r2d2 Posted December 1, 2020 Report Posted December 1, 2020 ఇన్స్టా కొత్త ఫీచర్.. ఇన్స్టాగ్రాం యాప్ను మొదట్లో కేవలం ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగించేవారు. తర్వాతి రోజుల్లో ఈ యాప్ కొత్తగా వీడియో కంటెంట్ రూపొందించే వారికి అనువైన వేదికగా మారిపోయింది. ఇన్స్టాగ్రాం కూడా ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్ను పరిచయం చేస్తూ యువతకు చేరువైంది. తాజాగా కంటెంట్ క్రియేటర్స్ కోసం ఇన్స్టాగ్రాం లైవ్ రూమ్స్ పేరుతో కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. ఇందులో ఒకే సారి నలుగురు వ్యక్తులు లైవ్ వీడియోలో మాట్లాడొచ్చు. గతంలో ఉన్న లైవ్ సెషన్లో కేవలం ఇద్దరు పాల్గొనే అవకాశం మాత్రమే ఉండేది. ఇది ఒక విధంగా గతంలో ఉన్న లైవ్ ఫీచర్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పొచ్చు. భారత్లో విడుదల చేయడానికి ముందే ఇన్స్టాగ్రాం వేర్వేరు రంగాలకు చెందిన కంటెంట్ క్రియేటర్స్తో కలిసి వివిధ రకాలుగా లైవ్ రూమ్స్ని పరీక్షించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్, ఇండోనేషియా యూజర్స్కి మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇన్స్టాగ్రాం ఎలాంటి ప్రకటన చేయలేదు. ‘‘ఇన్స్టాగ్రాం ద్వారా తమ ఆలోచనలను సృజనాత్మకంగా వ్యక్త పరచాలనుకునే వారికి లైవ్ రూమ్స్ ద్వారా మా వంతు సహకారాన్ని అందిస్తున్నాం’’ అని ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తెలిపారు. ఈ ఫీచర్ ఉపయోగించేందుకు ముందుగా ఇన్స్టాగ్రాంలో యువర్ స్టోరీలో ఉన్న ప్లస్ సింబల్పై క్లిక్ చేయాలి. కింద ఉన్న ఆప్షన్స్లో లైవ్ కెమెరా సెలెక్ట్ చేసి సెషన్ పేరు టైప్ చేయాలి. తర్వాత లైవ్ ఆన్ చేసి కింద ఉన్న వీడియో కెమెరా సింబల్పై క్లిక్ చేసి గెస్ట్లను లైవ్లో యాడ్ చేసుకోవచ్చు. అయితే గెస్ట్లను లైవ్ రూమ్స్లో యాడ్ చేయాలంటే మాత్రం వాళ్లు కూడా లైవ్లో ఉండాలి. అప్పుడే వారి వివరాలు మీకు కనిపిస్తాయి. గెస్ట్లందరినీ ఒకే సారి లేదంటే ఒకరి తర్వాత మరొకర్ని యాడ్ చేసుకోవచ్చు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.