r2d2 Posted June 9, 2021 Report Share Posted June 9, 2021 మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు గాను ఆమెకు రూ.2లక్షలు జరిమానా విధించింది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, ఫోర్జరీ ధ్రువీకరణ పత్రంతో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. అలాగే, ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని రుజువు చేసుకొనేందుకు నెల పాటు గడువు ఇచ్చినట్టు సమాచారం. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవనీత్ కౌర్.. తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.