Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP ki labham ledu kada mari edupu enduku???

Featured Replies

Kavitha: బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే.. బనకచర్ల వల్ల ఏపీకి లాభం లేదు: కవిత

17-07-2025 Thu 13:49 | Telangana
BRS Leaders Must Come My Way says Kavitha
 
  • తీన్నార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదన్న కవిత
  • గోదావరి జలాలను ఏపీకి రేవంత్, ఉత్తమ్ అప్పజెప్పి వచ్చారని మండిపాటు
  • బనకచర్లను తక్షణమే ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిక
తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తన దారికి రావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది తానేనని కవిత చెప్పారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్టు చెప్పారు. 

కేంద్ర జలశక్తి మంత్రితో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో పండుగ వాతావరణం కనిపించిందని విమర్శించారు. ఈ సమావేశంలో తొలి చర్చ బనకచర్ల అంశంపైనే జరిగిందని... గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి అప్పజెప్పి వచ్చారని మండిపడ్డారు. టెలిమెట్రీలను ఏర్పాటు చేసే అంశంలో విషయం లేదని... కానీ రేవంత్ రెడ్డి దాన్ని తమ విజయంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. బనకచర్ల వల్ల ఏపీకి కూడా ఉపయోగం లేదని... కేవలం కాంట్రాక్టర్ల కోసమే కుట్రపూరితంతా ఆ ప్రాజెక్టును చేపడుతున్నారని ఆరోపించారు. బనకచర్లను తక్షణమే ఆపకపోతే తెలంగాణ జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
  • Author

KTR: హెచ్‌సీఏలో అక్రమాలు.. కేటీఆర్, కవితలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు

17-07-2025 Thu 15:41 | Telangana
KTR and Kavitha Face Allegations in HCA Corruption Scandal
 
  • హెచ్‌సీఏలో అక్రమాల వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారన్న టీసీఏ
  • ఈ మేరకు సీఐడీ డీజీ చారుసిన్హాకు ఫిర్యాదు
  • హెచ్‌సీఏ అక్రమాల్లో మరికొందరి పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్న టీసీఏ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాల వెనుక వీరి హస్తముందని ఆరోపించింది. ఈ మేరకు సీఐడీ డీజీ చారుసిన్హాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు.

హెచ్‌సీఏ అక్రమాల్లో మరికొందరి పాత్ర ఉందని వారు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

బీఆర్‌ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్‌మోహన్‌ రావు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెట్‌కు సంబంధం లేని రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ చేయాలని సీఐడీని టీసీఏ అధికారులు కోరారు.

హెచ్‌సీఏ అక్రమాల వ్యవహారంపై సీఐడీతో పాటు ఈడీకి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మనీలాండరింగ్ కోణం ఉందని విచారణ జరపాలని టీసీఏ ఫిర్యాదులో తెలిపింది. ఇప్పటికే హెచ్‌సీఏ అక్రమాలపై పూర్తి వివరాలు అందజేయాలని సీఐడీనీ ఈడీ కోరింది.
  • Author

Teenmar Mallanna: కేసీఆర్ కుటుంబంపై కోర్టులకు వెళతాం: తీన్మార్ మల్లన్న

17-07-2025 Thu 16:58 | Telangana
Teenmar Mallanna Comments on Phone Tapping Case After SIT Inquiry
 
  • బీఆర్ఎస్ పోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ బయటపడిందన్న తీన్మార్ మల్లన్న
  • ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్
  • తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందించానని వెల్లడి
బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని... లేకపోతే ఆ అరాచకం ఇప్పటికీ కొనసాగేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ తో పాటు ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపుతో తీన్మార్ మల్లన్న ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మల్లన్న స్టేట్మెంట్ ను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. 

విచారణ అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు పలువురి ఫోన్లను ట్యాప్ చేసిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందించానని... తన వద్ద మరికొంత సమాచారం ఉందని, అది త్వరలోనే అధికారులకు పంపిస్తానని చెప్పారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. 

వ్యక్తిగత హక్కులను హరించిన కేసీఆర్ కుటుంబంపై, అప్పటి అధికారులపై చర్యల కోసం కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని... ఈ ప్రభుత్వంలో అలాంటి దుర్మార్గాలు జరగవనే సంకేతాలను ప్రజలకు ముఖ్యమంత్రి ఇవ్వాలన్నారు. ఈ కేసులో సిట్ ఏ మేరకు న్యాయం చేయగలదో చూస్తామన్నారు.
  • Author

KTR: నాపై ఒక్క డ్రగ్స్ కేసైనా ఉందా.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ ఆగ్రహం

17-07-2025 Thu 17:44 | Telangana
KTR demands apology from Revanth Reddy over drug allegations
 
  • తనకు డ్రగ్స్ కేసులతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్న
  • ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్
  • అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానని హెచ్చరిక
"నాపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదై ఉందా? అలాంటి కేసులతో నాకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఉంటే దమ్ముంటే బయటపెట్టు" అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నేరుగా తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్‌చాట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్‌చాట్ పేరుతో తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రేవంత్ రెడ్డికి ఇది కొత్తేమీ కాదని విమర్శించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. క్షమాపణలు చెప్పకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
  • Author

KTR: ముదురుతున్న వివాదం... కవితకు షాక్ ఇచ్చిన కేటీఆర్

17-07-2025 Thu 10:28 | Telangana
KTR Shock to Kavitha as Gap Widens
 
  • టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవిత
  • ఆ సంఘం ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ ను నియమించిన కేటీఆర్
  • పార్టీలో కవిత ప్రాధాన్యతను తగ్గిస్తున్నారంటూ కొత్త చర్చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కవితకు కేటీఆర్ భారీ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా కవిత ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కేటీఆర్ నియమించారు. ఈ నియమకం రాజకీయావర్గాల్లో చర్చకు తెర లేపింది. బీఆర్ఎస్ లో, ఆ పార్టీ అనుబంధ సంఘాల్లో కవిత ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కవిత విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. మరోవైపు జాగృతి సంస్థను పటిష్టం చేసే పనిలో కవిత ఉన్నారు.
  • Author

Appatlo

 

  • Author

 

HCA is most corrupted sprots body in entire nation

1 minute ago, Spartan said:

HCA is most corrupted sprots body in entire nation

true..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.