Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్: వాన్‌పిక్ వ్యవహారంలో అరెస్టై సెర్బియాలో జైలులో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ రిలీజయ్యారు. రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో కొంతకాలం క్రితం సెర్బియా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన సెర్బియా జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం అధికారులు నిమ్మగడ్డను క్వారంటైన్‌కు తరలించారు. 

Posted

ee teddu vesina vallu yevaro kani...lemon was always in India

Posted

enduku bhayya itlanti falthu paper cuttings vestharu meku  edo anni telisinatlu, nimmagadda prasad release anta bokka anta ayana eda unnado kuda teliyadu meku

Posted
9 minutes ago, bhaigan said:

enduku bhayya itlanti falthu paper cuttings vestharu meku  edo anni telisinatlu, nimmagadda prasad release anta bokka anta ayana eda unnado kuda teliyadu meku

tamaku telusa @bhaingan?

 

Posted
30 minutes ago, Narcos said:

tamaku telusa @bhaingan?

 

anduke kada pulka lu  ituvanti pichakuntla conspiracy theories anni rasthunaru

Posted

నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియాలో అరెస్టయ్యారనే వార్తలు వెలువడగానే.. ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ప్రయత్నాలు చేశారు. వారు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారని ప్రచారం జరిగింది. సెర్బియాతో సంప్రదింపులు జరిపి.. నిమ్మగడ్డను సురక్షితంగా భారత్ కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని వారు విదేశాంగ మంత్రికి లేఖ రాశారని వార్తలొచ్చాయి. జగన్‌తో నిమ్మగడ్డకు సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణమని ప్రచారం జరిగింది. 
 

 

Posted

ఇదీ వాన్ పిక్ వ్యవహారం..

వాడరేవు అండ్‌ నిజాంపట్నం ఇండస్ట్రియల్‌ కారిడార్‌’ సంక్షిప్త రూపమే ‘వాన్‌పిక్‌’. తీర ప్రాంత అభివృద్ధి పేరిట వైఎస్ హయాంలో 2005-06లో వాన్‌పిక్‌ కోసం భూ సేకరణ చేపట్టారు. ఇందుకు గుంటూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 29 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఎకరానికి గరిష్ఠంగా లక్షన్నర రూపాయలు మాత్రమే ఇచ్చారని, ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా బెదిరించి మరీ భూములు లాక్కున్నారనే ఆరోపణలొచ్చాయి. ‘వాన్‌పిక్‌’ ప్రాజెక్టు ముందస్తు అంచనాలతో చాలా మంది నేతలు ఇక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వాటిలో చాలావరకు అసైన్డ్‌ భూములు కూడా ఉన్నాయి. 

సేకరించిన భూములను నాటి ప్రభుత్వం కొంతమంది పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. వాన్‌పిక్‌కు గుంటూరు జిల్లా నిజాంపట్నం రైతులు 4 వేల ఎకరాలు, దిండి రెవెన్యూ గ్రామ పరిధిలో రైతులు 5 వేల ఎకరాలు, అడవుల దీవి గ్రామ పరిధిలో 1400 ఎకరాలు, అడవిపాలెం గ్రామ పరిధిలో రైతులు 286 ఎకరాలు, కళ్లిపాలెం రైతులు 607 ఎకరాల భూములు ఇచ్చారు. అన్ని వేల ఎకరాల భూమి సేకరించినా వాన్‌పిక్‌ ప్రాజెక్టు అంగుళం కూడా కదల్లేదు. ఇందులో పెద్ద ఎత్తున అవనీతి జరిగిందని పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఈ కేసులో జగన్‌తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయి 16 నెలలపాటు జైలులో గడిపారు. రెండేళ్ల కిందట వాన్‌పిక్‌కు చెందిన 11,804 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది. 

Posted

మంత్రి మోపిదేవి వెంకటరమణ Now sent to Rajya Sabha along with Ambuni  friend correct ?

 

connect the dots bulloruuuuu 

Posted
Just now, Armanii said:

నిమ్మగడ్డ ప్రసాద్‌ సెర్బియాలో అరెస్టయ్యారనే వార్తలు వెలువడగానే.. ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ప్రయత్నాలు చేశారు. వారు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారని ప్రచారం జరిగింది. సెర్బియాతో సంప్రదింపులు జరిపి.. నిమ్మగడ్డను సురక్షితంగా భారత్ కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని వారు విదేశాంగ మంత్రికి లేఖ రాశారని వార్తలొచ్చాయి. జగన్‌తో నిమ్మగడ్డకు సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణమని ప్రచారం జరిగింది. 
 

 

hmm inka

if you have fowers i have fowers who is ACB

if you have nimmagadda i have nimmagadda too

Posted
28 minutes ago, Narcos said:

ee teddu vesina vallu yevaro kani...lemon was always in India

Sakshi tappu chepindi adhyakshaaa 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...