snoww Posted July 11, 2021 Report Posted July 11, 2021 అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులలో తాను జైలుకు వెళ్లవలసి రావచ్చని జగన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. తనకు శిక్ష పడితే ముఖ్యమంత్రిగా తన స్థానంలో భార్య శ్రీమతి భారతీ రెడ్డి ఉంటారని ఆయన పార్టీ ముఖ్యులకు చెబుతున్నారు. ఈ నిర్ణయం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంలో గొడవలు పెరగడానికి కారణం కావొచ్చునని చెబుతున్నారు. జగన్ రెడ్డికి శిక్షపడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే సీఎం కుర్చీలో తల్లి శ్రీమతి విజయలక్ష్మిని కూర్చోబెట్టాలని షర్మిల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీమతి విజయలక్ష్మి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సన్నిహితులలో చర్చనీయాంశమైంది. దివంగత వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ రెడ్డిని ప్రజలు కూడా ఆ కారణంగానే ఆదరించారని, ఏ కారణంవల్లనైనా జగన్ రెడ్డి పదవిని వదులుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి వారసురాలిగా ఆయన భార్య శ్రీమతి విజయలక్ష్మి మాత్రమే ఉండటం సరైనదని, విజయలక్ష్మి ఉండగా ఆ కుటుంబం కోడలు శ్రీమతి భారతీ రెడ్డి వారసురాలు ఎలా అవుతారని బంధువర్గం ప్రశ్నిస్తోంది. దీన్నిబట్టి సీబీఐ కేసులు ఒక కొలిక్కి వచ్చి జగన్ రెడ్డికి శిక్ష పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చీలిక ఏర్పడే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన ముఖ్యుడొకరు విశ్లేషించారు. ఆ పరిస్థితి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఏ వైఖరి తీసుకుంటుందన్నది కీలకం అవుతుందని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.