r2d2 Posted March 15, 2021 Report Share Posted March 15, 2021 ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని కేంద్రం స్పష్టంచేసింది. ప్రైవేటీకరణ ద్వారా సమకూరిన వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడమే ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్కు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు, అప్పులపై అధిక వడ్డీలు, తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యమే ప్రధాన కారణాలని చెప్పారు. లోక్సభలో వైకాపా ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకొని 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు, ఆర్థిక సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, మైనార్టీ వాటాల విక్రయం ద్వారా 2021-22లో 1.75లక్ష కోట్ల ఆదాయం ఆర్జించాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించినట్టు వేసినట్టు నిర్మల తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల ఉత్పాదకతను పెంచి వాటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమే ప్రైవేటీకరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రైవేటు మూలధనం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అత్యుత్తమ యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పాదకతను పెంచుతామని చెప్పారు. ప్రైవేటీకరణతో వచ్చే వనరులను వివిధ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నందు వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.