psycopk Posted January 27, 2024 Report Posted January 27, 2024 Chandrababu: ఈ ముఖ్యమంత్రి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం: చంద్రబాబు 27-01-2024 Sat 18:34 | Andhra ఉరవకొండలో రా కదలి రా సభ ఈ ముఖ్యమంత్రికి బుద్ధి ఉందా అంటూ చంద్రబాబు ఫైర్ ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి అంటూ వ్యంగ్యం వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో తాము 10 లక్షల ఎకరాలను నీరిచ్చేలా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను తీసుకువస్తే, దాన్ని ఈ ముఖ్యమంత్రి పక్కనబెట్టేశాడని మండిపడ్డారు. రూ.30 కోట్ల సామగ్రిని తుప్పు పట్టించాడని ఆరోపించారు. "ఈ ముఖ్యమంత్రికి బుద్ది ఉందా అని అడుతున్నా... రూ.30 కోట్ల ప్రజాధనం వృథా చేసిన ఈ ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం... ఎందుకంటే ఈయన ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. ఇక వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది? టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక రైతులకు మళ్లీ పాత బీమా సదుపాయం తీసుకువస్తాం. రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తాం" అని చంద్రబాబు వెల్లడించారు. పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాడు... ఎవర్ని మోసం చేస్తాడు? ఇవాళ ఉరవకొండ సభకు యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారు వైసీపీని భూస్థాపితం చేయాలని అనుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డీఎస్సీ ప్రకటించారా? ఆ రోజున ఏం చెప్పారు...? ఎవరికైనా ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఇప్పుడు పోతున్నాడు... పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడంట! ఎవర్ని మోసం చేస్తావు? నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చాను, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను. మీరిచ్చిన ఉద్యోగాలు ఏంటి... వాలంటీరు ఉద్యోగాలు. లేకపోతే ఫిష్ మార్టుల్లో, మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చారు. టీడీపీకి, వైసీపీకి ఉండే తేడా ఇదే. జాబు రావాలంటే బాబు రావాల్సిందే. మరి బాబు రావాలంటే మీరేం చేస్తారు? సైకిల్ ఎక్కండి... 74 రోజులు మీరు కష్టపడండి... ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకువచ్చే బాధ్యత నాది. మరి మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు పది అడుగులు వేయండి... నేను వంద అడుగులు వేస్తా. తమ్ముళ్లూ.... నాకు మీకంటే ఎక్కువ ఆవేశం ఉంది. వయసనేది ఒక నెంబరు మాత్రమే. మరో 20 ఏళ్లలో ఏం చేయాలని ఆలోచిస్తున్నా. 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి. అదే నా జీవిత లక్ష్యం. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. యువతకు ఇదే నా హామీ ఉరవకొండ సభ నుంచి యువతకు హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యతను టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకువస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే ప్రణాళికకు శ్రీకారం చుడతా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ బోరు కొడితే, మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడికెళ్లి పనిచేసుకునే విధానం తీసుకువస్తాను. ఉద్యోగాలు వచ్చే వరకు యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాను. తల్లిదండ్రులపై ఆధారపడనక్కర్లేదు. మీకు అన్నగా నేనుంటా... నేరుగా మీ ఖాతాల్లోకే రూ.3 వేలు జమ చేస్తాం. ఆ బాధ్యత నాది అని యువత అందరికీ హామీ ఇస్తున్నా 2 Quote
