Jump to content

Ganta is back


Recommended Posts

Posted
ప్రజా పక్షాన నిలిచిన వంగవీటి మోహన రంగాల, అల్లూరి సీతారామరాజులు ఎప్పటికీ చిరస్మరణీయులని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాధ రంగా రాయల్ సంస్థ తరపున  మేఘాలయ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి , అల్లూరి సీతా రామరాజు 125 వ జయంతి వేడుకల నిర్వహణకు సంబంధించిన గోడ పత్రికను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ జులై నాల్గో తేదీన తలపెట్టిన ఇద్దరు మహనీయుల జయంతి ఉత్సవాల వేదిక కార్యక్రమం అన్నారు . మనోరమ ధియేటర్లో జరిగే ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టిన గాదె బాలాజీ , కేవీఎస్  భాస్కర్లను అభినందించారు . బడుగు వర్గాల కోసం తపన పడ్డ వంగవీటి మోహన్ రంగా జయంతి ,మన్యం వీరుడు, అల్లూరి సీతారామ రాజుల జయంతి కార్యక్రమం నిర్వహణ ప్రయత్నం అభినందనీయం అన్నారు . భారత ప్రధాని నరేంద్ర మోదీ   భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు వస్తున్నారని గుర్తు చేశారు . మన్యం దొరగా బ్రిటీషర్ లను గడగడలాడించిన అల్లూరి తెగువ , బడుగు వర్గాలకు అండగా నిలిచిన తీరుని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  వంగవీటి మోహన్ రంగా ఎంఎల్ఎగా " ఉన్నది కొద్దికాలమే అయినప్పటికీ ఆయన పేదల పట్ల చూపిన ఆపేక్ష , వారిని అక్కున చేర్చుకున్న తీరు ఎప్పటి కీ చిరస్మరణీయం అన్నారు . విశాఖ లోనూ నిర్వహించేందుకు సంకల్పించిన బాలాజీ , భాస్కర్ తదితరులు ప్రశంసనీయులు అన్నారు .సమావేశంలో  పోలిశెట్టి సునీతి , ఈటి రంగారావు తదితరులు పాల్గొన్నారు 

.good that respecting freedom fighters irrespective of caste ,religion etc....by ranga Radha Mitra mandali...

@futureofandhra @VakeelSaab 

Seems like Chandrababu given him task to bring cops to tdp fold ..la undi... 

Posted

రంగా జపం : గంటా మార్క్ పాలిట్రిక్స్...? .

వంగవీటి రంగా జనం మరచిపోలేరు. ఆయన పేదల పెన్నిధిగా పనిచేశారు. ఆయన ఒక సామాజికవర్గానికి ప్రతినిధిగా చూడడం కంటే బడుగుల కోసం పోరాడిన నేతగా గుర్తుంచుకుంటేనే బాగుంటుంది. వంగవీటి మోహన రంగా. ఈ పేరు పలుకుతూ ఉంటే ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి. అంతటి పవర్ ఆ పేరులో ఉంది 1980 దశకంలో రంగా ఒక ప్రభంజనంగా కోస్తా జిల్లాలను ఊపేశారు. నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించిన నాయకుడిగా రంగాను చెప్పుకోవాలి.
నాడు అపరిమితమైన జనాదరణతో ఎన్టీయార్  1985లో రెండవసారి సీఎం అయ్యారు. ఆయన ఏలుబడిలో కాంగ్రెస్ సహా విపక్షాలు ఎన్ని పోరాటాలు చేసినా పెద్దగా జనాలకు ఎక్కని పరిస్థితి. అలాంటి చోట విజయవాడ నడిబొడ్డున రంగా  అన్న ఒకే ఒక్క శక్తి టీడీపీని నిలువరించగలిగింది. అలా రంగా వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మూడేళ్ళ పాటు సాగిన పోరాటం ఏపీ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పింది. రంగా హత్య కావించబడినా  నాడు ఆయన అనుకున్నట్లుగా టీడీపీని ఓడించగలిగారు ఈ రోజుకీ ఆయన కాపులకు ఆరాధ్యదైవంగా ఉన్నారు.

రంగా వారసులుగా చాలా మంది ఎదిగేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ఆ చేరువకు కూడా రాలేకపోయారు. ఇక ప్రతీ ఎన్నిక ముందు రంగా గురించి మాట్లాడడం కూడా ఒక రాజకీయ వ్యూహంగా మారుతూ వస్తోంది. ఇక రంగా గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా తలుస్తున్న వారిలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు చురుకుగా  ఉన్నారు అని చెప్పాలి. గంటా ఏకంగా విశాఖలొ రంగా 75వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

రంగా జయంతి జూలై 4న జరగనుంది. ఈసారి ఉత్సవాలను కేవలం విశాఖతో మాత్రమే కాకుండా విజయవాడ హైదరాబాద్ లలో కూడా నిర్వహించాలని గంటా భావిస్తున్నారు. ఒక విధంగా రంగా జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని ఆయన కోరుకుంటున్నారు. ఏపీలోని ఒక సామాజికవర్గంలో చైతన్యాన్ని తట్టి లేపేలా ఈ ఉత్సవాలు ఉండాలని కూడా ఆశిస్తున్నారు.

ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో గంటా ఎక్కువగా రంగా గురించే ఆలోచిస్తున్నారు అని అంటారు. ఆయన ఈ మధ్యన పాయకరావుపేటలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలి. కాపులు తలచుకుంటే సాధించనిది ఉండదు అని కూడా అన్నారు. ఏపీలో కాబోయే సీఎం కాపుల నుంచే వస్తారు అని నాడు ఆయన అన్నారు. అపుడు ఆయన టీడీపీతో గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారు అని ప్రచారంలో ఉంది.

ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబుతో కలసి కనిపించారు. గంటా మనవడి పుట్టిన రోజు వేడుకలకు చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లారు. గంటా కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం కావడం అని గట్టిగా ప్రకటించారు. మరి ఇపుడు గంటా రంగా నామస్మరణ వెనక ఉద్దేశ్యం ఏంటి అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఈసారి పెద్ద ఎత్తున కాపులను టీడీపీ వైపుగా రప్పించి ఆ పార్టీ విజయానికి తన వంతుగా కృషి చేయాలని గంటా భావిస్తున్నారు అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. దాంతో కోస్తా జిల్లాలో అతి ప్రధాన వర్గంగా పెద్ద వర్గంగా ఉన్న కాపులను టీడీపీకి సానుకూలం చేసే బాధ్యతను గంటా తీసుకున్నారు అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి రంగా నామ జపం ఈసారి  గంటా ద్వారా టీడీపీని  గట్టెక్కిస్తుందా అన్నది చూడాలి. ఏదేమైనా రాజకీయ వ్యూహాలను రచించడంతో ఉద్ధండుడుగా పేరు గడించిన  గంటా రంగా  75వ జయంతి వేడుకలను చేయడం వెనక భారీ రాజకీయ  వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు.

Posted

Main main leaders andharu kalipi kapu vedika jac ani okati start chesaru.....

Posted

Payakaraopeta lo ranga statue avishkrana lo....kapule next prabhutvani sasinchedi ani chepadu

Posted

Anthakamundu steel plant kosam resign chesadu antha mileage raledu......

Next gajuwaka nunchi mla ga contesting ani talk

Posted

Ganta active ai tdp lo unadu ante...pulkas....ki manchi sign e ,tdp power Loki vastundi ani fix aiuntadu....

 

 @YOU

Posted
9 minutes ago, Lovecrusader said:

Ganta active ai tdp lo unadu ante...pulkas....ki manchi sign e ,tdp power Loki vastundi ani fix aiuntadu....

 

 @YOU

Ayithe malla PK gaadu aatalo aratipqnde gaa? 😂😂

last time CBN ki 49% vachinayi ante ee janam esinatte gaa votes? Calling @RedThupaki to get caste starts

  • Haha 2
Posted
40 minutes ago, Lovecrusader said:

రాధ రంగా రాయల్ సంస్థ

Idemi sangham ? royal sanghama ? 

@RedThupaki raayals susava...

  • Haha 1
Posted
15 minutes ago, Android_Halwa said:

Idemi sangham ? royal sanghama ? 

@RedThupaki raayals susava...

Kothadi pettaru emadya

Posted
58 minutes ago, Lovecrusader said:
ప్రజా పక్షాన నిలిచిన వంగవీటి మోహన రంగాల, అల్లూరి సీతారామరాజులు ఎప్పటికీ చిరస్మరణీయులని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. రాధ రంగా రాయల్ సంస్థ తరపున  మేఘాలయ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి , అల్లూరి సీతా రామరాజు 125 వ జయంతి వేడుకల నిర్వహణకు సంబంధించిన గోడ పత్రికను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ జులై నాల్గో తేదీన తలపెట్టిన ఇద్దరు మహనీయుల జయంతి ఉత్సవాల వేదిక కార్యక్రమం అన్నారు . మనోరమ ధియేటర్లో జరిగే ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టిన గాదె బాలాజీ , కేవీఎస్  భాస్కర్లను అభినందించారు . బడుగు వర్గాల కోసం తపన పడ్డ వంగవీటి మోహన్ రంగా జయంతి ,మన్యం వీరుడు, అల్లూరి సీతారామ రాజుల జయంతి కార్యక్రమం నిర్వహణ ప్రయత్నం అభినందనీయం అన్నారు . భారత ప్రధాని నరేంద్ర మోదీ   భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహా విష్కరణకు వస్తున్నారని గుర్తు చేశారు . మన్యం దొరగా బ్రిటీషర్ లను గడగడలాడించిన అల్లూరి తెగువ , బడుగు వర్గాలకు అండగా నిలిచిన తీరుని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  వంగవీటి మోహన్ రంగా ఎంఎల్ఎగా " ఉన్నది కొద్దికాలమే అయినప్పటికీ ఆయన పేదల పట్ల చూపిన ఆపేక్ష , వారిని అక్కున చేర్చుకున్న తీరు ఎప్పటి కీ చిరస్మరణీయం అన్నారు . విశాఖ లోనూ నిర్వహించేందుకు సంకల్పించిన బాలాజీ , భాస్కర్ తదితరులు ప్రశంసనీయులు అన్నారు .సమావేశంలో  పోలిశెట్టి సునీతి , ఈటి రంగారావు తదితరులు పాల్గొన్నారు 

.good that respecting freedom fighters irrespective of caste ,religion etc....by ranga Radha Mitra mandali...

@futureofandhra @VakeelSaab 

Seems like Chandrababu given him task to bring cops to tdp fold ..la undi... 

hardcore batch will never come out of 80s 

looks like pk gadi words tho tdp ki clarity vachindhi 

Posted
1 hour ago, futureofandhra said:

hardcore batch will never come out of 80s 

looks like pk gadi words tho tdp ki clarity vachindhi 

30%-40% of them padina chalu more than enough 

Posted

veellalo saraina leader lekunda JAC pettukuni em chestaru?

PK edo oka group lo undataniki ishtapadadu, veellalo evadiki antha following ledu. May be andaru kalisi TDP ni gelipistharemo. but political ga evaraina unify chesthe kapulaki kooda muslims ki ichhinatlu special benefits istharu for vote bank politics. ade jarigithe AP inka backward aipotundi.

Posted

Kapulu ni tokkesaru tokalu.. Zero respresentation from rayal seema. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...