Jump to content

Recommended Posts

Posted

బీరువాల్లో సవివర నివేదికలు

మెట్రో పేరుతో రూ.కోట్లు ఖర్చు ప్రస్తుతం విశాఖ ప్రాజెక్టుకే మొగ్గు

అంతన్నారు.. ఇంతన్నారు.. నేలమీద.. నింగిమీద.. భూగర్భంలో అన్నారు.. తీరా తుస్సుమన్నారు.. ఇదీ విజయవాడ మెట్రో పరిస్థితి. మొదటి నుంచి నిపుణులు హెచ్చరిస్తున్నా మెట్రో ప్రాజెక్టుతో ముందుకు సాగాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీరా ప్రభుత్వం మారిన తర్వాత మెట్రో లేదు.. తేలికపాటి మెట్రో లేదు.. ఎలివేటెడ్‌ బస్సు కారిడార్లు లేవు. అసలు విజయవాడ మెట్రో ఊసేలేదు. సర్వేలు..

అధ్యయనాలు.. పరిశీలనలు, సవివర నివేదికలు.. కార్యాలయాలు.. వసతుల పేరుతో రూ.కోట్లు ఖర్చు చేశారు. చివరకు ఇక్కడి ప్రాజెక్టు దస్త్రాన్ని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం విశాఖ కారిడార్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం విశాఖలో ప్రాంతీయ కార్యాలయం పేరుతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సాంకేతికంగా వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర కార్యాలయం అంటూ ఓ చిన్న ఆఫీసు విజయవాడలో ఉంచుకున్నారు. వచ్చే నెల నుంచి ఈ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి.

Posted

ఆది నుంచి అవాంతరాలే..!

పలు పరిణామాలు చోటుచేసుకున్న తర్వాత ఎట్టకేలకు తేలికపాటి మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ఉన్నత స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని నాటి సీఎం చంద్రబాబు ఆమోదించారు. డీపీఆర్‌ తయారీ బాధ్యతలను ఫ్రాన్సుకు చెందిన సిస్ట్రా-రైట్స్‌ సంస్థకు అప్పగించారు. దాదాపు ఏడాదిన్న తర్వాత ముసాయిదా ఇచ్చింది. ఏప్రిల్‌లో పూర్తి స్థాయి డీపీఆర్‌ అందించారు. మొత్తం విజయవాడ, అమరావతిలో కలిపి 85 కిలోమీటర్ల దూరం లైట్‌మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికి సుమారు రూ.25వేల కోట్లు పైగా ఖర్చు కానుందని అంచనా వేశారు. తొలి దశలోవిజయవాడ లో 38.5 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. అంతకుముందు నగరంలో 26 కి.మీ మేరకు నిర్మాణం చేయాలని భావించారు. ఏలూరు, బందరు కారిడార్‌లు మాత్రం నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. దీనికి మెట్రో నిపుణులు శ్రీధరన్‌ సలహాదారుగా ఉన్నారు. దాదాపు రూ.6,800 కోట్లతో నిర్మాణం చేయాలని అంచనా వేశారు. దీనికి జైకా రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కేంద్రం నుంచి దాదాపు రూ.2వేల కోట్లు వస్తాయని భావించారు. డీపీఆర్‌ పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైంది. కారిడార్ల నిర్మాణానికి టెండర్లను పిలిచి రద్దు చేశారు.తర్వాత జరిగిన పరిణామాల్లో శ్రీధరన్‌ అసంతృప్తికి గురై రాజీనామా చేశారు. జైకా రుణం ఇచ్చేందుకు నిరాకరించింది. ఈలోగా కేంద్రం మెట్రో ప్రాజెక్టులు అన్నీ... పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలనే విధాన నిర్ణయం తీసుకుని, విజయవాడ మెట్రోకు నిధులు ఇచ్చేందుకు నిరాకరించింది. మెట్రో ఆవశ్యకత ఉందని భావించిన నాటి సీఎం చంద్రబాబు దీనిపై అధ్యయనం కోసం నాటి మంత్రి పి.నారాయణ నేతృత్వంలో ఒక కమిటీని విదేశాలకు పంపించింది. పలురకాల ప్రాజెక్టులు పరిశీలించిన బృందం తేలికపాటి మెట్రో సముచితమని నిర్ణయం తీసుకుంది. జర్మనీ దేశానికి చెందిన మెట్రోనిపుణులు డాట్సన్‌ బృందం కూడా అతే అనువైందని తేల్చారు. దీని డీపీఆర్‌ కోసం రుణ సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ రూ.10 కోట్లు అందించింది. విజయవాడ, అమరావతిలో మొత్తం 85 కిలోమీటర్ల దూరం మెట్రోకు ప్రతిపాదనలు అందించింది. కిలోమీటరు వ్యయం రూ.200 కోట్లుగా పేర్కొంది. భూగర్భంలో కిలోమీటరు వ్యయం రూ.400 కోట్లుగా అంచనా వేసింది. లైట్‌మెట్రో ఆకాశంలో, నేలమీద, భూగర్భంలో ఉండేలా ప్రణాళికరూపొందించారు. సిస్ట్రా అందించిన ముసాయిదాకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ , కెఎఫ్‌డబ్ల్యూ రిమార్కులు తెలియచేసిన తర్వాత స్టీరింగ్‌ కమిటీ ముందు ఉంచారు. తర్వాత ప్రభుత్వానికి పంపారు. అప్పటి నుంచి అది బీరువాలకే పరిమితమైంది.

Posted

ప్రాజెక్టు మారింది..!

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి మెట్రో రైల్‌కార్పొరేషన్‌ను ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌గా మార్చారు. విజయవాడ ప్రాజెక్టును పక్కన పెట్టి విశాఖ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించింది. విశాఖలో 80 కి.మీ దూరం నిర్మాణం చేయనున్నారు. దీంతో సిబ్బంది, అధికారులు దానిపైనే దృష్టి సారించి, అక్కడకు తరలివెళుతున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు లేనట్లేనని తేల్చి పారేస్తున్నారు. అధికారులు మాత్రం దీనిపై అధ్యయనం చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...