psycopk Posted January 27, 2024 Author Report Posted January 27, 2024 Chandrababu: 'సిద్ధం' అని నువ్వు అనడం కాదు... నిన్ను దించడానికి మేం 'సిద్ధం'గా ఉన్నాం: చంద్రబాబు 27-01-2024 Sat 18:03 | Andhra అనంతపురం జిల్లా ఉరవకొండలో రా కదలిరా సభ టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న చంద్రబాబు టీడీపీ-జనసేన గాలి వీస్తోందని వెల్లడి రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుందని వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభకు హాజరయ్యారు. ఉరవకొండ సభకు హాజరైన ప్రజా వెల్లువను చూసి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా కనిపిస్తోందని అన్నారు. నిన్నటిదాకా ఒక మాట మాట్లాడిన జగన్... ఇప్పుడు హ్యాపీగా దిగిపోతా అంటున్నాడని వివరించారు. దిగిపోవడం కాదు... దించుతారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. నువ్వు చేసిన పనులకు, నువ్వు పెట్టిన ఇబ్బందులకు నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరపడ్డాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. "అందరం కలిసి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడానికే ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఉరవకొండలో టీడీపీ-జనసేన గాలి వీస్తోంది. విశాఖపట్నంలో సిద్ధం మీటింగ్ అంట! సిద్ధం అని నువ్వు అనడం కాదు... నిన్ను దించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఉరవకొండ సభను చూస్తే జగన్ కు నిద్రపట్టదు" అంటూ స్పష్టం చేశారు. వైసీపీ పరిపాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటైనా ఉందా? ఈ తుగ్లక్ పాలనలో దెబ్బతినని రంగం ఏదైనా ఉందా? ఈ సైకో పాలనలో నాశనం కాని వ్యవస్థ ఏదైనా ఉందా? ఎక్కడైనా మంచి రోడ్లు ఉన్నాయా? ఎక్కడైనా వ్యవసాయ శాఖ, విద్యాశాఖ కనిపిస్తున్నాయా? పిల్లలకు చదువు చెప్పే పరిస్థితి ఉందా? ఈ ప్రభుత్వ పాలనలో నష్టపోని వ్యక్తి లేడు. 2019లోనే నేను ఒక మాట చెప్పాను. ఒక్కసారి అని మోసపోతే చాలా నష్టపోతారు... ఆలోచించమని చెప్పాను. మీకు ముద్దులు పెట్టాడు, మిమ్మల్నందరినీ మైమరపింపజేశాడు. మీరు కూడా ఆ మాయలో పడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో తెలుగుజాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. నీళ్లిస్తే బంగారం పండిస్తారని నేను నమ్మాను రాయలసీమ రతనాల సీమ! ఇది రాళ్ల సీమ కాదు... రాయలసీమకు నీళ్లిస్తే బంగారం పండించే రైతులు ఉన్నారని నేను నమ్మాను. అందుకే నీళ్లివ్వాలని భావించి ముందుకు వెళ్లాం. అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువ. ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లివ్వాలన్నది నా జీవిత లక్ష్యం. ఆ రోజు రూ.4,500 కోట్లు ఖర్చుపెట్టి హంద్రీ-నీవా పరుగులు పెట్టించాం. జీడీ పిల్లి, భైరవానితిప్ప, పేరూరు, గొల్లపల్లి రిజర్వాయర్, గుంతకల్లు బ్రాంచి కెనాల్, మడకశిర బ్రాంచి కెనాల్, మారాల రిజర్వాయర్, చెర్లోపల్లి.. వీటన్నింటినీ ముందుకు పరుగులు తీయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అనంతపూర్ జిల్లాకు సమృద్ధిగా నీళ్లు ఉంటే గోదావరి జిల్లాలు కూడా పోటీపడలేవు. ఎందుకంటే... గోదావరి జిల్లాల్లో వరి మాత్రమే పండిస్తారు... కానీ ప్రపంచంలో పండే వాణిజ్య పంటలన్నీ అనంతపురం జిల్లాలో పండిస్తారు. అనంతపురం జిల్లాను అంత గొప్పగా చూడాలన్నది నా కల. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 1 Quote
psycopk Posted January 27, 2024 Author Report Posted January 27, 2024 Chandrababu: నేను కూడా సీమ బిడ్డనే... నాలో ప్రవహించేది కూడా సీమ రక్తమే: చంద్రబాబు 27-01-2024 Sat 16:17 | Andhra పీలేరులో రా కదలిరా సభ వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రం అంటూ చంద్రబాబు ధ్వజం పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తామంటూ వ్యాఖ్యలు ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అనవసరం అంటూ విమర్శలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్, మంత్రులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు దోచుకున్న సొమ్ముతో ‘సిద్దం’ అంటూ జగన్ రెడ్డి ప్రచార సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారని, కానీ ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? అని నిలదీశారు. "నేను కూడా రాయలసీమ బిడ్డనే... నాలో ప్రవహించేది సీమ రక్తమే. