kakatiya Posted July 16, 2020 Report Posted July 16, 2020 అందరికీ వస్తుందేమో.. కరోనా! అమరావతి: భవిష్యత్లో కరోనా రాని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరేమోనని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాకు ఆరోగ్యశ్రీ కొత్త సేవల విస్తరణ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొవిడ్కు వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్తో కలిసి జీవించాల్సిందేనని పునరుద్ఘాటించారు. అయితే కరోనా సోకిన వెంటనే ఏం చేయాలో అందరికీ అవగాహన ఉండేలా..ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలన్న దానిపై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రాల సరిహద్దులు తెరిచినందున రాకపోకలు పెరుగుతాయని, మరోవైపు కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని, దీనిని ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి బయటపడొచ్చని సీఎం తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.