r2d2 Posted March 17, 2021 Report Share Posted March 17, 2021 తెలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా వృథా అధికంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ గురించి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వ్యాక్సిన్ వృథా అవుతున్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల్లో 10%కిపైగా వ్యాక్సిన్ వృథా అవుతోందని, ఉత్తర్ప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితే ఉందని హెచ్చరించారు. జీరో వేస్టేజ్ లక్ష్యంతో రాష్ట్రాలు పనిచేయాలని సూచించారు. వ్యాక్సిన్ ఎందుకు వృథా అవుతోందన్న దానిపై రాష్ట్రాల్లో సమీక్ష జరగాలని, ప్రతిరోజూ సాయంత్రం దీన్ని పర్యవేక్షించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలన్నారు. వ్యాక్సిన్ల కాలపరిమితి(ఎక్స్పైరీడేట్)ని దృష్టిలో ఉంచుకొని ముందుగా వచ్చిన వ్యాక్సిన్ను ముందుగానే ఉపయోగించాలని సూచించారు. Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted March 17, 2021 Report Share Posted March 17, 2021 Free ga iste edina waste ayyiddi you need to put price for each one until tappadu ilanti wastage Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.