Jump to content

Recommended Posts

Posted

Nara Bhuvaneswari: భువనేశ్వరి యాత్ర ప్రారంభం.. ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శ 

25-10-2023 Wed 11:44 | Andhra
  • ఉదయం నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన భువనేశ్వరి
  • అనంతరం చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైనం
  • మధ్యాహ్నం మహిళలతో భేటీ కానున్న భువనేశ్వరి
 
Nara Bhuvaneswari meets Praveen Reddy family

టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమయింది. ఉదయం నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం చంద్రగిరికి చేరుకున్నారు. ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. టీడీపీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

 
టీడీపీ సోషల్ మీడియాలో ప్రవీణ్ రెడ్డి యాక్టివ్ గా ఉండేవారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక ఈ నెల 18న ఆయన మృతి చెందారు. భువనేశ్వరి తొలి విడత యాత్ర మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మృతి చెందిన టీడీపీ నేతల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత మహిళలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. ఈరోజు చంద్రగిరిలో, రేపు తిరుపతిలో, ఎల్లుండి శ్రీకాళహస్తిలో ఆమె పర్యటన కొనసాగనుంది. 
20231025fr6538b1ee185ac.jpg20231025fr6538b2092747b.jpg20231025fr6538b222df2ee.jpg

 

 

  • Haha 1
Posted

Nara Bhuvaneswari: ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించిన భువనేశ్వరి 

25-10-2023 Wed 16:02 | Andhra
  • చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి
  • ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ కుటుంబాలను కలిసి భరోసా కల్పించిన వైనం
  • చంద్రబాబు జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉందని వ్యాఖ్య
 
Nara Bhuvaneswari gives RS 3 laks each to Praveen Reddy and Chinnabba families

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్నా ఆయన మనసంతా ప్రజలపైనే ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. తిరుపతి జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున భువనేశ్వరి చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించారు. పరామర్శకు ముందు నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు సెప్టెంబర్ 25న మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ఆమె పరామర్శించారు. 

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ‘‘పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు వారిని కలిసి భరోసా ఇవ్వడం మా బాధ్యత. అరెస్టును జీర్ణించుకోలేక కార్యకర్తలు చనిపోయారన్న విషయం తెలుసుకుని చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. ఆయన జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉంది. మా కుటుంబం కంటే కార్యకర్తలపైనే ఆయనకు ధ్యాస ఎక్కువ. ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ మృతి బాధాకరం. ప్రవీణ్ రెడ్డి చనిపోయిన రెండు రోజులకు బిడ్డ పుట్టాడని తెలిసింది. బిడ్డను చూసుకునే రాత ప్రవీణ్ రెడ్డికి లేదన్న విషయం చాలా బాధేసింది. కుమారుడిగా తల్లిదండ్రులకు ప్రవీణ్ రెడ్డి ఎలా అండగా ఉన్నారో... పార్టీ కూడా అంతే అండగా ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు. ప్రవీణ్ రెడ్డి, కనుమూరి చిన్నబ్బ కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
20231025fr6538ecfa56f18.jpg20231025fr6538ed136c7c5.jpg20231025fr6538ed35d62a2.jpg20231025fr6538ed573fc75.jpg

 

  • Haha 1
Posted
6 minutes ago, nag said:

ey Politicians kosam janalaki gunde noppulu vachi potharu.. kaani.. ah politicians families lo okkadu sick avvadu

Why hate on CBN family anna ?

Posted
21 minutes ago, Sonu_PateI said:

Why hate on CBN family anna ?

I'm talking in general. YSR poyinappudu kooda chaala mandhi ...all heart attack deaths , YSR kaatha lo jama chesukunnaru.. 

I'm not fan of any political parties.. because all of these are crap and corrupt to the core

  • Upvote 1
Posted

Atleast good thing i see here is .. that  Bhuvaneshwari giving 3 lacs checks to the deceased families.. instead of lip to lip kiss

Posted

I pray for truth to win. Bhuvi aunty korinattu truth win avvali.

corruption chesina lk’s andaru jail ki povali

  • Haha 1
Posted

Alagey vote for note case lo kooda truth gelavali ani korukondi aunty.

