Jump to content

Recommended Posts

Posted

అమరావతి: అమరావతిని చంపేందుకు ప్రభుత్వం,  వైకాపా నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని తెదేపా జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రైతుల ఉద్యమం 300 రోజుకు చేరిన సందర్భంగా పెనుమాకలో ఎంపీ గల్లా జయ్‌దేవ్‌, తెదేపా నేతలతో కలిసి ఆయన రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపారు. అమరావతి ప్రాంతాన్ని ఉధ్యమాన్ని కించపరిచేలా మంత్రులు, వైకాపా నేతలు ఇష్టానుసారం మాట్లాడినా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని లోకేశ్‌ అన్నారు. 90 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటంలో ముందుంటామని లోకేశ్‌, గల్లా జయ్‌దేవ్‌ అన్నారు. అనంతరం ఎర్రబాలెం చేరుకొని రైతులు నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

నమ్మి భూములిస్తే వంచిస్తారా: సోమిరెడ్డి
నమ్మి భూములిచ్చినందుకు ప్రభుత్వాలే వంచిస్తే ప్రజలు ఏమైపోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ మంచి మనసుతో ఆలోచించి అమరావతి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలు తిరిగివెళ్లిపోతున్నాయన్నాయని గుర్తు చేశారు.

భవన కార్మికుల వేషంలో..
అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ తిరుపతి టీఎఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేశారు. అన్నదాతలు 300 రోజుల దీక్షకు మద్దతుగా మంగళం రోడ్డులో భవన నిర్మాణ కార్మికుల వేషం ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల యువతీ యువకులు ఉపాధి కోల్పోయి కూలీ పనులు చేసుకోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

121020lokesh-a.jpg

Posted

అంతర్జతీయ ప్రధాన కార్యదర్శి

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...