r2d2 Posted February 8, 2021 Report Posted February 8, 2021 నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన ‘రాజ్భవన్ అన్నం’ కార్యక్రమాన్ని రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ తమిళిసై సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా నిత్యం దాదాపు ఐదు వందల మంది పేదలకు ఉదయం టిఫిన్ ఉచితంగా అందించనున్నారు. దీంతో పాటు నామమాత్రపు ధరలతో మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం కల్పించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి తల్లి తమ పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలకు సమతుల్య ఆహారం లభిస్తేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని వివరించారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుందని గవర్నర్ వివరించారు. రాజ్ భవన్ పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన గవర్నర్.. విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులను పలకరించి నిత్యం అల్పాహారం తీసుకోవాలని సూచించారు. సత్యసాయి సేవా సమితి సహకారంతో రాజ్ భవన్ పాఠశాలలో చదివే విద్యార్థులకు, రాజ్ భవన్లో పనిచేసే వ్యక్తులు, చుట్టుపక్కల ఉండే పారిశుద్ధ్య కార్మికులకు రుచికరమైన అల్పాహారాన్ని అందించనున్నట్లు గవర్నర్ తెలిపారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.