r2d2 Posted March 15, 2021 Report Share Posted March 15, 2021 మమతా బెనర్జీ తీరుపై అమిత్ షా విమర్శనాస్త్రాలు పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సోమవారం హోంమంత్రి అమిత్ షా బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటీవల నందిగ్రామ్ ఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజు తన హెలికాప్టర్లో సమస్య తలెత్తిందని, కానీ దాన్ని కుట్రగా పేర్కొనలేదంటూ కౌంటర్ ఇచ్చారు. రాణిబంద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో షా మాట్లాడుతూ.. ‘‘హెలికాఫ్టర్లో చిన్న సమస్య తలెత్తడంతో ఈ రోజు నాకు ఆలస్యమైంది. కానీ దాన్ని నేను కుట్రగా పేర్కొనడం లేదు. ఇటీవల మమతా జీ కాలికి గాయమైంది. ఆమె ఎలా గాయపడ్డారో తెలియదు. తృణమూల్ కాంగ్రెస్ దీన్నొక కుట్ర అంటోంది. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రమాదవశాత్తూ జరిగిందని స్పష్టంచేస్తోంది. గాయమైన కాలితో చక్రాల కుర్చీలో తిరుగుతున్న దీదీని ఒకటే ప్రశ్న అడగదలచుకున్నా.. మీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన 130మంది భాజపా కార్యకర్తల కుటుంబాల బాధ మీకు తెలుసా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘాన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. మమతకు గాయపడిన ఘటనపై స్పందించిన అమిత్ షా.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా, కానీ.. రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన తమ పార్టీ కార్యకర్తల గురించి కూడా ఆమె ఆలోచిస్తే బాగుంటుందన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted March 15, 2021 Report Share Posted March 15, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.