettadam lo ditta man... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.