Jump to content

Recommended Posts

Posted

                        సాయిరెడ్డి గారూ.. ఈ భూములెవరివి?

నేనుండే మూడు పడక గదుల ఫ్లాట్‌ తప్ప విశాఖపట్నంలో నాకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎటువంటి ఆస్తులు లేవు. నాకు సంబంధించినవి ఇతరులెవరి పేరుతోనూ లేవు. నా పేరుతోగానీ, నా కుటుంబసభ్యుల పేరుతో గానీ లేవు. ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు.

విశాఖలో ఫ్లాట్‌ తప్ప తనకు గానీ, కుటుంబసభ్యులకు గానీ ఆస్తుల్లేవన్న వైకాపా ఎంపీ

భారీగా భూములు కొన్న అవ్యాన్‌ రియల్టర్స్‌

అది విజయసాయిరెడ్డి కుమార్తె, అల్లుడి కంపెనీయే

ప్రతిపాదిత భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి పక్కనే ఆ భూములు

విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తే పాలనా కేంద్రం వచ్చేది అక్కడికి సమీపంలోనే

వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.వందల కోట్లు

ఈనాడు-విశాఖపట్నం, అమరావతి


081022ap-main1a.jpg

 

 

నేనుండే మూడు పడక గదుల ఫ్లాట్‌ తప్ప విశాఖపట్నంలో నాకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎటువంటి ఆస్తులు లేవు. నాకు సంబంధించినవి ఇతరులెవరి పేరుతోనూ లేవు. నా పేరుతోగానీ, నా కుటుంబసభ్యుల పేరుతో గానీ లేవు. ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు.

- వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖలో భూ ఆక్రమణల ఆరోపణలపై విలేకర్ల సమావేశంలో స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలివీ.


ఏం చెప్పారు సాయిరెడ్డి గారూ! విశాఖలో మీకు ఆస్తులే లేవా? మీ కుటుంబసభ్యులెవరి పేరుతో కూడా లేవా? మరి పెనక నేహారెడ్డి, పెనక రోహిత్‌రెడ్డీ ఎవరు? మీ కుమార్తె, అల్లుడు కాదా? కుమార్తెను, అల్లుణ్నీ కుటుంబసభ్యులుగా పరిగణించకూడదని వైకాపా ప్రభుత్వం ఈ మధ్య చట్టమేదైనా తెచ్చిందా? మీ కుమార్తె, అల్లుడు ఏర్పాటు చేసిన అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ.. ప్రతిపాదిత భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఆనుకుని కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కొనడం వాస్తవం కాదా? ప్రభుత్వ రికార్డుల ప్రకారమే రూ.53 కోట్ల విలువైన ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో దానికి అనేక రెట్లు ఎక్కువ ఉంటుందన్నది నిజం కాదా? మీ కుమార్తె, అల్లుడు భూములు కొంటే అవి మీవి కానట్టా? వైకాపా ప్రభుత్వం చెబుతున్నట్టుగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే... పరిపాలనా కేంద్రమైన కోర్‌ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు ప్రతిపాదించిన ప్రాంతానికి అత్యంత దగ్గరలోనే ఆ భూములు ఉండటం కాకతాళీయమేనంటారా? భోగాపురం బీచ్‌ కారిడార్‌ను గత ప్రభుత్వం సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు పక్కనే ప్రతిపాదిస్తే, మీ ప్రభుత్వం దాని ఎలైన్‌మెంట్‌ మార్చడం, నేరెళ్లవలస దగ్గర ఆ రోడ్డు వంపు తిరిగి... మీ కుమార్తె, అల్లుడు కొన్న భూముల పక్క నుంచే వెళ్లడం కూడా యాదృచ్ఛికమే అంటారా? వివాదాస్పద దసపల్లా భూముల్ని తీసుకున్న కంపెనీకి.. మీ కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ సంస్థ నుంచి నిధులు వెళ్లాయని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అదే కంపెనీ అటు సముద్రతీరానికి, ప్రతిపాదిత భోగాపురం రహదారికి మధ్యలో రూ.కోట్ల విలువైన భూములు కొనడంలో ఎలాంటి వ్యాపార ప్రయోజనాలూ లేవంటే నమ్మమంటారా? ఇప్పటికే రూ.కోట్ల విలువ చేసే ఆ భూములు.. మీ ప్రభుత్వం చెబుతున్నట్టే అక్కడికి రాజధాని వస్తే బంగారమైపోతాయన్నది దాచినా దాగని నిజం కాదా? ఒకపక్క విశాఖలో ఇన్ని చేస్తూ.. మీరు కేవలం ప్రజాసేవకే అక్కడికి వెళ్లినట్టు, ఆస్తులపైనా, భూములపైనా ఎలాంటి మమకారం లేనట్టు ఎంత చక్కగా చెప్పారు సాయిరెడ్డీ! ఆ మధ్య వచ్చిన ఒక హిట్‌ సినిమాలో.. చెప్పే నీతులకు, చేసే పనులకు పొంతన లేని పాత్రను ఉద్దేశించి హీరో ‘నువ్వో వర్గానికి ఇన్‌స్పిరేషన్‌’ అంటాడు వెటకారంగా. మీ మాటలు, మీరు చేస్తున్న పనులు చూస్తుంటే అదే డైలాగ్‌ గుర్తొస్తోందని విశాఖ ప్రజలు అనుకుంటే అది వారి తప్పు కాదు!


