Jump to content

YS Sunitha: వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్.. జగన్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపు 


psycopk

Recommended Posts

YS Sunitha: వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్.. జగన్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపు 

01-03-2024 Fri 12:04 | Andhra
  • వివేకా హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందన్న సునీత
  • అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
  • వీళ్లను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శ
 
Dont vote to Jagan party YSRCP says YS Sunitha

పాలిటిక్స్ లో హత్యా రాజకీయాలు ఉండకూడదని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ సరిగ్గా విచారణ జరపాలని... కానీ, ఆ పని చేయడం లేదని, వారిపై ఏ ప్రెజర్ ఉందో తనకు తెలియదని చెప్పారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు. 

కర్నూలులో అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లి, అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారులు వెనక్కి వచ్చారని... ఎవరినైనా అరెస్ట్ చేయకుండా సీబీఐ వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని... వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దని సునీత పిలుపునిచ్చారు.

  • Upvote 2
Link to comment
Share on other sites

YS Sunitha: అవినాశ్ కు శిక్ష పడాల్సిందే.. అప్పుడు జగన్ పై నాకు అనుమానం రాలేదు: వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు 

01-03-2024 Fri 12:31 | Andhra
  • సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమన్న సునీత
  • నాన్న హత్య కేసులో జగన్ ను కూడా విచారించాలని డిమాండ్
  • గొడ్డలితో చంపారనే విషయం జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్న
 
YS Sunitah sensational comments on Jagan and YS Avinash Reddy

తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆయన కూతురు వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమని... అందుకే హత్య జరిగిన తర్వాత జగన్ ను కలిసినప్పుడు ఆయనపై తనకు అనుమానం రాలేదని చెప్పారు. ఆ తర్వాత ఒక్కో విషయం అర్థమవుతూ వచ్చిందని అన్నారు. ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారించాలని అన్నారు. ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని చెప్పారు. 

వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందని సునీత ప్రశ్నించారు. ఇలాంటి నేరాలు ఆగిపోవాలంటే నిందితులకు శిక్షలు పడాల్సిందేనని చెప్పారు. జగన్ మీద 11 కేసులు ఉన్నాయని... ఆ కేసుల మాదిరే వివేకా హత్య కేసు కూడా కాకూడదని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే... తన తండ్రికి న్యాయం జరగదని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో తనకు న్యాయం జరగాలని అన్నారు. నాన్న హత్యలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని... అవినాశ్ కు శిక్ష పడాల్సిందేనని చెప్పారు. 

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు వెళదామని జగన్ ని అడిగానని... సీబీఐకి వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తాడని జగన్ చెప్పారని సునీత తెలిపారు. దీంతో, తానే వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీబీఐని కలిసిన తర్వాత తనకు, తన భర్తకు వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. అనుమానితులందరినీ సీబీఐ విచారించాల్సిందేనని చెప్పారు. తనను, తన భర్తను కూడా అనుమానితులుగానే సీబీఐ విచారించిందని తెలిపారు. తనను విచారించినట్టే ప్రతి ఒక్కరినీ విచారించాలని అన్నారు. 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

YS Sunitha: సీబీఐ దర్యాప్తు నెమ్మదిగా సాగడం వెనుక బీజేపీ హస్తం ఉందా?.. అనే ప్రశ్నకు వైఎస్ సునీత సమాధానం ఇదిగో! 

01-03-2024 Fri 12:55 | Andhra
  • బీజేపీ హస్తం ఉందా? లేదా? అనే విషయం తనకు తెలియదన్న సునీత
  • నాన్నను చంపిన వారిని రక్షించే పనిలో జగన్ ఉన్నారని విమర్శ
  • శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత కథ మొత్తం మారిపోయిందని వెల్లడి
 
YS Sharmila comments on CBI inquiry in YS Viveka murder case

తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన కూతురు వైఎస్ సునీత అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు బీజేపీ పెద్దల అండ ఉండటం వల్లే జాప్యం జరుగుతోందనే విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అంశంపై సునీతను ప్రశ్నిస్తే ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సీబీఐ విచారణ నెమ్మదిగా సాగడం వెనుక బీజేపీ హస్తం ఉందా? లేదా? అనే విషయం తనకు తెలియదని సునీత చెప్పారు.

నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగన్ కు ఎలా తెలిసిందో బయటకు రావాల్సి ఉందని సునీత అన్నారు. మంచికి, చెడుకు మధ్య పోరాటమని... పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని జగన్ అంటుంటారని... మరి తన తండ్రిని చంపిన పెత్తందారుల సంగతి ఏమిటని ప్రశ్నించారు. మాట్లాడితే అక్కాచెల్లెమ్మలు అంటుంటారని... మరి ఈ చెల్లెమ్మ సంగతి ఏమిటని అడిగారు. తన తండ్రిని చంపిన వారిని రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు.

అప్రూవర్ గా మారిన దస్తగిరిని కూడా జైలుకు వెళ్లి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెపితే రూ. 20 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తామని చెప్పారని దుయ్యబట్టారు. ఎంత ధైర్యం ఉంటే జైలుకు వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తారని మండిపడ్డారు. దస్తగిరి ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తున్నాడని కితాబునిచ్చారు. తనపైనే కేసులు పెట్టారని... రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తొలి నుంచి కూడా తనకు తన సోదరి షర్మిల అండగా ఉన్నారని అన్నారు. బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డి మద్దతుగా ఉన్నారని చెప్పారు. 

నాన్న హత్యకేసులో శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత కథ మొత్తం మారిపోయిందని సునీత అన్నారు. శివశంకర్ రెడ్డి అరెస్టుతో అందరిలో భయం మొదలయిందని... దీంతో, సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టడం ప్రారంభించారని చెప్పారు. ఈ క్రమంలో కడప నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్ కు వెళ్లిపోయారని తెలిపారు. ఈ కేసులో ఉన్న నిందితులు బెయిల్ పై బయటకు వస్తే విచారణను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

Link to comment
Share on other sites

41 minutes ago, ticket said:

Calling Paytm @Sizzler enti chellamma lu iddaru anniya ki vote veyyoddu antunnaru...

కొంపలో కుంపటి అంటే ఇదే ఏమో 

  • Haha 1
Link to comment
Share on other sites

Sigguleni jaffa batch @vetrivel @Android_Halwa @Raisins_72 @RSUCHOU to support a  murder accused.

Chandrababu - proper democratic ga NTR ni CM position nunchi remove chesthe (with MLA vote and everything)- vennu potu vennu potu antu edho nizanga NTR meedha prema tho oka range lo veshaalu vessaru.

Here he is  involved in murder of his own relative.

Link to comment
Share on other sites

lakshmi-ntr-lakshmi-parvathi-finds-a-die 

 

LP supporting YSRCP

YS Sunita family supporting TDP.

saripoyaru iddariki iddaru.....vachadu-brahmanandam.gif

  • Haha 1
Link to comment
Share on other sites

Sunitha does not have the Oratory skills required.... Or else this press meet would have gone viral....

Ide pressmeet Sharmila akka petti unte...Asalu aa effect veru undedi....47osjd.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...