Jump to content

Recommended Posts

Posted
కరోనా మృతదేహాల తరలింపులో నిర్లక్ష్యం

నిబంధనలు పాటించని అధికారులు
నిజామాబాద్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌
బాధ్యులపై క్రిమినల్‌ కేసులకు ఆదేశాలు

కరోనా మృతదేహాల తరలింపులో నిర్లక్ష్యం

ఈనాడు, నిజామాబాద్‌, హైదరాబాద్‌: నిజామాబాద్‌ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్‌ రోగుల మృతి ఘటనకు మరో వివాదం తోడైంది. కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాల తరలింపులో కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేశారు. ప్రభుత్వ అంబులెన్సులో తరలించి ఖననం చేయాల్సిన చోట.. ఆటో, ప్రైవేటు అంబులెన్స్‌ల్లో తరలించారు. వీటి ఖర్చులు బాధిత కుటుంబాలే భరించాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఆటోలో మృతదేహం తరలింపు చిత్రం శనివారం స్థానిక‘ఈనాడు’లో ప్రచురితమైంది. ఈ చిత్రంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. సర్కారు తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి శనివారం ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లందరూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సాయంత్రానికల్లా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం మార్చురీ సిబ్బందికి తాఖీదులిచ్చారు.  నిజామాబాద్‌ సర్వజన ఆసుపత్రిలో గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటేలోపు ముగ్గురు కరోనా, ఒకరు అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే. ఆక్సిజన్‌ అందక చనిపోయారంటూ మృతుల కుటుంబీకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కరోనాతో చనిపోయిన మృతదేహాల తరలింపులో కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించలేదనే మరో వివాదం తెరపైకి వచ్చింది. మృతదేహాల తరలింపునకు మృతుల బంధువులతో పాటు పోలీసులు శుక్రవారం గంటల తరబడి వేచి చేశారు. చివరకు అంబులెన్సు కోసం పోలీసులు ఆసుపత్రి అధికారులను సంప్రదించగా వారు ఇన్‌ఛార్జి నంబరు ఇచ్చారు. ‘కొవిడ్‌ ప్రొటోకాల్‌లో ఒక్కటే అంబులెన్సు ఉంది. డ్రైవర్‌ విధులకు రాలేదు. నేనేమీ చేయలేను’ అని సదరు ఇన్‌ఛార్జి చేతులెత్తేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవానికి ఇది నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వ అంబులెన్స్‌లోనే కరోనా మృతులను తరలించాలి. అధికారులు స్పందించకపోవడంతో బాధితులు ప్రైవేటు అంబులెన్సును మాట్లాడుకున్నారు. మార్చురీ సిబ్బంది వాటిల్లో శవాలను తీసుకెళ్లి ఖననం ప్రకియ పూర్తి చేశారు. ఒక మృతదేహాన్ని భీమ్‌గల్‌ మండలానికి తరలించాల్సి ఉండగా.. కుటుంబ సభ్యులు పోలీసులు, మార్చురీ సిబ్బందిని వేడుకోవడంతో ఆటోలో తరలించారు. అయితే సొంతూరుకు తరలించకుండా జిల్లా కేంద్రంలోని శ్మశానవాటికలోనే ఖననం చేశారు.

Posted

Nirlakshyam ni Criminal Case aite .... Mari ippati varaku KCR chesindi enti Corona Vishayam lo Nirlakshayam kadaaa.... ragada13.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...