Jump to content

Recommended Posts

Posted
వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

 ప్రస్తుత సమావేశాల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అధికారాన్ని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ విచక్షణకు వదిలినందున తక్షణమే ప్రకటన చేయాలని కోరినట్లు వెల్లడించారు. నదుల అనుసంధానం విషయంలో ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణం, నదుల నీటి ప్రవాహాలను పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని కోరినట్లు చెప్పారు. హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను చేపట్టాలని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న నేపథ్యంలో జాతీయ ప్రాధాన్యంగల విశ్వవిద్యాలయాలు స్థాపించాలని కోరామన్నారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ మొదలై రెండేళ్లు కావస్తున్నా కొలిక్కిరాకపోవడాన్ని తప్పుపట్టినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు అంశాలను ప్రస్తావించానని వివరించారు.. రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం వెనుక తెదేపా నాయకులు ఉన్నట్లు సీసీఫుటేజీ ద్వారా వెల్లడైందని తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రార్ధనా స్థలాల్లో జరిగే నేరాలకు విధించే శిక్షను రెండేళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచుతూ ఐపీసీని సవరించాలని సూచించినట్లు తెలిపారు.

Posted
2 minutes ago, csrcsr said:

Masthu jokes estadu uncle age ayaka kuda

 

Cc footage vuntey arrest chesi kummocchuga.. statement enduku..

  • Haha 1
Posted
1 minute ago, r2d2 said:

Cc footage vuntey arrest chesi kummocchuga.. statement enduku..

Special status ventene ani itanu chepadu anta

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...