Jump to content

Recommended Posts

Posted

శిరోముండనం ఘటనపై డీజీపీ తీవ్ర ఆగ్రహం

DGP120087604a.jpg

సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో పోలీస్టేషన్‌లో యువకుడి శిరోముండనం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. ఇలాంటి వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని ఆరెస్టు చేసి సీతానగరం పోలీసులు తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతడికి శిరోముండనం చేశారు. తీవ్రగాయాల పాలైన అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు ఇన్‌ ఛార్జి ఎస్సైతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.

ఇసుక లారీలు అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు.వెదుళ్ల పల్లిలోని బాధితుడు వరప్రసాద్‌ ఇంటికి వెళ్లి కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Posted

‘మమ్మల్ని అణిచివేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం’

శిరోముండనం ఘటనపై మాజీ ఎంపీ ఆగ్రహం

210720harsh1a.jpg

రామహేంద్రవరం: ‘ఎస్సీలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పోలీసు స్టేషన్‌లోనే శిరోముండనం చేయిస్తుందా?’ అని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. పోలీసు ఉన్నతాధికారులకే తెలిసే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. ఎస్సైను సస్పెండ్‌ చేసినంత మాత్రాన సరిపోదన్నారు. బాధ్యులైన అందరినీ సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు రోజులు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయలేదని విమర్శించారు. ఎస్సీ బాలికపై అత్యాచారం, మరో ఎస్సీకి శిరోముండనం ఇదేనా మాకు న్యాయం? అని ప్రశ్నించారు. ఇది ఎస్సీ ప్రజాప్రతినిధులు, హోమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవమానమని వ్యాఖ్యానించారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిపై పోలీసులు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడికి గాయాలయ్యేలా కొట్టి, శిరోముండనం చేశారు. ఈ ఘటనపై  మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను కచ్చితంగా అణిచివేయాలనే ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఎస్సీ బాలికపై అత్యాచారం కేసులో ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెయిడ్‌ బ్యాచ్‌లను ప్రభుత్వం డబ్బులిచ్చి పోషిస్తోందని విమర్శించారు. పార్టీ ముసుగులు వదిలేసి అందరూ ఈ ఘటనలను ఖండించాలని సూచించారు. 24 గంటల్లో శిరోముండనం వెనుక ఉన్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేకపోతే పోలీసు అధికారులపై, సూత్రధారులపై తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. సీతానగరం వద్ద అక్రమ ఇసుక ర్యాంపులన్నీ నిలిపివేయాలని హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు.

Posted
2 minutes ago, Hydrockers said:

Jagan resign cheyali ani start chesara? 

Ledu bro, CBN kutra antunnaaru

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...