psycopk Posted May 8 Author Report Posted May 8 S-400: పాక్ మిస్సైళ్లకు అడ్డుగా భారత 'సుదర్శన చక్రం'... ఏమిటీ ఎస్-400? 08-05-2025 Thu 20:43 | National పాక్ దాడులను ఎస్-400తో నిలువరించిన భారత్ మధ్యలోనే పాక్ క్షిపణులను అడ్డుకుని పేల్చివేసిన ఎస్-400 ఎస్-400... రష్యా తయారీ ఆయుధ వ్యవస్థ నాటో దేశాలకు కూడా సవాలుగా నిలిచిన గగనతల రక్షణ వ్యవస్థ పొరుగుదేశం పాకిస్థాన్ మరోమారు తన దుందుడుకు వైఖరిని ప్రదర్శించగా, భారత వాయుసేన (ఐఏఎఫ్) సమర్థవంతంగా తిప్పికొట్టింది. గత రాత్రి పాకిస్థాన్ సైనిక దళాలు ఉద్రిక్తతలను పెంచేందుకు చేసిన ప్రయత్నాలను భారత వాయుసేన రష్యా నిర్మిత అత్యాధునిక ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ (సుదర్శన చక్ర)తో విఫలం చేసింది. భారత్ రంగంలోకి దించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే (సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ - SAM) వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యవస్థ తన అపారమైన దూరశ్రేణి సామర్థ్యాల కారణంగా నాటో (NATO) సభ్య దేశాలకు కూడా ప్రధాన సవాలుగా మారింది. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. ఎస్-400 వ్యవస్థ ప్రత్యేకతలు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పేరుపొందింది. ఈ వ్యవస్థలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి: క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు. ముఖ్యమైన విభాగాలు, సామర్థ్యాలు ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిన అనేక అధునాతన రాడార్లు మరియు క్షిపణి ప్రయోగ వాహకాలను కలిగి ఉంటుంది. దీని మల్టీఫంక్షన్ రాడార్ వ్యవస్థలో 92ఎన్2ఈ గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్ మరియు 96ఎల్6 చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడార్ ముఖ్యమైనవి. ఇవి 360-డిగ్రీల నిఘాను అందిస్తూ, 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించగలవు. ఎస్-400 ఏకకాలంలో 300 వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు మరియు ఒకేసారి 36 ముప్పులను ఛేదించగలదు. ఎస్-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి నాలుగు రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది. 40ఎన్6: 400 కిలోమీటర్ల పరిధితో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి. 48ఎన్6: 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్యశ్రేణి క్షిపణి. 9ఎం96ఈ మరియు 9ఎం96ఈ2: 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో, వేగంగా కదిలే యుద్ధ విమానాలు మరియు కచ్చితత్వంతో కూడిన ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప నుండి మధ్యశ్రేణి క్షిపణులు. ఈ క్షిపణులు గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో (మాక్ 14) ప్రయాణించే లక్ష్యాలను, అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో, అంతరిక్షపు అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. కార్యాచరణ సౌలభ్యం, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎస్-400 వ్యవస్థ అత్యంత సరళమైనది కావడంతో దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లో మరియు స్టాండ్బై నుంచి 35 సెకన్లలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. దీని లాంచర్ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి, రోడ్లపై గంటకు 60 కిమీ మరియు ఆఫ్-రోడ్లో గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణించగలవు. Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 Indian Defense Ministry: పాక్ దాడులను అప్పటికప్పుడే తిప్పికొట్టాం: భారత రక్షణ శాఖ ప్రకటన 08-05-2025 Thu 23:13 | National జమ్మూపై పాక్ డ్రోన్లు, క్షిపణుల దాడి యత్నం భారత భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి దాడులను నిర్వీర్యం చేసిన వైనం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రక్షణ శాఖ వెల్లడి జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న కీలక సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు యత్నించగా, భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని స్పష్టం చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు యత్నించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శత్రువుల నుంచి ముప్పును పసిగట్టిన వెంటనే, భారత సైన్యం నిర్దేశిత కార్యాచరణ నిబంధనలకు అనుగుణంగా ప్రతిస్పందించిందని, కైనెటిక్ (భౌతిక) మరియు నాన్-కైనెటిక్ (అభౌతిక) సామర్థ్యాలను ఉపయోగించి ఈ ముప్పులను తక్షణమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు వివరించారు. భద్రతా దళాల సత్వర ప్రతిచర్య వల్ల ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, సైనిక ఆస్తులకు కూడా ఎటువంటి నష్టం కలగలేదని రక్షణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి భారతదేశం ఎల్లప్పుడూ పూర్తిగా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. సరిహద్దుల్లో ఎలాంటి దుందుడుకు చర్యలనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని రక్షణ వర్గాలు వ్యాఖ్యానించాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు, అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు రక్షణ శాఖ తన ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 Marco Rubio: జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్లకు అమెరికా మంత్రి మార్కో రుబియో ఫోన్ 08-05-2025 Thu 22:46 | International జైశంకర్, రూబియో మధ్య టెలిఫోన్ సంభాషణ తక్షణ ఉద్రిక్తతల నివారణకు అమెరికా పిలుపు భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు యూఎస్ మద్దతు పహల్గామ్ దాడిపై అమెరికా ప్రగాఢ సంతాపం ఉగ్రవాద నిర్మూలనలో భారత్కు సహకారం ఉంటుందన్న అమెరికా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో అమెరికా మంత్రి మార్కో రూబియో టెలిఫోన్లో మాట్లాడారని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. ఈ సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా రూబియో నొక్కిచెప్పారని టామీ బ్రూస్ తన ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరిచేందుకు నిరంతర ప్రయత్నాలను కొనసాగించాలని రూబియో ప్రోత్సహించినట్లు వివరించారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి పట్ల రూబియో తమ ప్రగాఢ సంతాపం పునరుద్ఘాటించారని టామీ బ్రూస్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్తో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆయన మరోసారి స్పష్టం చేసినట్లు తెలియజేశారు. మరోవైపు, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్కు కూడా మార్కో రుబియో ఫోన్ చేశారు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్తో పాటు పాకిస్థాన్కు పిలుపునిచ్చారు. ఈరోజు సాయంత్రం పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో జమ్ము కశ్మీర్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో భారత్కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని రక్షణ విభాగం ప్రకటించింది. Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 Rajnath Singh: త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ భేటీ.. ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్ 08-05-2025 Thu 22:37 | National డ్రోన్ దాడిని ప్రధాని మోదీకి నివేదించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రధాన మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ భారత్పై పాకిస్థాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టింది. పాకిస్థాన్ నుంచి భారీ స్థాయిలో దాడులు జరిగినట్లు సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఈ సమాచారం అందిన వెంటనే, ప్రధానమంత్రి మోదీ తాజా పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. కాగా, పాకిస్థాన్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ము కశ్మీర్ తో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులకు సెలవులను రద్దు చేశాయి. అధికారులు ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దని, అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 Chandrababu Naidu: ఆపరేషన్ సిందూర్... ఏపీ సీఎం చంద్రబాబుకు పటిష్ట భద్రత... డీజీపీ ఆదేశాలు 08-05-2025 Thu 22:35 | Andhra ఆపరేషన్ సిందూర్’ అనంతరం రాష్ట్ర భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశం సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులకు సూచన ప్రజలకు, కార్యకర్తలకు అసౌకర్యం కలగకుండా భద్రత ఉండాలన్న సీఎం చంద్రబాబు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు ముఖ్యంగా అతి ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీల) భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణ, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన భద్రతాపరమైన వ్యూహాలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ విభాగపు అధిపతి మహేశ్ చంద్ర ఇతర సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ (ఐ&ఎస్డబ్ల్యూ) అధికారులను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టంగా ఆదేశించారు. భద్రతా నియమావళిని (సెక్యూరిటీ ప్రొటోకాల్స్) పూర్తిస్థాయిలో, కచ్చితంగా అమలు చేయాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని ఆయన అధికారులకు గట్టిగా సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా, ముఖ్యంగా జనసమూహంలోకి వెళ్తున్నప్పుడు అనుసరించాల్సిన నిర్దిష్ట నిబంధనలు, ప్రత్యేకంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై నిరంతర నిఘా ఉంచాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతరం, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతా చర్యలు, ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, భద్రతా చర్యలు అవసరమే అయినప్పటికీ, సామాన్య ప్రజానీకానికి, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైనంత మేరకే భద్రతా ఏర్పాట్లు ఉండాలని, అవి ప్రజలకు ఆటంకంగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు. Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 Pakistan F-16: గాల్లోకి లేచిన కాసేపటికే... భారత క్షిపణి దెబ్బకు కుప్పకూలిన పాక్ F-16 యుద్ధ విమానం 08-05-2025 Thu 22:20 | International పాకిస్థాన్ వాయుసేనకు చెందిన F-16 యుద్ధ విమానం కూల్చివేత భారత ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థతో దాడి పాకిస్థాన్లోని సర్ఘోదా వైమానిక స్థావరం వద్ద ఘటన 1971 తర్వాత ఇదే స్థాయిలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు జమ్మూను లక్ష్యంగా చేసుకున్న పాక్ డ్రోన్లు, క్షిపణుల యత్నం విఫలం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పాకిస్థాన్ వాయుసేనకు (పీఏఎఫ్) చెందిన అత్యాధునిక F-16 సుపర్సోనిక్ యుద్ధ విమానాన్ని భారత ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి (SAM) రక్షణ వ్యవస్థ సాయంతో కూల్చివేసినట్లు ఎన్డీటీవీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కీలకమైన, అత్యంత పటిష్ఠమైన భద్రత కలిగిన సర్ఘోదా వైమానిక స్థావరం నుంచి ఈ F-16 విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే, స్థావరం సమీపంలోనే భారత క్షిపణి దానిని కూల్చివేసినట్లు సమాచారం. 1971 యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఇంత పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే తొలిసారని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి, బ్లాక్అవుట్ విధించారు. జమ్మూను డ్రోన్లు, క్షిపణులతో లక్ష్యంగా చేసుకోవాలన్న పాకిస్థాన్ కుట్ర విఫలమైన నేపథ్యంలో ఈ ప్రధాన ఘటన జరిగింది. జమ్మూలోని ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా, హీరానగర్ సెక్టార్లలో పాకిస్థాన్ దళాలు భారీగా ఫిరంగి దాడులకు తెగబడ్డాయి. అలాగే, అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్లోని పఠాన్కోట్పైనా పాక్ నుంచి తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయి. పఠాన్కోట్ వ్యూహాత్మకంగా భారత్కు కీలకమైన ప్రాంతం కావడం గమనార్హం. సరిహద్దు వెంబడి పాకిస్థాన్ డ్రోన్ల చొరబాట్లను భారత వాయు రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 India: పాకిస్థాన్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్! 08-05-2025 Thu 22:02 | National సరిహద్దులో అత్యంత ఉద్రిక్తంగా పరిస్థితి భారీగా నష్టపోతున్న పాకిస్థాన్ భారత్ వైపు వచ్చిన రెండు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత భారత్-పాక్ సరిహద్దుల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ పై పాక్ మిస్సైల్స్ లో దాడి చేస్తోంది. వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దు దాటే క్షిపణులను అడ్డుకుంటోంది. భారత్ ప్రతి దాడుల్లో పాక్ భారీగా నష్టపోతోంది. ముఖ్యంగా భారత్ వైపు చొచ్చుకువచ్చిన రెండు జేఎఫ్17 రెండు యుద్ధ విమానాలను భారత బలగాలు కూల్చివేశాయి. ఈ విమానాలను పాకిస్థాన్ కు చైనా సమకూర్చింది. అయితే, ఈ దాడుల్లో పాక్ పైలట్లు చనిపోయారా? లేదా జెట్ నుంచి ఎజెక్ట్ కావడం ద్వారా ప్రాణాలు కాపాడుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ నష్టాన్ని ధృవీకరించారు. "విధి నిర్వహణలో ఉండగా రెండు జెఎఫ్-17 విమానాలను కోల్పోయామని చెప్పడానికి చింతిస్తున్నాం" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. Quote
futureofandhra Posted May 8 Report Posted May 8 12 minutes ago, Sam480 said: Bro there must be reason for this information war fare to hit munir psychological Pakis support to their media Pak never owned their own soldiers Tomorrow morning we might get info on pak attacks Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 Pakistan: భారత్ దెబ్బ... ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ సైరన్లు! 08-05-2025 Thu 18:38 | International భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఇస్లామాబాద్లో మోగిన ప్రమాద ఘంటికలు పాక్ ప్రధాని కార్యాలయంలో అత్యవసర సమావేశం సందర్భంగా మోగిన సైరన్ భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లో బుధవారం అలజడి రేగింది. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత్ చేపట్టిన ప్రతీకార చర్యల నేపథ్యంలో ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ సైరన్లు మోగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే సమయంలో పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుండటం గమనార్హం. పహల్గామ్ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించిందని, అయితే భారత బలగాలు ఆ ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, కీలక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు నిర్వహించింది. ముఖ్యంగా లాహోర్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత దళాలు దెబ్బతీశాయి. కొన్ని గంటల క్రితం పాకిస్థాన్లోని లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్తో పాటు పలువురు ఉన్నతస్థాయి సైనిక అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితులపై చర్చిస్తున్న తరుణంలోనే నగరంలో ఎమర్జెన్సీ సైరన్లు ఒక్కసారిగా మోగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో పాకిస్థాన్ అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. Quote