ఏడాదిలోనే భారీగా కొన్నారు..

081022ap-main1b.jpg

అధికార పార్టీ అగ్రనాయకుల్లో ఒకరిగా, పార్టీలో నంబర్‌ 2గా ఉంటూ, నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగానూ వ్యవహరించిన విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, అల్లుడు రోహిత్‌రెడ్డి విశాఖలో భారీగానే ఆస్తులు వెనకేశారు. వారికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ కంపెనీ అటు భోగాపురం విమానాశ్రయానికి, ఇటు విశాఖకు మధ్య భీమునిపట్నం మండలంలో రూ.వందల కోట్ల విలువైన భూముల్ని కేవలం 11 నెలల వ్యవధిలోనే చకచకా కొనేసింది. కేవలం భీమిలి మండలంలోనే 11 నెలల్లో 16 మంది నుంచి వివిధ సర్వే నంబర్లలో 87,714 చదరపు గజాల భూమిని అవ్యాన్‌ రియల్టర్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే ఆ భూమి విలువ రూ.53.03 కోట్లు. బహిరంగ మార్కెట్‌లో దానికి అనేక రెట్లు ఎక్కువ పలుకుతుంది. ఎంతో వ్యూహాత్మకంగా భోగాపురం విమానాశ్రయం వరకు తలపెట్టిన ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి పక్కనే ఆ భూములు కొనడం గమనార్హం.


11 నెలలు.. 25 రిజిస్ట్రేషన్లు

విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె భాగస్వాములుగా అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థను 2020 సెప్టెంబరు 7న ఏర్పాటు చేశారు. ఆ సంస్థ భీమిలి మండలంలో 2021 ఫిబ్రవరి నుంచి భూములు కొనడం ప్రారంభించింది. నేరెళ్లవలస, భీమిలి, ఎగువపేటల్లో భూములు కొనుగోలు చేసింది. నేరెళ్లవలసకు చెందిన జె.మల్లికార్జునుడు అనే వ్యక్తి నుంచి కొన్న 19,892.4 చదరపు గజాల భూమిని 2021 ఫిబ్రవరి 18న భీమిలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మొదట రిజిస్ట్రేషన్‌ చేశారు. అప్పటి నుంచి 2021 డిసెంబరు 17 మధ్య అదే కార్యాలయంలో మొత్తం 25 రిజిస్ట్రేషన్లు జరిగాయి. నేరెళ్లవలసలో 14, భీమిలిలో 10, ఎగువపేటలో ఒక స్థలం కొన్నారు. 2021 సెప్టెంబరులో గరిష్ఠంగా 10 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ‘ఎం.గురునాథ]రావు-ఇతరుల’ నుంచి ఒకే సర్వే నంబరులోనే ఏకంగా ఏడు స్థలాలు కొనుగోలు చేశారు. 2021 ఫిబ్రవరిలో 3, మార్చిలో 6, జులై, ఆగస్టుల్లో ఒక్కొక్కటి, సెప్టెంబరులో 10, అక్టోబరులో 3, డిసెంబరులో ఒకటి రిజిస్ట్రేషన్లు జరిగాయి.


091022brk122191720a.jpg

Posted

పైన లెక్కల్లో, దస్పల్లా ఇంకా కలపలేదు. పైన లెక్కలు గత 11 నెలలో జరిగిన 25 రిజిస్ట్రేషన్స్ .

Posted

Maname kada vote vesindhi... Y this yedupu.. 

Still I agree vijayasai Reddy doesn't have any land ... I believe he has only one plottt

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...