Jump to content

అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావు జగన్ రెడ్డీ!: నారా లోకేశ్


psycopk

Recommended Posts

Nara Lokesh: అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావు జగన్ రెడ్డీ!: నారా లోకేశ్ 

05-04-2024 Fri 14:08 | Andhra
  • కడప జిల్లాలో శ్రీనివాసులు అనే వ్యక్తి హత్య
  • ఓ పత్రికలో వచ్చిన కథనంపై తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్
  • అందుకేనా నా బీసీలు, నా బీసీలు అంటావు అని గ్రహం 
 
Nara Lokesh fires on CM Jagan

జగన్ ఇలాకాలో మరో బీసీ వ్యక్తి హత్య అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అంతులేని భూ దాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలితీసుకుంటావు జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. నీ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముఠా బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి, ఆయనను అత్యంత దారుణంగా హతమార్చిందని లోకేశ్ ఆరోపించారు. కాపాడాల్సిన ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి హంతకులకు మద్దతుగా నిలిచాడని మండిపడ్డారు. బీసీల భూములు లాక్కుని, చంపేందుకేనా... నా బీసీలు, నా బీసీలు అంటావ్ జగన్ రెడ్డీ? అని నిలదీశారు.

Link to comment
Share on other sites

Nara Lokesh: లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన గుంటూరు నేత తాడిశెట్టి మురళి 

05-04-2024 Fri 16:07 | Andhra
  • నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న గుంటూరు, అనంతపురం జిల్లాల నేతలు
  • పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికిన నారా లోకేశ్ 
 
Tadisetti Murali and family members joins TDP

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ  టీడీపీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇవాళ  ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో భారీగా చేరికలు  జరిగాయి. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. గుంటూరుకు చెందిన తాడిశెట్టి మురళీమోహన్ నేడు లోకేశ్ సమక్షంలో కుటుంబ సభ్యులతో సహా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేసిన తాడిశెట్టి  వెంకట్రావు సోదరుడే తాడిశెట్టి మురళి. మురళి గతంలో డిప్యూటీ మేయర్ గా వ్యవహరించారు. ఇటీవలే తాడిశెట్టి బ్రదర్స్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. 

ఇవాళ లోకేశ్ సమక్షంలో తాడిశెట్టి మురళీమోహన్, ఆయన అనుయాయులు పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు. వారందరికీ టీడీపీ కండువాలు కప్పిన లోకేశ్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వైసీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి ఇప్పుడే వచ్చింది అని వ్యాఖ్యానించారు. ప్రజలు తమవైపే ఉన్నారని, తమ మేనిఫెస్టోలోని సూపర్-6 పథకాలను తప్పక అమలు చేస్తామని అన్నారు.

Link to comment
Share on other sites

Nara Lokesh: సింగిల్ గా వస్తానన్న జగన్ ప్రతి ఎన్నికకు శవాలతో వస్తున్నారు: నారా లోకేశ్ వ్యంగ్యం 

05-04-2024 Fri 16:51 | Andhra
  • 2014లో తండ్రి శవం, 2019లో బాబాయి శవంతో రాజకీయం అంటూ విమర్శలు
  • ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని లబ్ధి పొందాలని కుట్ర అంటూ ఫైర్
  • జగన్ రెడ్డి గొప్ప నటుడు అంటూ వ్యాఖ్యలు
 
 
Nara Lokesh satires on CM Jagan

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి ఇవాళ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఏపీలో పెన్షన్ల వ్యవహారం తీవ్ర రూపు దాల్చడంపై స్పందించారు. ప్రతి ఎన్నికకు సింగిల్ గా వస్తానని చెబుతున్న జగన్, ప్రతిసారి శవాలతో వస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో తండ్రి శవాన్ని వాడుకున్నారు, 2019లో బాబాయి శవాన్ని వాడుకున్నారు, ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. 

"జగన్ రెడ్డి గొప్ప నటుడు. 2019లో బాబాయిని లేపేశాడు, ఇప్పుడు పెన్షన్ పేరుతో వృద్ధులను చంపేందుకు సిద్ధపడ్డాడు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలను వాలంటీర్లతో ఇంటివద్దకే అందిస్తాం. చంద్రబాబునాయుడు 2019లో హామీ ఇవ్వకపోయినా పెన్షన్ ను రూ.1000 నుంచి 2 వేలకు పెంచారు. 

జగన్ మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు. జగన్ పాలనలో ఎన్నడూ లేని విధంగా బీసీ సోదరులపై 26 వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్ నాథ్ గౌడ్ అనే బాలుడ్ని పెట్రోల్ పోసి దారుణంగా చంపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. 

అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకం పునరుద్ధరించి నాణ్యమైన పనిముట్లు అందజేస్తాం. గత టీడీపీ పాలనలో ఏనాడూ మైనార్టీలపై దాడులు జరగలేదు. రంజాన్ తోఫా, షాదీ ఖానాల నిర్మాణం, రంజాన్ సమయంలో మసీదుల మరమ్మతులకు నిధులు, దుల్హన్ పథకం, విదేశీ విద్య ద్వారా మైనార్టీలను ఆదుకున్నాం. మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. 

రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పు ఉంది. రేపు రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం. అందుకే ప్రజలంతా కూటమిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం" అంటూ లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...