ticket Posted October 7, 2021 Report Share Posted October 7, 2021 బియ్యం ఎగుమతి.. హెరాయిన్ దిగుమతి మాదకద్రవ్యాల దందాలో వైకాపా ఎమ్మెల్యేకు సంబంధం తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజం కాకినాడ (కలెక్టరేట్), న్యూస్టుడే: అఫ్గానిస్థాన్కు బియ్యాన్ని ఎగుమతి చేసి, అక్కడి నుంచి హెరాయిన్ను దిగుమతి చేసుకుంటున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. బుధవారం కాకినాడలోని తెదేపా జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్వీఎస్ఎన్ వర్మ, తెదేపా నాయకుడు యనమల కృష్ణుడితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేషను బియ్యాన్ని దోచుకుని అఫ్గానిస్థాన్లోని హాసన్, హుస్సేన్ కంపెనీలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. అరబిందో ఆధీనంలో ఉన్న కాకినాడ పోర్టు ద్వారా మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయని పట్టాభిరామ్ ఆరోపించారు. కాకినాడ నగర ఎమ్మెల్యే సోదరుడు వీరభద్రారెడ్డి పోర్టు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ప్రపంచంలో ఎన్నో దేశాలుండగా సీఎం జగన్ సోదరులు అనిల్రెడ్డి, సునీల్రెడ్డి ఆఫ్రికా ఖండాన్నే వ్యాపారాలు చేయడానికి ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి తాను ఐవరీకోస్ట్కు వెళ్లానని, ఇక్కడ గోదాముల వ్యాపారం చేయదలిచానని చెప్పారన్నారు. మాదకద్రవ్యాల కేంద్రమైన ఐవరీకోస్ట్తోపాటు జాంబియా, ఘనా వంటి దేశాల్లో వీరంతా మాదకద్రవ్యాల వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ముంద్రా పోర్టులో చిక్కిన హెరాయిన్ ఆశీ టేడ్రింగ్ కంపెనీకి చెందిందని, దాన్ని నడుపుతున్న సుధాకర్ కాకినాడలోని స్మగ్లర్ అలీషా వద్ద పనిచేశారన్నారు. అలీషాకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి సంబంధాలు ఉన్నాయని పట్టాభిరామ్ చెప్పారు. ఒక స్మగ్లర్ను అప్పటి జిల్లా ఎస్పీ వద్దకు ఎమ్మెల్యే ద్వారంపూడి ఎందుకు తీసుకువెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ఎమ్మెల్యేలనే అడగండి: మాదకద్రవ్యాల విషయంలో తెదేపా విషప్రచారం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని, అవేమిటో మీ ఎమ్మెల్యేలను అడగాలని పట్టాభిరామ్ అన్నారు. ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు గంజాయి రవాణాలో అడ్డంగా దొరికిపోయారని, స్మగ్లర్తో ఎమ్మెల్యే ద్వారంపూడికి సంబంధాలేంటో మీరే అడగాలని సజ్జలకు సూచించారు. ఎంపీ విజయసాయిరెడ్డి దుబాయ్ వెళ్లేందుకు పాస్పోర్టు తిరిగివ్వాలని కోర్టుకు ఎందుకు దరఖాస్తు చేశారో సజ్జల చెప్పాలన్నారు. ముంద్రా పోర్టులో హెరాయిన్ చిక్కాక రోజుల వ్యవధిలో కాకినాడలో బోటు దగ్ధమైందని, దాన్నుంచి తెల్లటి పొగలు వచ్చాయన్నారు. ఏదైనా వస్తువు కాలితే నల్లటి పొగలు వస్తాయని, ఇక్కడ మాత్రం హెరాయిన్ కాలి తెల్లటి పొగ వచ్చిందన్నారు. దీనిపై పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted October 7, 2021 Author Report Share Posted October 7, 2021 Rey dwarampidi toka entra idi... East godavari royals entha erri hooks oo eedini chuste ardam authundi.. Ucha posukuntaru eedu ante Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.