psycopk Posted March 25 Report Share Posted March 25 Chandrababu: మూడు పార్టీల అజెండా ఒక్కటే: చంద్రబాబు 25-03-2024 Mon 17:31 | Andhra కుప్పంలో టీడీపీ సభ సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఏపీలో అరాచక పాలన పోవాలన్నదే కూటమి లక్ష్యమని వెల్లడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని ఉద్ఘాటన టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఏపీలో అరాచకపాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని... రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు. ఈసారి ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇస్తామని, ఇంటివద్దకే తెచ్చి అందిస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 25 Author Report Share Posted March 25 Chandrababu: కుప్పంలో నన్ను ఓడించడం వీళ్ల వల్ల అవుతుందా?: చంద్రబాబు 25-03-2024 Mon 17:04 | Andhra కుప్పంలో చంద్రబాబు బహిరంగ సభ ఈసారి తనకు లక్ష మెజారిటీ ఖాయమని ధీమా వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని పిలుపు వచ్చే ఐదేళ్లలో కుప్పంలో రెట్టింపు అభివృద్ధి చేస్తానని హామీ టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కుప్పంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కుప్పం ప్రజలు ఈసారి తనకు లక్ష ఓట్ల మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కుప్పం ప్రజలను తానెప్పుడూ ఇలా అడగలేదని అన్నారు. కానీ ప్రజలే తనకు భారీ మెజారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తారా, నమ్మకమేనా? అని చంద్రబాబు కుప్పం ప్రజానీకాన్ని ప్రశ్నించారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం... అన్ని ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన నియోజకవర్గం కుప్పం, సైకిల్ కు తప్ప వేరే పార్టీకి ఓటేయని నియోజకవర్గం కుప్పం... ఇది బంగారు కుప్పం అని అభివర్ణించారు. "ఇలాంటి కుప్పంలో మీరు చరిత్ర సృష్టించాలని నిర్ణయించుకున్నారు. అందుకే అడుగుతున్నా. గతంలో 70 వేల మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి టార్గెట్... లక్ష ఓట్ల మెజారిటీ. ఇప్పటికే ఏడు సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి ఎంతో రుణపడి ఉన్నాను. గత 35 ఏళ్లలో ఏం చేశానో, అంత అభివృద్ధి రాబోయే ఐదేళ్లలో చేసి చూపిస్తాను. మీది, నాది ఈనాటి బంధం కాదు. గత మూడున్నర దశాబ్దాలుగా నన్ను ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇల్లు నా ఇల్లు. ప్రతి గ్రామం నా గ్రామమే. ప్రతి కుటుంబం నా కుటుంబమే. ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా నా ఇబ్బందిగానే భావించి మీకు అండగా నిలుస్తాను. మొన్న చాలా మంది కుప్పిగంతలు వేశారు. కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తాం... వై నాట్ కుప్పం, వై నాట్ 175 అన్నారు. కుప్పంలో నన్ను ఓడించడం వీళ్ల వల్ల అవుతుందా? నేను అడుగుతున్నా... వై నాట్ పులివెందుల? జగన్... నీకెందుకు ఓటెయ్యాలి? బాబాయిపై గొడ్డలి వేటు వేసినందుకా? రాష్ట్రాన్ని దోచుకున్నందుకా? రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసినందుకా? ఈ రోజు కుప్పం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రచారం ప్రజాగళానికి శ్రీకారం చుడుతున్నా. ఈ ప్రజాగళం ఉద్ధృతంగా మారి, తీవ్ర వాయుగుండంగా మారి... అడ్డొచ్చిన వాళ్లను బంగాళాఖాతంలో కలిపేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది. సమయం ఉందని అశ్రద్ధ చేయొద్దు తమ్ముళ్లూ! సైకిల్ గాలి ఉద్ధృతంగా వీయాలి. ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టని అడిగినా... సైకిల్, దాని మిత్రపక్షాల మాటే వినపడాలి. ఫ్యాన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలంతే. చేసిన తప్పుడు పనులకు ఆ ఫ్యాన్ కనపడకూడదు. కుప్పం ప్రజలు లక్ష మెజారిటీ ఇస్తామని మాటిచ్చారు... రాష్ట్రంలో టీడీపీ కూటమిని 175కి 175 స్థానాల్లో గెలిపిస్తామని రాష్ట్ర ప్రజలు సంకల్పం చేయాలి. ఐదేళ్లపాటు వైసీపీ పాలనలో అక్రమాలు, అరాచకాలు, బాదుడే బాదుడు... ఇలా అన్నీ చూశాం. సామాన్య పౌరుల కుటుంబాల నుంచి, అన్ని వర్గాల వారు నష్టపోయారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ప్రైవేటు ఆస్తులు, కంపెనీలు, పరిశ్రమలు, వాటాలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు, తాము అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులతో రౌడీలను నియంత్రిస్తాం. ఎన్నికలు సజావుగా జరగనివ్వాలని రౌడీలను హెచ్చరిస్తున్నాం. ఇటీవల హంద్రీనీవా నీళ్ల పేరుతో జగన్ వచ్చి హంగామా చేశారు. కానీ కుప్పంకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే, టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. నాడు హంద్రీనీవా ప్రాజెక్టును 90 శాతం నేనే పూర్తి చేశాను. వచ్చే సీజన్ లో కుప్పంకు నీళ్లు తెచ్చి అన్ని చెరువులు నింపుతాం. నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా