r2d2 Posted August 3, 2021 Report Posted August 3, 2021 భారత్, బెల్జియం సెమీస్ పోరును ప్రధాని నరేంద్రమోదీ వీక్షించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ‘ఒలింపిక్స్లో భారత్, బెల్జియం పురుషుల హాకీ సెమీస్ను చూస్తున్నాను. మన జట్టు నైపుణ్యాలను చూసి గర్విస్తున్నాను. గెలవాలని కోరుకుంటున్నాను’ అని మొదట ట్వీట్ చేశారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. టోక్యో ఒలింపిక్స్లో మన హాకీ జట్టు అత్యుత్తమంగా పోరాడింది. అదే మనకు ముఖ్యం. తర్వాతి మ్యాచు, భవిష్యత్తు సిరీసుల్లో గెలవాలని నేను కోరుకుంటున్నా. మన ఆటగాళ్లను చూసి భారత్ గర్విస్తోంది’ అని తెలిపారు. మ్యాచు ముగిసిన తర్వాత ఆయన కెప్టెన్ మన్ప్రీత్కు ఫోన్ చేశారు. ఇప్పటి వరకు టీమ్ఇండియా ప్రదర్శన చాలా బాగుందని, కాంస్య పోరులో రాణించాలని వెన్నుతట్టారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.