kakatiya Posted April 3, 2020 Report Posted April 3, 2020 ఏపీలో తొలి కరోనా మరణం నమోదు విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన వ్యక్తి(55) కరోనా వైరస్తో బాధపడుతూ సోమవారం మృతి చెందినట్లు వెల్లడైంది. కరోనా మరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. మార్చి 30న ఉదయం 11.30గంటలకు చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని, గంట వ్యవధిలో మధ్యాహ్నం 12.30గంటలకు ఆ వ్యక్తి చనిపోయాడని ప్రభుత్వం ప్రకటించింది. కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోకిందని వైద్యులు భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన బాధితుడికి హైపర్ టెన్షన్, డయాబెటిస్ కూడా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అతని కుమారుడు ఇటీవల దిల్లీలో జరిగిన మత పరమైన ప్రార్థనలకు హాజరై మార్చి 17న ఇంటికి తిరిగి వచ్చాడని అధికారులు గుర్తించారు. మార్చి 30న అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, అదే రోజు అతని తండ్రిని కూడా చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకురాగా, గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.