Jump to content

Recommended Posts

Posted
1 minute ago, Raisins_72 said:

Even if they don’t respond, the circus(army/terr0rists/radicals/imran’s batch/Balochi) in Pakistan won’t let them stop. 

let them fight and saava ni anna. we are getting some infra and projects like Apple complete ga within 2 years. full pledged war will slow down things. 

Posted

The chief of Indian Army just tweeted this 

 

 

Posted
Just now, Sucker said:

let them fight and saava ni anna. we are getting some infra and projects like Apple complete ga within 2 years. full pledged war will slow down things. 

I don’t have any prbm as long as they fight themselves, malli mana desham meedhaki vachi pant theeyi, m0dda soopinchu anteney prbm ! 

Posted
Just now, 11_MohanReddy said:

The chief of Indian Army just tweeted this 

 

 

🔥🔥🔥

Posted

Is it real war or Twitter/X war? 

  • Haha 1
Posted
31 minutes ago, Konebhar6 said:

Is it real war or Twitter/X war? 

true that :D

Posted

 

Ajit Doval: ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం మాకు లేదు.. కానీ: అమెరికా, సౌదీ సహా వివిధ దేశాల ప్రతినిధులతో అజిత్ దోవల్ 

07-05-2025 Wed 16:01 | National
Ajit Doval Clarifies Indias Stance on Pakistan Tensions
 

 

  • ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన అజిత్ దోవల్
  • పాకిస్థాన్ చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధమని స్పష్టీకరణ
  • అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడిన దోవల్
భారతదేశానికి పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని, అయితే పాకిస్థాన్ ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, వాటిని తిప్పికొట్టేందుకు, ధీటుగా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతర పరిణామాలపై ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ ప్రత్యేకంగా మాట్లాడారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు జరిపిన కచ్చితత్వంతో కూడిన దాడుల గురించి, ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి వారికి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగానే, భారత వైఖరిని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఎంతటి చర్యలకైనా వెనుకాడబోమని పరోక్షంగా హెచ్చరించారు.

"ఉద్రిక్తతలను పెంచాలన్నది మా ఉద్దేశం కాదు. అయితే, పాకిస్థాన్ గనుక ఏదైనా సాహసానికి ఒడిగడితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి తగిన విధంగా, దృఢంగా ప్రతిస్పందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని దోవల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనే లక్ష్యంగా, ఆ దేశంలోని సాధారణ పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా ఈ దాడులను అత్యంత కచ్చితత్వంతో, వ్యూహాత్మకంగా నిర్వహించామని కూడా ఆయన అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. 

 

 

 

Posted

Khawaja Asif: భారత్ వెనక్కి తగ్గితేనే ఉద్రిక్తతలు చల్లారతాయి: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 

07-05-2025 Wed 15:22 | International
Will wrap up tensions if India backs down says Pak Defence Minister Khawaja Asif
 

 

  • భారత్ దూకుడు తగ్గించుకుంటేనే ఉద్రిక్తతలు తగ్గుతాయన్న పాక్ రక్షణ మంత్రి
  • 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ దాడులు చేసిందని పాక్ ఆరోపణ
  • భారత వైమానిక దాడుల్లో 26 మంది మృతి, 46 మందికి గాయాలని పాక్ వెల్లడి
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం సమసిపోవాలంటే, భారత్ తన దూకుడు వైఖరి నుంచి వెనక్కి తగ్గాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత వైమానిక దాడులకు ప్రతిగా తాము కూడా నియంత్రణ రేఖ వెంబడి ప్రతిదాడి చర్యలు చేపట్టినట్లు పాకిస్థాన్ పేర్కొంది.

బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ నుంచి ఎలాంటి దురాక్రమణ ఎదురైనా దానికి ప్రతిస్పందించే హక్కు పాకిస్థాన్‌కు ఉందని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రస్తుత ఘర్షణలో ఇస్లామాబాద్ కేవలం భారత దాడులకు ప్రతిస్పందిస్తోందని, తమను దురాక్రమణదారులుగా చూడరాదని ఆయన నొక్కి చెప్పారు. "ఈ ఉద్రిక్తతలను ప్రారంభించింది భారత్. ఒకవేళ భారత్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉంటే, మేం కచ్చితంగా ఈ ఉద్రిక్తతలను చల్లార్చుతాం" అని ఆయన తెలిపారు. "మేం దాడికి గురైనంత కాలం, కాల్పులు జరుగుతున్నంత కాలం, మేం స్పందించాల్సి ఉంటుంది. మమ్మల్ని మేం రక్షించుకోవాలి. కానీ భారత్ వెనక్కి తగ్గితే, మేం ఈ ఉద్రిక్తతలను ముగిస్తాం" అని పాక్ రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు.
Posted

Masood Azhar: "నేను కూడా చనిపోతే బాగుండేది"... కుటుంబ సభ్యులు చనిపోవడంపై స్పందించిన మసూద్ అజార్ 

07-05-2025 Wed 14:49 | International
Masood Azhars Response to Family Deaths in Operation Sindhu
 

 

  • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'
  • తన కుటుంబ సభ్యులు 10 మంది, నలుగురు అనుచరులు మృతిచెందారని జైషే చీఫ్ మసూద్ అజార్ ప్రకటన
  • బహావల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినట్లు వెల్లడి
  • మరణాన్ని ఉద్దేశిస్తూ, నా కుటుంబ సభ్యులు సంతోషాన్ని పొందారని వ్యాఖ్య
  • వారిలో తాను ఉంటే బాగుండేదన్న మసూద్ అజార్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో తమ కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహిత అనుచరులు మరణించినట్లు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీద్ సుభాన్ అల్లాపై జరిగిన ఈ దాడుల్లో మరణించిన వారిలో తన పెద్ద సోదరి, ఆమె భర్త, ఒక మేనల్లుడు, అతని భార్య, ఒక మేనకోడలు, ఇంకా తమ బంధువర్గానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని అజార్ ఒక ప్రకటనలో చెప్పాడని సమాచారం.

