sri_india Posted September 16, 2020 Author Report Posted September 16, 2020 హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో మూతపడ్డ థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేదని దర్శకుడు హేమంత్ మధుకర్ పేర్కొన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలోనే తాను దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి మరో మార్గం లేదన్నారు. అగ్ర కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు అంచనాలు పెంచాయి. ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల కావాల్సిన సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి లాక్డౌన్ కారణంగా ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతోంది. గత కొన్ని రోజులుగా దీనిపై వదంతులు ప్రచారం అవుతున్నా.. తాజాగా దర్శక, నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. ‘అవును.. ఓటీటీ ప్లాట్ఫాంలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ థియేటర్లో విడుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చాం. కానీ పరిస్థితులు ఇప్పుడు మా చేతుల్లో లేవు. థియేటర్లు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయో తెలియదు. ఇలాంటి సమయంలో ఓటీటీ విడుదలే సరైందని ఫీల్ అయ్యాం. ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యి, సినిమాను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా’ అని హేమంత్ మధుకర్ అన్నారు. నిర్మాత కోన వెంకట్ స్పందిస్తూ.. ‘థియేటర్లో విడుదల చేయడమే మా మొదటి ప్రాధాన్యం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ రోజులు వాయిదా వేయలేకపోతున్నాం. లాక్డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ఫాంలు నిర్మాతలకు కాస్త ఊరట ఇస్తున్నాయి. మా చేతుల్లో ఏమీ లేదు.. రెండున్నర సంవత్సరాలకుపైగా కష్టపడి పనిచేసిన ప్రాజెక్టును ఇలా డిజిటల్లో విడుదల చేయాలంటే బాధగా ఉంది. కానీ మేం ది బెస్ట్నే ఎంచుకున్నాం’ అని పేర్కొన్నారు. అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.