r2d2 Posted May 4, 2021 Report Posted May 4, 2021 వివాహం జరిగే రోజే మరో శుభవార్త అందుకుంది ఓ వధువు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించింది. పెళ్లి దుస్తుల్లోనే లెక్కింపు కేంద్రానికి వెళ్లి ధ్రువపత్రాన్ని అందుకుంది. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ రాంపుర్ జిల్లాలో జరిగింది. ఈనెల 2న మొహమ్మద్పుర్ జాదిద్ గ్రామానికి చెందిన పూనమ్ వివాహం. ఆ సంబరాల్లో ఉండగానే వారికి మరో శుభవార్త అందింది. ఆరోజే వెల్లడైన స్థానిక పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బీడీసీ సభ్యురాలిగా పూనమ్ గెలిచినట్లు తెలిసింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మండపం నుంచి నేరుగా లెక్కింపు కేంద్రానికి వెళ్లిన పూనమ్.. వివాహ వస్త్రధారణలోనే అధికారుల నుంచి ధ్రువపత్రాన్ని అందుకుంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.