Ippudu ap govt pettina anni cases lo kooda

  • Haha 1
Posted
3 hours ago, psycopk said:

Nara Bhuvaneswari: ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించిన భువనేశ్వరి 

25-10-2023 Wed 16:02 | Andhra
  • చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి
  • ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ కుటుంబాలను కలిసి భరోసా కల్పించిన వైనం
  • చంద్రబాబు జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉందని వ్యాఖ్య
 
Nara Bhuvaneswari gives RS 3 laks each to Praveen Reddy and Chinnabba families

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్నా ఆయన మనసంతా ప్రజలపైనే ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. తిరుపతి జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున భువనేశ్వరి చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించారు. పరామర్శకు ముందు నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు సెప్టెంబర్ 25న మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను కలిసి ఆమె పరామర్శించారు. 

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ‘‘పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు వారిని కలిసి భరోసా ఇవ్వడం మా బాధ్యత. అరెస్టును జీర్ణించుకోలేక కార్యకర్తలు చనిపోయారన్న విషయం తెలుసుకుని చంద్రబాబు ఎంతో బాధపడ్డారు. ఆయన జైల్లో ఉన్నా మనసంతా ప్రజలపైనే ఉంది. మా కుటుంబం కంటే కార్యకర్తలపైనే ఆయనకు ధ్యాస ఎక్కువ. ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ మృతి బాధాకరం. ప్రవీణ్ రెడ్డి చనిపోయిన రెండు రోజులకు బిడ్డ పుట్టాడని తెలిసింది. బిడ్డను చూసుకునే రాత ప్రవీణ్ రెడ్డికి లేదన్న విషయం చాలా బాధేసింది. కుమారుడిగా తల్లిదండ్రులకు ప్రవీణ్ రెడ్డి ఎలా అండగా ఉన్నారో... పార్టీ కూడా అంతే అండగా ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు. ప్రవీణ్ రెడ్డి, కనుమూరి చిన్నబ్బ కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
20231025fr6538ecfa56f18.jpg20231025fr6538ed136c7c5.jpg20231025fr6538ed35d62a2.jpg20231025fr6538ed573fc75.jpg

 

Vinnaru ga NRI brothers?

repu mee gajji USA rallies lo evado nallodu fire open chesi mimmalni dogs laga shoot cheste CBN family May give your family 3 L rupees (repeat: THREE LAKHS!!!). Wow!!

inka rechi pondi… thaggede le. Mee family future guaranteed and insured!

Posted

Nara Bhuvaneswari: చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారు: నారా భువనేశ్వరి 

25-10-2023 Wed 18:57 | Andhra
  • తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం
  • సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ప్రసంగం 
  • టీడీపీ అధినేతపై కేసుల్లో ఆధారాలు ఏవని ప్రభుత్వానికి ప్రశ్న
  • ఈ పోరాటం కేవలం తనదే కాదని, ప్రజలందరిదీ అని వ్యాఖ్య
 
Nara Bhuvaneshwari lashes out at ycp during nijam gelavali protest in Tirupati

టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో నిర్వహించిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. 

‘‘నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడకు రాలేదు. నిజం గెలవాలి అని చెప్పేందుకే వచ్చాను. ఈ పోరాటం నాది మాత్రమే కాదు.. ప్రజలందరిదీ. యువతకు ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు నిత్యం ఆలోచించేవారు. సరైన రోడ్లు లేని ప్రాంతంలో రాళ్లూరప్పల మధ్య హైటెక్ సిటీ ఏంటని నిర్మాణ సమయంలో అందరూ హేళన చేశారు. అయినా పట్టించుకోకుండా చిత్తశుద్ధితో పనిచేసి లక్షల మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారు’’ అని అన్నారు. 

స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ కేసుల్లో ఆధారాలు ఉన్నాయా? అని నారా భువనేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్ల పాటు చంద్రబాబు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. పుంగనూరులో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా అధికార పార్టీ ఏమీ చేయలేకపోయిందని చెప్పారు. ‘‘ఎన్నికల ముందు అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తే, టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు అనుకుంటారు. కానీ చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఆయన్ను ఏమీ చేయలేరు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలూ రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారు. ఆయనపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది’’ అని అన్నారు. 
 
కాగా, ఈ రోజు ఉదయం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాల వేసి ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు

  • Haha 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...