Jump to content

Recommended Posts

Posted

cow dung: ‘ఆవుపేడ చికిత్స’ ప్రమాదకరం

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ముప్పుంది
హెచ్చరించిన గుజరాత్‌ వైద్యులు

brk--national1_109.jpg

అహ్మదాబాద్‌: ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఉంటుందని గుజరాత్‌ వైద్యులు హెచ్చరించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో... ఇక్కడి శ్రీస్వామి నారాయణ్‌ గురుకుల్‌ విశ్వవిద్యా ప్రతిష్ఠానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ప్రతి  ఆదివారం కొంతమంది ఇక్కడకు వచ్చి పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. కొద్దిసేపు అయ్యాక ఆవు పాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఔషధ దుకాణాల్లో పనిచేసేవారు కూడా ఈ చికిత్స పొందుతున్నారు!

దీనిపై గుజరాత్‌ వైద్యులు పెదవి విరుస్తున్నారు. ‘‘ఆవుపేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకూ పనిచేస్తుందో, దీని ద్వారా కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో ఎవరికీ తెలియదు. దీనివల్ల ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఉంటుంది’’ అని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డా.దిలీప్‌ మావ్‌లంకర్‌ పేర్కొన్నారు. ‘‘పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థం. ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ ఇవ్వలేదు. పేడ చికిత్సలో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రజలు ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకుండా... వైద్యులను సంప్రదించాలి’’ అని భారతీయ వైద్య మండలి మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌ డా.మోనా దేశాయ్‌ చెప్పారు. 

Posted
1 hour ago, Hydrockers said:

Penam meda nunchi poyi lo padattu

Pidakalu akkadikega cheralsindi 

Posted
6 hours ago, Somedude said:

cow dung: ‘ఆవుపేడ చికిత్స’ ప్రమాదకరం

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ముప్పుంది
హెచ్చరించిన గుజరాత్‌ వైద్యులు

brk--national1_109.jpg

అహ్మదాబాద్‌: ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఉంటుందని గుజరాత్‌ వైద్యులు హెచ్చరించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో... ఇక్కడి శ్రీస్వామి నారాయణ్‌ గురుకుల్‌ విశ్వవిద్యా ప్రతిష్ఠానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ప్రతి  ఆదివారం కొంతమంది ఇక్కడకు వచ్చి పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. కొద్దిసేపు అయ్యాక ఆవు పాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఔషధ దుకాణాల్లో పనిచేసేవారు కూడా ఈ చికిత్స పొందుతున్నారు!

దీనిపై గుజరాత్‌ వైద్యులు పెదవి విరుస్తున్నారు. ‘‘ఆవుపేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకూ పనిచేస్తుందో, దీని ద్వారా కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో ఎవరికీ తెలియదు. దీనివల్ల ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఉంటుంది’’ అని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డా.దిలీప్‌ మావ్‌లంకర్‌ పేర్కొన్నారు. ‘‘పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థం. ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ ఇవ్వలేదు. పేడ చికిత్సలో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రజలు ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకుండా... వైద్యులను సంప్రదించాలి’’ అని భారతీయ వైద్య మండలి మహిళా విభాగం ఛైర్‌పర్సన్‌ డా.మోనా దేశాయ్‌ చెప్పారు. 

tenor.gif

Posted

ivi namme vallu pls do it.... brain elago empty ne kada.... population bokka..  sachipondi

  • Upvote 1
Posted

రోజూ గోమూత్రం తాగుతా.. అందుకే కొవిడ్‌ లేదు’

ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు

17brk-sadhvi_1.jpg

భోపాల్‌: ఆవుపేడ, గోపంచకంతో కరోనా నయం కాదని వైద్యులు, నిపుణులు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం పదేపదే వీటిపై ప్రచారం చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఓ భాజపా ఎమ్మెల్యే గోమూత్రం వల్లే తనకు కరోనా రాలదని, అందరూ దీన్ని పాటించాలని చెప్పారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భాజపా ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ కూడా ఇప్పుడే ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను రోజూ గోపంచితం తాగుతుండటం వల్లే తనకు కరోనా లేదని ఆమె అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘దేశీ గోవు పంచితాన్ని మనం ప్రతిరోజూ తీసుకుంటే అది మన ఊపిరితిత్తులను కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. నేను ప్రతిరోజూ గోమూత్రాన్ని తీసుకుంటా. అందువల్ల నేను కరోనాకు ఎలాంటి ఔషధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్లే నాకు కరోనా లేదు’’అని చెప్పుకొచ్చారు. ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గోమూత్రం వల్లే తాను క్యాన్సర్‌ను జయించానని రెండేళ్ల క్రితం ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా.. గతేడాది డిసెంబరులో కొవిడ్‌ లక్షణాలతో ఆమె దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. 

గతేడాది కరోనా విజృంభణ ప్రారంభ దశలో ఉన్న సమయంలో బెంగాల్‌ భాజపా చీఫ్‌ దిల్లీ ఘోష్‌ కూడా గోపంచకం సేవిస్తే కరోనా రాదని అన్నారు. గోమూత్రాన్ని ఒక గ్లాసు చల్లటి నీటితో తాగితే, కొవిడ్‌ నుంచి సురక్షితంగా ఉండొచ్చని ఇటీవల యూపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వ్యాఖ్యలు చేశారు. అయితే గోపంచకం, ఆవు పేడను కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, అలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దని భారత వైద్య మండలి హెడ్‌ డాక్టర్‌ జయలాల్‌ ఇటీవల స్పష్టం చేశారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...