Jump to content

Recommended Posts

Posted

Nara Lokesh: చంద్రబాబుకు మద్దతు తెలిపేవారిపై హత్యాయత్నం కేసులా?: లోకేశ్ ఆగ్రహం 

23-09-2023 Sat 16:27 | Andhra
  • స్కిల్  కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిరసనలు తెలుపుతుంటే కేసులు పెడుతున్నారన్న లోకేశ్
  • బ్రిటీష్ పాలనను మించి ఏపీలో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం
 
Lokesh take a swipe at AP govt

స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతు తెలిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారని, దీనిని తాము ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో ఏపీలో అక్రమ కేసులు పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. 

చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు, ర్యాలీలు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని, హత్యాయత్నం కేసులు కూడా పెడుతున్నారని ఆరోపించారు. హత్యాయత్నం కేసులు పెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని విమర్శించారు. చంద్రబాబుకు సంఘీభావంగా సైకత శిల్పం రూపొందిస్తే వారిపైనా కేసులు పెట్టడం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. 

జగన్ పాలనలో సముద్ర గర్భం, అంతరిక్షం, భూగర్భంలో కూడా 144 సెక్షన్ ఉందనేలా ఉన్నారంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. నిరసన తెలుపరాదని చెప్పే హక్కు మీకెక్కడిది? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో ర్యాలీలపై లేని నిషేధం ఏపీలోనే ఎందుకని నిలదీశారు. ప్రజా ఉద్యమాన్ని అక్రమ కేసులతో అడ్డుకోలేరని లోకేశ్ స్పష్టం చేశారు.

Posted

ashok babu: టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా వ్యవహరించాలో జగన్ దారి చూపించారు: అశోక్ బాబు 

23-09-2023 Sat 17:13 | Andhra
  • చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారన్న అశోక్ బాబు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఆపడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్య 
  • తాము అధికారంలోకి వచ్చాక జగన్, మంత్రులు జైలుకెళ్లడం ఖాయమని వెల్లడి  
 
ys jagan show us a path says ashok babu

అవినీతి కేసులలో పదేళ్ల పాటు బయట ఉన్న వైఎస్ జగన్ ప్రజాసేవకుడైన టీడీపీ అధినేత చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. శనివారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఆపడం ఎవరివల్ల కాదన్నారు. ఆయనను ప్రజాజీవితం నుంచి ఎవరూ విడదీయలేరన్నారు. మున్ముందు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలా ముందుకెళ్లాలో జగన్ తమకు సరికొత్త దారి చూపించారన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక జగన్, ఇప్పుడున్న మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పు చేశాడని వైసీపీ నేతలే చెబుతున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ అంశంలో జీవోలు ఇచ్చిన నీలం సాహ్ని, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాలన్నారు. డిజైన్ టెక్ సంస్థ ఎంపిక చేసుకున్న స్కిల్లర్ సంస్థ మరికొన్ని కంపెనీలతో వ్యాపారాలు నడిపితే షెల్ కంపెనీలు అని ఎలా అంటారని ప్రశ్నించారు.

అమరావతిలో వేయని ఇన్నర్ రింగురోడ్డు , ఫైబర్ గ్రిడ్ పేరుతో చంద్రబాబుపై కొత్త అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఒక కేసు వెనుక మరొకటి వేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం, జగన్ తన పతనాన్ని కోరి తెచ్చుకుంటున్నారని హెచ్చరించారు. మంత్రులు తమ దుర్మార్గపు ఆలోచనతో అబద్దాన్ని నిజం చేయాలని చూస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చంద్రబాబు విషయంలో తప్పు చేసిన అధికారులు, నేతలకు టీడీపీ ప్రభుత్వం రాగానే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...