kakatiya Posted March 19, 2020 Report Posted March 19, 2020 రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అమరావతి: కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు రక్షణ చర్యలు పాటించాలని ఆయన సూచించారు. ఈ మేరకు సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 31 వరకు థియేటర్లు, మాల్స్ బంద్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపడుతోంది కాబట్టే రాష్ట్రంలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయని మంత్రి వివరించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు సహకారమూ తప్పనిసరి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలు పాటిస్తూ ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని.. అవసరమైతే తప్ప బయటకు రాకూడని ఆళ్ల నాని సూచించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.