మైనింగ్ చేస్తున్నారు. శాంతిపురంలో కేజీఎఫ్ మాదిరిగా తవ్వేశారు. వైసీపీ నేతలు యధేచ్ఛగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. పుంగనూరు వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తం కక్కిస్తా" అంటూ చంద్రబాబు హెచ్చరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 25 Author Report Share Posted March 25 Chandrababu: నిజమైన దేవతలు మీరు: కుప్పంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి 25-03-2024 Mon 14:58 | Andhra కుప్పంలో చంద్రబాబు పర్యటన కుప్పం వస్తే తనకు ఫుల్ జోష్ వస్తుందని వెల్లడి ఇక్కడి ప్రజలు నిస్వార్థపరులని కితాబు మహిళలందరిలో శక్తి ఉంటుందని, దాన్ని వెలికితీయాలని వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటనకు వచ్చారు. ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రజల మంచి మనసు కారణంగానే, తాను కుప్పం వస్తే ఆనందం కలుగుతుందని తెలిపారు. ఇక్కడి ప్రజలు ఎంతో నిస్వార్థంగా తనను అభిమానిస్తారని, అది తనకు బాగా నచ్చే అంశం అని చంద్రబాబు వివరించారు. అందుకే తాను కుప్పం వస్తే బాగా చార్జింగ్ అవుతానని, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ శక్తి తనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రెన్యువల్ చేయించుకోవడానికి వచ్చా గత 35 ఏళ్లుగా ఏడు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ పరంపరను రెన్యువల్ చేయించుకోవడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాను. మళ్లీ గెలిపించమని మీ ఆశీస్సులు కోరుతున్నాను. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఇక్కడ్నించే శ్రీకారం చుడుతున్నాను. అందుకే ఇవాళ మొదట వినాయకుడి ఆలయానికి వెళ్లాను. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడికి దణ్ణం పెట్టుకున్నాను. ఆ తర్వాత కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్లాను. మా ఆడబిడ్డలు ఆరాధించే కన్యకాపరమేశ్వరి ఆలయానికి వారి ప్రతినిధిగా వెళ్లి పూజలు చేశాను. ఆ తల్లి దీవెనలు తీసుకున్నాను. నిజమైన దేవతలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. మీకోసం ఇక్కడికి వచ్చాను నేను. మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది. ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా జరగాల్సి అవసరం ఉంది. ఇప్పుడున్న ఆదాయాన్ని మూడింతలు చేస్తా రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు మాటిస్తున్నానని, ఇప్పుడున్న ఆదాయాన్ని మూడింతలు చేసే బాధ్యత నాది. జలగ చేసే పని... రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం! నేను అలా కాదు... సంపద సృష్టిస్తాను, ఆదాయాన్ని పెంచుతాను... ఆ డబ్బును మీకే పంచుతాను... ఆ డబ్బుతో రూ.15తో రూ.100 సంపాదించే మార్గం నేను నేర్పిస్తాను... రూ.100 నుంచి రూ.1000... రూ.1000 నుంచి రూ. పది వేలు సంపాదించే మార్గం నేను చూపిస్తా. నేను ఎక్కడో పుట్టలేదు నేను ఎక్కడో పుట్టలేదు... ఇక్కడే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా అమ్మకు చదువు రాదు. మా నాన్న ఒక రైతు. ఎన్టీఆర్ కూడా ఒక సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. మహాత్మాగాంధీ కూడా అంతే. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నోసార్లు చెప్పారు... ఒక రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకుంటూ పైకొచ్చిన వ్యక్తి ఆయన. మీ అందరిలోనూ శక్తి ఉంటుంది... దాన్ని వెలికితీయాలన్నదే నా ఆలోచన. మహిళలను అసాధారణ శక్తిమంతులుగా చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుంది. రెండు ఆవులు ఇస్తానంటే ఎగతాళి చేశారు కుప్పంలో ఇంటికి రెండు ఆవులు ఇస్తానంటే అందరూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు 4 లక్షల లీటర్ల పాలసేకరణ సాధ్యమైంది. స్కూలుకు వెళ్లే ఆడపిల్లలందరికీ సైకిళ్లు ఇచ్చాం. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మహిళలను ఆర్టీసీ కండక్టర్లుగా నియమించాం. ఏపీ మహిళలు ప్రపంచానికే ఆదర్శం కావాలన్నదే తన ఆశయం.... అని చంద్రబాబు స్పష్టం చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
CaptainMaverick Posted March 25 Report Share Posted March 25 "రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించామని తెలిపారు" Endukivvaali ee 4% reservation?? Muslims came to India by invasion. They had ruled India for a 1000 years. They are ruling class. Any reservation to them is outright betrayal of all OCs. Religion based reservation is unconstitutional. Maaru Babu....Mee kootami adhaikaram loki raagane BJP mundu peekamanedi ee reservation ni! Congress DNA antav kada Babu....Indira Gandhi Mandal Comission ne oppose chesindi. Adhikaaram kosam emaina chepthaava?!! Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.