r2d2 Posted June 15, 2020 Report Posted June 15, 2020 తిరువనంతపురం: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను ప్రజలంతా మహమ్మారి అంటూ తిట్టుకుంటూ ఉంటే కేరళకు చెందిన ఓ వ్యక్తి మాత్రం కరోనాను దేవతగా కొలుస్తున్నాడు. వైరస్పై పోరాడే వారిని క్షేమంగా ఉంచాలంటూ వైరస్నే ప్రార్థిస్తున్నాడు. రోజూ పూజలు కూడా చేస్తున్నాడు. కేరళలోని కడక్కల్కు చెందిన అనిలన్ అందరినీ క్షేమంగా ఉండేలా చూడాలంటూ కరోనాకు ప్రతిరోజూ పూజలు చేస్తున్నాడు. ‘‘కరోనా వైరస్ను దేవతగా పూజిస్తున్నా. దానికి వ్యతిరేకంగా పోరాడే వైద్యాధికారులు, పోలీసులు, వ్యాక్సిన్ను కనుగొనేందుకు శ్రమిస్తున్న సైంటిస్టులు, మీడియా ప్రతినిధులు, కొవిడ్-19 నిర్మూలనకు పాటుపడుతున్న ప్రతిఒక్కరినీ కాపాడాలని వైరస్ను వేడుకొంటున్నా. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను పట్టించుకోను. ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఇది’’ అని అనిలన్ అంటున్నాడు.వైరస్ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రార్థనా మందిరాలు, ఆలయాలు తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు అనిలన్ తెలిపాడు. కాగా అతడు ఎంచుకున్న ఈ విధానం సరైంది కాదని పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.