1994లో భారత్‌లో అరెస్టయి, అనంతరం ఎయిర్ ఇండియా ఐసీ 814 విమానం హైజాక్ ఘటన తర్వాత విడుదలైన మసూద్ అజార్, "ఈ రాత్రి నా కుటుంబంలోని పది మంది సభ్యులు ఈ సంతోషాన్ని (మరణాన్ని ఉద్దేశిస్తూ) పొందారు. వీరిలో ఐదుగురు అమాయక పిల్లలు, నా పెద్ద సోదరి, ఆమె గౌరవనీయులైన భర్త, నా మేనల్లుడు ఫాజిల్, అతని భార్య, నా ప్రియమైన మేనకోడలు (ఫాజిలా), నా ప్రియ సోదరుడు హుజైఫా, అతని తల్లి, మరో ఇద్దరు ప్రియ సహచరులు ఉన్నారు" అని పేర్కొన్నట్లు పీటీఐ పేర్కొంది. మరణించిన వారు అల్లా దర్బారుకు అతిథులుగా వెళ్లారని వ్యాఖ్యానించాడు.

విచారం లేదా నిరాశ లేదు.. నేనూ ఉంటే బాగుండేది

ఈ ఘటనపై తనకు ఎలాంటి విచారం గానీ, నిరాశ గానీ లేదని, పైగా ఈ పద్నాలుగు మంది సంతోషకరమైన యాత్రికుల బృందంలో నేనూ చేరి ఉంటే బాగుండేదని నా మనసు పదేపదే కోరుకుంటోంది అని అజార్ చెప్పినట్లుగా సమాచారం. "వారి నిష్క్రమణకు సమయం ఆసన్నమైంది, కానీ భగవంతుడు వారిని చంపలేదు" అంటూ అజార్ వ్యాఖ్యానించాడని, నేడు జరగనున్న అంత్యక్రియల ప్రార్థనలకు రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానించాడని కూడా ఆ ప్రకటనలో ఉన్నట్లు పీటీఐ నివేదించింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన 56 ఏళ్ల మసూద్ అజార్, భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల కుట్రలో కీలక పాత్ర పోషించాడు. వీటిలో 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి ముఖ్యమైనవి. ఈ ఉగ్రవాది పాకిస్థాన్‌లోనే ఉన్నాడన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ, అతని గురించి తమకు సమాచారం లేదని ఇస్లామాబాద్ పదేపదే ఖండిస్తూ వస్తోంది.
Posted

General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు 

07-05-2025 Wed 14:14 | National
Indian Armys Operation Sindhu Former Army Chiefs Key Remarks
 

 

  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'
  • సినిమా ఇంకా పూర్తి కాలేదన్న మాజీ ఆర్మీ చీఫ్ నరవణే
  • దాడులు కొనసాగించాలని సూచించిన మాజీ ఆర్మీ చీఫ్ శంకర్ రాయ్‌చౌదరి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఉద్దేశిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే, "సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది" అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

దాడులు కొనసాగించాలి

మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ శంకర్ రాయ్‌చౌదరి కూడా ఈ దాడులపై స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్‌గా ఆయన ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఇక్కడితో ఆపకూడదని, కొనసాగించాలని సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని, ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో మాజీ ఆర్మీ చీఫ్‌ల నుంచి ఈ తరహా స్పందన రావడం గమనార్హం.

దాడి దృశ్యాల విడుదల

ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పాల్గొన్నారు. కోట్లీలోని గుల్పూర్ ఉగ్రవాద శిబిరంపై భారత సైన్యం ఎలా దాడి చేసిందో వివరిస్తూ కల్నల్ సోఫియా ఖురేషి ఒక వీడియోను ప్రదర్శించారు. గతంలో ఫూంచ్‌ సెక్టార్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
Posted

General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు 

07-05-2025 Wed 14:14 | National
Indian Armys Operation Sindhu Former Army Chiefs Key Remarks
 

 

  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్'
  • సినిమా ఇంకా పూర్తి కాలేదన్న మాజీ ఆర్మీ చీఫ్ నరవణే
  • దాడులు కొనసాగించాలని సూచించిన మాజీ ఆర్మీ చీఫ్ శంకర్ రాయ్‌చౌదరి
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఉద్దేశిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే, "సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది" అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

దాడులు కొనసాగించాలి

మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ శంకర్ రాయ్‌చౌదరి కూడా ఈ దాడులపై స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్‌గా ఆయన ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఇక్కడితో ఆపకూడదని, కొనసాగించాలని సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని, ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో మాజీ ఆర్మీ చీఫ్‌ల నుంచి ఈ తరహా స్పందన రావడం గమనార్హం.

దాడి దృశ్యాల విడుదల

ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పాల్గొన్నారు. కోట్లీలోని గుల్పూర్ ఉగ్రవాద శిబిరంపై భారత సైన్యం ఎలా దాడి చేసిందో వివరిస్తూ కల్నల్ సోఫియా ఖురేషి ఒక వీడియోను ప్రదర్శించారు. గతంలో ఫూంచ్‌ సెక్టార్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...