kakatiya Posted September 18, 2020 Report Share Posted September 18, 2020 హైదరాబాద్ పురానాపూల్ శ్మశానవాటిక ముందు మూసీ నదిలో గురువారం మధ్యాహ్నం రెండు మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు హిమాయత్సాగర్ మీదుగా వచ్చే వరదతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలో శ్మశానవాటిక సమీపంలోని మూసీలో ద్వీపంగా ఉన్న పచ్చిక బయళ్లలో స్థానికులకు రెండు మొసళ్లు కనిపించాయి. వెంటనే పోలీసులు నెహ్రూ జూపార్కు అధికారులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వాటిని పట్టుకునేందుకు వచ్చారు. నీటి ప్రవాహం అధికం కావడంతోపాటు అలికిడి కారణంగా మొసళ్లు నీటిలోకి వెళ్తున్నాయి. దీంతో వాటిని పట్టుకునే యత్నం చేసినా ఫలించలేదు. హిమాయత్సాగర్తోపాటు మీరాలం చెరువులోను మొసళ్లు ఉన్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
siru Posted September 18, 2020 Report Share Posted September 18, 2020 they cant survive in moosi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.