Undilaemanchikalam Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 రూ.2,500 కోట్లు ఇస్తే కర్ణాటక సీఎం సీటు వస్తదట అన్న హరీశ్ ఈ విషయాన్ని బీజేపీ ఎంపీనే చెప్పారని వ్యాఖ్య ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న హరీశ్ తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, మంత్రి తన్నీరు హరీశ్ రావు విపక్షాలపై సోమవారం విరుచుకుపడ్డారు. ఓ పార్టీలో ఓటుకు నోటు ఉంటే... ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.102 కోట్లతో చేపట్టిన పలు పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ.2,500 కోట్లు ఇస్తే వస్తదట అంటూ వ్యాఖ్యానించిన హరీశ్.. ఇది మనం అనడం లేదని, కర్ణాటక బీజేపీ ఎంపీనే చెబుతున్నాడని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో మీకు తెలుసన్న హరీశ్.. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి అని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. Quote Link to comment Share on other sites More sharing options...
cool_boy Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 Enni chesina 10-15 anthe esari ktr gani kut@ha ramp adatam kayam. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.