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశాం. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో ప్రారంభమైనవే. వాటిని పూర్తి చేసే బాధ్యత టీడీపీదే. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ ఉంటే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొచ్చే వాళ్లం. ప్రతి సంవత్సరం 2 వేల టీంఎసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తవ్విన కాలువలు పూర్తి చేసి ఈ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. రాయలసీమను పండ్ల తోటలకు హబ్ గా చేయాలని కృషి చేశా. దుర్మార్గులు అంతా నాశనం చేశారు. నాడు 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు. 450 ఇండ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ఆ డ్యాం కట్టారా? బాధితులకు ఏం న్యాయం చేశారు? ప్రాజెక్టు గేట్లకు గ్రీసు వేయలేని సీఎం 3 రాజధానులు కడతారా? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఇచ్చాం" అని చంద్రబాబు వివరించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దోపిడీకి అడ్డూ, అదుపు లేదు! వైసీపీలో ఒక్కరైనా విలువల గల మంత్రి ఉన్నారా? టూరిజం మంత్రిని చూస్తే, వాళ్ల కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారు. పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం లేదు, ఆయనకు టిఫిన్ ఇసుక, లంచ్ మైన్స్, డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు! బకాసురుడిని మించిపోయాడు పెద్దిరెడ్డి. పుంగనూరులో ఈసారి పెద్దిరెడ్డి గెలవడు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అనవసరం. పుంగనూరులో టీడీపీ జెండా ఎగురుతుంది. నా దయాదాక్షిణ్యాల వలన పెద్దిరెడ్డి గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన ఎలా గెలుస్తారో చూస్తాను. రేపు నీ వద్ద అధికారం ఉండదు పెద్దిరెడ్డీ... అప్పుడేం చేస్తావ్? వైసీపీ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీని బహిర్గతం చేస్తే అంగళ్లులో మన మీద దాడి చేసి 600 మందిని జైల్లో పెట్టారు. పెద్దిరెడ్డి పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కాని రేపు నీ దగ్గర అధికారం ఉండదు... అప్పుడు నిన్ను శిక్షించే బాధ్యత టీడీపీదే. పులివెందుల్లో కూడా మీ సైకో గెలవడని జగన్ కు చెప్పు పెద్దిరెడ్డీ! బెరైటీస్ అంతా ఊడ్చేశారు... ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు. ఆవులపల్లి రిజర్వాయర్ కట్టి రూ. 600 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు, ఈయన పాపాలకు ఎన్జీటీ రూ. 100 కోట్ల జరిమానా వేసింది. శివశక్తి డైరీతో పాడి రైతుల్ని దోచుకుంటున్నారు. పాపాల పెద్దిరెడ్డి రూ. 35 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడి చేశారు. దోచిన డబ్బంతా కక్కిస్తాం. రాజకీయనేతలా... బందిపోట్లా! పెద్దిరెడ్డి ఆయన కొడుకు, తమ్ముడు బందిపోట్ల మాదిరి తయారయ్యారు. తంబళపల్లెలో ఎక్కడ స్థలం కనపడితే దాన్ని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే పీలేరును పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలిగిరి, గుర్రం కొండ మైనింగ్ లో ఈయనే భాగస్వామి. రూ.400 కోట్ల విలువైన భూముల్ని, రూ. 500 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు. మదనపల్లె, రాజంపేట ఎమ్మెల్యేలను మార్చారు. కానీ పాపాల పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు? రైల్వే కోడూరు ఎమ్మెల్యే మంగపేట ముగ్గు గనులు, ఎర్రచందనం దోచుకుంటున్నారు. రాయచోటి ఎమ్మెల్యే భూములు దోచుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లు మనకు అవసరమా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులందరినీ చిత్తు చిత్తుగా ఓడించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక... పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం. హంద్రీ-నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లిస్తాం. ఏపీఐఐసీ ద్వారా సేకరించిన 2500 ఎకరాల్లో పరిశ్రమలు తెస్తాం. మదనపల్లె, తిరుపతి రోడ్డును పూర్తి చేస్తాం. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తాం" అని చెప్పారు. 1 Quote