psycopk Posted May 8 Author Report Posted May 8 India: పాకిస్థాన్కు భారత్ షాక్ మీద షాక్ 08-05-2025 Thu 18:12 | National పాక్ మీడియా కంటెంట్పై భారత్ నిషేధం ఓటీటీల్లో పాక్ సిరీస్లు బంద్ జాతీయ భద్రతే ముఖ్యమన్న కేంద్రం పాక్ వెబ్ సిరీస్లపై నిషేధం భారత్లో పాక్ కంటెంట్పై వేటు దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్లో రూపొందిన మీడియా ప్రసారాలపై భారత్లో నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటీటీ వేదికలతో పాటు, ఇతర డిజిటల్ మీడియా మాధ్యమాల్లో ప్రసారమయ్యే పాకిస్థానీ వెబ్సిరీస్లు, సినిమా పాటలు, పాడ్కాస్ట్ల వంటి కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నిషేధాజ్ఞలు వెంటనే అమల్లోకి వస్తాయని, సంబంధిత వేదికలు దీన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఇకపై భారతీయ ప్రేక్షకులు పాకిస్థానీ కంటెంట్ను అధికారికంగా వీక్షించే వీలుండదు. Quote
psycopk Posted May 9 Author Report Posted May 9 Telangana Cyber Security Bureau: ఆపరేషన్ సిందూర్పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ప్రకటన 08-05-2025 Thu 21:22 | Telangana ఆపరేషన్ సిందూర్'పై దుష్ప్రచారంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సైబర్ సెక్యూరిటీ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన చర్య 'ఆపరేషన్ సిందూర్' నకిలీ వార్తలు, పోస్టులపై కఠిన చర్యలని స్పష్టం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి సామాజిక మాధ్యమాలలో అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆపరేషన్కు సంబంధించి ఎలాంటి నకిలీ సమాచారాన్ని గానీ, తప్పుడు ప్రచారాలను గానీ వ్యాప్తి చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సామాజిక మాధ్యమంలో అనధికారిక వార్తలు, అవాస్తవాలను పోస్టు చేసినా లేదా షేర్ చేసినా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. సామాజిక మాధ్యమాలపై నిరంతర నిఘా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని సూచించింది. అంతేకాకుండా, ‘ఆపరేషన్ సిందూర్’ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారి వివరాలు తెలిస్తే, తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరింది. అలాంటి సందేశాలు లేదా పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని 8712672222 అనే వాట్సప్ నంబర్కు పంపించడం ద్వారా తెలియజేయవచ్చని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది. Quote
psycopk Posted May 9 Author Report Posted May 9 Uttam Kumar Reddy: మాజీ సైనికుడిగా... ఆపరేషన్ సిందూర్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి 08-05-2025 Thu 20:41 | Telangana ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్కు సైన్యం గుణపాఠమన్న మంత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై విజయవంతమైన దాడులు మాజీ సైనికుడిగా భారత బలగాలకు ఉత్తమ్ అభినందనలు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత సాయుధ బలగాలు పాకిస్థాన్కు తగిన రీతిలో బుద్ధి చెప్పాయని ఆయన అన్నారు. మాజీ సైనికుడిగా, భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమానికి అభినందనలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో ఇటీవల భారతీయ పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించగా, పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. దీనికి అనుగుణంగా, భారత త్రివిధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట దాడులు నిర్వహించి, విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోదాడ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, నిర్వాహకులను అభినందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో భారత వాయుసేన యుద్ధ విమాన పైలెట్ అని తెలిసిందే. ఆయన మిగ్-21 తదితర ఫైటర్ జెట్లకు పైలెట్ గా విధులు నిర్వర్తించారు. Quote
11_MohanReddy Posted May 9 Report Posted May 9 11 minutes ago, futureofandhra said: Bro there must be reason for this information war fare to hit munir psychological Pakis support to their media Pak never owned their own soldiers Tomorrow morning we might get info on pak attacks I was waiting for someone to say it. @Spartan do you think India is releasing false information on purpose? They did the same thing for mock drills. Today India did the same thing as what Pakistan did yesterday. Quote
Sucker Posted May 9 Report Posted May 9 1 hour ago, chittugaadu said: Mee andari mokalu manda. Edo oohincha kada ra. Ayina nannu nene anukovali. Lahore ayi poyindi, karachi kuppakoolindi, pok in Potlam kattesam, astadigbandana jarigindi ante … blind ga nammanu choodu. tu nee yevva Antha fake aa Nee yenkamma thed pin kuda chepincham ga 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.