kakatiya Posted January 25, 2021 Report Posted January 25, 2021 దిల్లీ: పలు రంగాల్లో సేవలందించేవారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పద్మ’ అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మంది పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పద్మవిభూషణ్తో గౌరవించింది. పద్మవిభూషణ్కు ఎంపికైన వారిలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో పాటు వైద్యరంగంలో సేవలందించిన డాక్టర్ బెల్లె మొనప్ప హెగ్డే (కర్ణాటక), శాస్త్ర అండ్ ఇంజినీరింగ్ విభాగంలో కర్ణాటకకు చెందిన నరీందర్సింగ్ కపనే (మరణానంతరం), మౌలానా వహిదుద్దీన్ఖాన్ (దిల్లీ), సుదర్శన్ సాహూ (ఒడిశా) ఉన్నారు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.