Jump to content

Recommended Posts

Posted

తెలంగాణలో పాలకులందరికీ దైవభక్తి ఎక్కువని, అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉందని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు.

తెలంగాణలో పాలకులకు దైవభక్తి ఎక్కువ

ఈనాడు, వరంగల్‌, పాలకుర్తి, న్యూస్‌టుడే: తెలంగాణలో పాలకులందరికీ దైవభక్తి ఎక్కువని, అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉందని త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి అన్నారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై రామాలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఆయన చేతుల మీదుగా వైభవంగా జరిగింది. వాల్మీకి రామాయణంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రక ఆలయాన్ని రూ.25 కోట్లతో ప్రభుత్వం పునర్నిర్మించింది. నాలుగు రోజులుగా ప్రతిష్ఠాపన మహోత్సవం జరుగుతుండగా సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయింది. ఉదయం 9:30 గంటలకు త్రిదండి చినజీయర్‌స్వామి ఆలయానికి చేరుకోగా మంత్రి ఎర్రబెల్లి స్వాగతం పలికారు. అనంతరం స్వామి యంత్ర, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో పాటు మహాకుంభాభిషేకం నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్‌స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఎంతటివారైనా ఆలయంలో సమానమేనని, దేవుడి ముందు అంతా తలవంచుకొని నిగర్వంగా ఉంటారని, అదే ఆలయాల గొప్పతనమని చెప్పారు. వల్మిడి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లాలోని పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Posted
10 minutes ago, Peruthopaniemundhi said:

Not sure why cm did not attend this ?

Jangaon... ticket lolli.. @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...