DaatarBabu Posted August 7, 2020 Report Share Posted August 7, 2020 హైదరాబాద్: ఏపీ రాజధానిపై మాకు సంబంధంలేదు అని కేంద్రం కౌంటర్ అఫిడవిట్ వేసింది. చాలా మందికి తెలియని విషయమేంటంటే ఇదేదో రాజధాని కోసం రైతులు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్లో కోర్టు కేంద్రానికి నోటీసులిస్తే, కేంద్రం మాకు సంబంధం లేదు అని కౌంటర్ వేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అది కాదు. 2018లో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదాకు సంబంధించి, రాష్ట్ర రాజధాని నిధులకు సంబంధించి, ఇంకా ఇతరత్రా కొన్ని ఇనిస్టిట్యూట్లకు సంబంధించి అన్నింటినీ కలిపి శ్రీనివాసరావు అనే ఓ రైతు 2018లో కోర్టులో వేసిన పిటిషన్ ఇది. రెండు సంవత్సరాల తర్వాత కోర్టు అడిగితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో మిగతా అంశాలన్నింటిని వెనక్కు నెట్టేసి రాజధానితో మాకు సంబంధం లేదు అనేదాన్ని హైలెట్ చేస్తూ ఆ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. ఇప్పుడు కేంద్రమే ప్రమాణ పత్రం దాఖలు చేసింది కదా?. మాకు సంబంధంలేదని, ఇంకేం చేస్తారు?.అందరూ ఇక సైలెంట్ అయిపోండని అందరూ చెప్పే మాట ఇది. కేంద్రం అది చెప్పిందా?. అసలు కేంద్రం అలా చెప్పొచ్చా?. ఇవన్నీ చాలా అంశాలున్నాయి. ప్రమాణ పత్రంలో కూడా చాలా లొసుగులున్నాయి. ఇందులో రాజధాని అంశాన్ని క్లియర్గా చెప్పిందా?. పోనీ రాజధానికి సంబంధించిన రూ.2500 కోట్ల అంశాన్ని ఈ కౌంటర్ అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదు కేంద్రం. ప్రమాణ పత్రంలో 2500 కోట్లు ఇచ్చామనే అంశం లేదు. ఇవన్నీ చాలా అంశాలున్నాయి. ప్రమాణ పత్రంలో కూడా చాలా లొసుగులున్నాయి. ఇందులో రాజధాని అంశాన్ని క్లియర్గా చెప్పిందా?. పోనీ రాజధానికి సంబంధించిన రూ.2500 కోట్ల అంశాన్ని ఈ కౌంటర్ అఫిడవిట్లో ఎందుకు పేర్కొనలేదు కేంద్రం. ప్రమాణ పత్రంలో 2500 కోట్లు ఇచ్చామనే అంశం లేదు. ఇవన్నీ దాచేసి కేంద్రం తప్పటడుగులు వేసింది. అసలు పిటిషన్ వేసిన అడ్వకేట్ పీవీ కృష్ణయ్యతో పాటు పలు పార్టీల నేతలతో ఏబీన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో వీపీ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు చెందిన రైతు శ్రీనివాసరావు 25 నెలల క్రితం ఈ పిటిషన్ వేశారన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted August 7, 2020 Author Report Share Posted August 7, 2020 రాజధాని నిర్ణయంలో..మా పాత్ర లేదు రాష్ట్రప్రభుత్వమే నిర్ణయిస్తుంది: కేంద్రం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది రెండేళ్లనాటి పిటిషన్పై హైకోర్టులో అఫిడవిట్ హోదాపై సుప్రీంలోనూ కేసులు పోలవరం ఖర్చంతా భరిస్తాం హైకోర్టుకు నివేదన అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రాష్ట్ర రాజధాని నగరాన్ని సంబంధిత రాష్ట్రప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఈ విషయంలో కేంద్రం పాత్ర లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 2018 మార్చి 29న దాఖలైన పిటిషన్కు సంబంధించి గురువారం రాష్ట్ర హైకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు తరఫున న్యాయవాది పీవీ కృష్ణయ్య వేసిన పిటిషన్పై కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ లలిత టి.హెడావు ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘నవ్యాంధ్రకు కొత్త రాజధాని ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసేందుకు 2014 మార్చి 28న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ నేతత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ అదే ఏడాది ఆగస్టు 30న నివేదిక సమర్పించింది. 2015 ఏప్రిల్ 23వ తేదీన అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక రాష్ట్ర రాజధాని నగరాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇందులో కేంద్రప్రభుత్వ పాత్ర లేదు’ అని స్పష్టం చేసింది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ-అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం-2020’పై గత నెల 31వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. అందులో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్పమెంట్ ఏరియాను ‘శాసన రాజధాని (లెజిస్లేటివ్ కేపిటల్)’గా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవల్పమెంట్ ఏరియాను ‘పరిపాలనా రాజధాని (ఎగ్జిక్యూటివ్ కేపిటల్)’గా, కర్నూలు అర్బన్ డెవల్పమెంట్ ఏరియాను ‘న్యాయ రాజధాని’గా పేర్కొంది’ అని అందులో వివరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted August 7, 2020 Author Report Share Posted August 7, 2020 సుప్రీంలో హోదా కేసులు పెండింగ్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయని, అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయని కేంద్ర హోం శాఖ తెలిపింది. ‘రాజ్యసభలో సభ్యుల మధ్య జరిగిన చర్చపై న్యాయస్థానాలు విచారణ జరపడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని మూడో అధికరణ పరిధి విస్తృతమైనది. 371 (డి) అధికరణ మేరకు తెలంగాణ ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేసింది. ఆంధ్రకు ‘ప్రత్యేక హోదా’ నిర్ణయం దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక - సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య తేడా లేదు. ఆ మేరకు ఆంధ్ర పునర్వ్యవస్థీకరణ చట్ట నిబంధనలతో పాటు రాష్ట్ర ఇతర వనరులను అంచనా వేసి, ఆర్థిక లోటుఉన్నట్లుగా నిర్ణయించాం. ఐదేళ్లకు రూ.22,113 కోట్లు చెల్లించాలని ఫైనాన్స్ కమిషన్ నివేదికలో సిఫారసు చేసింది. ఇందులో భాగంగా 2015-20 మధ్య రూ.22,111.88 కోట్లు అందించాం. 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రూ.3,979.50 కోట్లు అందించాం. అంతేగాక ప్రత్యేక సాయం కూడా చేస్తున్నాం’ అని తెలిపింది. 2013-14 లెక్కలు అడిగాం.. ‘రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణను రాష్ట్రానికే అప్పగించాం. పోలవరానికయ్యే వ్యయం వందశాతం కేంద్రమే సమకూరుస్తుంది. 2014 నుంచి రూ.8,614.16 కోట్లు విడుదల చేశాం. 2017-18లో ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన వ్యయ అంచనా రూ.55,548.87 ఉండగా.. దానిని 2019 ఫిబ్రవరి 11వ తేదీన జలశక్తి శాఖ సలహా కమిటీ ఆమోదించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేశాం’ అని హోంశాఖ వివరించింది. ప్రత్యేక హోదాకు బదులు విదేశీ సాయం ప్రాజెక్టుల ద్వారా సాయం చేస్తున్నాం కాబట్టి ఈ పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టును కోరింది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.