Sucker Posted January 27, 2024 Report Posted January 27, 2024 Intiki oka job isthara anna 2014 type la. Quote
psycopk Posted January 27, 2024 Author Report Posted January 27, 2024 https://www.instagram.com/p/C2lypQ2vKt6/?igsh=MWRwc2ticXV2OXBtbA== Quote
psycopk Posted January 27, 2024 Author Report Posted January 27, 2024 17 minutes ago, Sucker said: Intiki oka job isthara anna 2014 type la. Apudu tdp vachindi kabate 10lk jobs.. companies.. projects … gov buildings aainai.. jagadu undi unte tent le gathi 1 Quote
Sucker Posted January 27, 2024 Report Posted January 27, 2024 Just now, psycopk said: Apudu tdp vachindi kabate 10lk jobs.. companies.. projects … gov buildings aainai.. jagadu undi unte tent le gathi Ippudu vasthunnam ga anna. Malli lepudham Development Amaravathi la. Quote
psycopk Posted January 27, 2024 Author Report Posted January 27, 2024 Just now, Sucker said: Ippudu vasthunnam ga anna. Malli lepudham Development Amaravathi la. Cbn ante all round development… jaggadu tukku tuku ga odipote investors ki bharosa vastadi 1 Quote
AFC Posted January 27, 2024 Report Posted January 27, 2024 40 minutes ago, psycopk said: Cbn ante all round development… jaggadu tukku tuku ga odipote investors ki bharosa vastadi If he wins then your crying will increase anna, take care 1 Quote
psycopk Posted January 27, 2024 Author Report Posted January 27, 2024 Chandrababu: నువ్వు, మీ చెల్లెలు కొట్టుకుని... ఆమె కాంగ్రెస్ లో కలిస్తే అందుకు నేనే కారణమా?: చంద్రబాబు 27-01-2024 Sat 21:47 | Andhra ఉరవకొండలో రా కదలిరా సభ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ తనకు స్టార్ క్యాంపెయినర్లేనని వెల్లడి Listen to the audio version of this article టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పీలేరు, ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలి రా సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉరవకొండ సభలో సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక తానే ఉన్నానని, వైఎస్ కుటుంబంలో తానే చిచ్చు పెట్టానని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం పట్ల మండిపడ్డారు. చంద్రబాబుకు పొరుగు రాష్ట్రంలో, ఇతర పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. "అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లు అంట. ఈయన చేసింది తప్పు అని ఎవరైనా అంటే చాలు... నాకు స్టార్ క్యాంపెయినర్లు అనో, నా మనుషులు అనో వాళ్లపై ముద్ర వేసేస్తున్నారు. ఎప్పుడైతే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయో వీళ్ల పతనం ప్రారంభమైంది. అక్కడ్నించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నువ్వు, మీ చెల్లెలు కొట్టుకుంటే... మీ చెల్లెలు వెళ్లి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్లు ఆమెకు పదవి ఇస్తే... దానికి కూడా నేనే కారణమా? ఆవిడకు కూడా నేనే స్క్రిప్టు ఇస్తున్నానంట. అంటే, ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, నీ వల్ల ఎవరు బాధపడి బయటికొచ్చినా వారు నాకు స్టార్ క్యాంపెయినర్లేనా? యస్... ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్లే. ఉద్యోగం రాని యువత నా స్టార్ క్యాంపెయినర్. నష్టపోయిన రైతులు నాకు స్టార్ క్యాంపెయినర్లు" అంటూ చంద్రబాబు వాడీవేడిగా ప్రసంగించారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.