Jump to content

Recommended Posts

Posted

విశాఖపట్నం: టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీని విడిచి వెళ్లడం, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. సమావేశంలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. 

 

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేపై అయ్యన్న ఫైర్

విశాఖపట్నం : విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీకి దగ్గరైన విషయం విదితమే. ఆయన అధికారికంగా కండువా కప్పుకోలేదు కానీ ఇద్దరు కుమారులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేర్చారు. అయితే.. వాసుపల్లి టీడీపీకి దూరం కావడంపై స్థానిక నేతలు, జిల్లా నేతలు, మాజీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఆదివారం నాడు విశాఖలో తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వాసుపల్లి ప్రస్తావన తెచ్చి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వల్లే తెలుగుదేశం పార్టీకి పేరు వచ్చిందనే భ్రమలో వాసుపల్లి వున్నారని అయ్యన్న ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో విలువలు చచ్చిపోయాయని.. అసలు అధికారం పోతే బతకలేమా? అని వాసుపల్లిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

 

ఏం చేద్దామని వైసీపీలోకి వెళ్లారు..!?

వైసీపీ అధికారంలోకి వచ్చాక పథకాలు కన్నా దోచుకున్నదే ఎక్కువ. మాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి కానీ విలువలే ముఖ్యమన్నారు. ఇప్పుడున్న రాజకీయాలకు మేము ఇమడలేకపోతున్నాం. చాలా సార్లు చంద్రబాబు వాసుపల్లి మాటలే విన్నారు.‌ ఆయనకు అంతటి గౌరవం ఇస్తే ఇప్పుడు కనీస మర్యాద లేకుండా వ్యవహరించారు. ఏం చేద్దామని వైసీపీలోకి వెళ్లారు. సొంత పార్టీ వారికే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం‌ లేదు. వైసీపీలోకి వెళ్లిన వారందరూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు. యుద్దం అంటూ మొదలైతే వెనక్కి తిరిగే ప్రసక్తే వుండకూడదు. భయపడి పారిపోయే దోరణి మాకు లేదు. టీడీపీ ఒక విశ్వవిద్యాలయం లాంటిది.తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ నుంచే వచ్చారు. తెలంగాణా కేబినెట్‌లో సగం మంది నాయకులు మన టీడీపీ నుంచి వెళ్లన వారే. చంద్రబాబు చేసిన సేవలను గుర్తించి వాసుపల్లిని గెలిపిస్తే ఎమ్మేల్యేగా రాజీనామా చేయకుండా పార్టీ విడిచి వెళ్లారు. రాబోయే కాలం మాది (టీడీపీది) పోయేకాలం వైసీపీది. ప్రధాని కాళ్లు మొక్కినా వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. జమిలి ఎన్నికలు రావడం ఖాయం. నెలాఖరుకల్లా జిల్లా కమిటీలను అధిష్టానం ప్రకటిస్తుంది. తప్పకుండా టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది అని అయ్యన్న చెప్పుకొచ్చారు.

Posted
1 minute ago, snoww said:

Ganta vuncle still missing aa

Ganta velthey ycp key bokka

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...