Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

You can donate eye but you cannot donate vision. —Nitin about CBN

Featured Replies

 

  • Author

 

  • Author

 

  • Author

 

  • Author

 

  • Author

Nitin Gadkari: ఏపీకి గడ్కరీ భారీ కానుక.. రూ. 26 వేల కోట్లకు తక్షణ ఆమోదం, మరో లక్ష కోట్లకు హామీ

02-08-2025 Sat 23:23 | Andhra
Nitin Gadkari Announces 26000 Crore Roads Package for Andhra Pradesh
 
  • 5233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • సీఎం అడగ్గానే.. రూ. 26 వేల కోట్ల కొత్త ప్రాజెక్టులకు గడ్కరీ ఆమోదం
  • ఈ ఆర్థిక సంవత్సరంలో మరో లక్ష కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి హామీ
  • సంపద సృష్టికి రహదారులే కీలకమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • గడ్కరీ అంటే వేగం, పట్టుదల అని కొనియాడిన సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ అండగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వేదిక పైనుంచే ఏకంగా రూ. 26,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి మరో రూ. 1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించి, రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.

శనివారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 2,852 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు, రూ. 2,381 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, సంపద సృష్టికి రహదారులే మూలమని స్పష్టం చేశారు. "ఉదయం అన్నదాత సుఖీభవతో సంక్షేమానికి శ్రీకారం చుట్టాం. సాయంత్రం రహదారుల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టికి బాటలు వేస్తున్నాం. ఇది చరిత్రాత్మకమైన రోజు" అని ఆయన అభివర్ణించారు. నితిన్ గడ్కరీని 'పట్టుదల, కృషి, వేగానికి నిలువుటద్దం' అని కొనియాడిన చంద్రబాబు, ఆయన మాటలు అభివృద్ధిని ఆకాంక్షించే వారికి సంగీతంలా ఉంటాయని అన్నారు. గతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా గడ్కరీ పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోశారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో పూర్తి సహకారం అందిస్తామని, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను కూడా తమ సొంత రాష్ట్రంగా భావించి అభివృద్ధికి సహకరించాలని ఆయన గడ్కరీని కోరారు.

సీఎం విజ్ఞప్తి మేరకు విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-మచిలీపట్నం రహదారులను ఆరు వరుసలుగా విస్తరించడం, గుంటూరు-వినుకొండ మధ్య నాలుగు వరుసల రహదారి వంటి కీలక ప్రాజెక్టులకు గడ్కరీ వేదికపై నుంచే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. గడ్కరీ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించామని, ఇప్పుడు అమరావతికి కూడా 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం లభించిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
  • Author

Sri Bharat: టీసీఎస్ వస్తే విశాఖకు మరెన్నో కంపెనీలు వస్తాయనే లాజిక్ వైసీపీ నేతలు మరిచారు: ఎంపీ శ్రీ భరత్

02-08-2025 Sat 20:42 | Andhra
MP Sri Bharat Criticizes YSRCP on TCS Issue in Visakhapatnam
 
  • విశాఖ అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఎంపీ
  • విశాఖ అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదని విమర్శ
  • తక్కువ ధరకు ఇచ్చారనడం కంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో చూడాలని హితవు
విశాఖపట్నంకు టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజం వస్తే మరెన్నో కంపెనీలు వస్తాయన్న లాజిక్‌ను విస్మరించి వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ నగరం అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగాలు రావడం ప్రతిపక్షానికి ఇష్టం లేదని విమర్శించారు. టీసీఎస్ ఎక్కడికో వెళుతుంటే తాము భూములిచ్చి విశాఖలో నెలకొల్పేలా చేశామని వెల్లడించారు.

టీసీఎస్‌కు తక్కువ ధరకు భూములిచ్చారనే దానికంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది చూడాలని హితవు పలికారు. వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోకుంటే ఈసారి డిపాజిట్లు కూడా రావని హెచ్చరించారు. అలాగే, ప్రతి ఒక్కరు టీసీఎస్ వలే పెద్ద క్యాంపస్ కట్టలేని కంపెనీలు ఉంటాయని, అలాంటి వారి కోసం 'సత్వా' డెవలపర్స్ ప్రాజెక్టు చేపడుతుందని ఆయన అన్నారు.

ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు 25 ఎకరాల్లో పదిహేను, ఇరవై టవర్లు కడితే చిన్న చిన్న కంపెనీలు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌లో రహేజా మైండ్ స్పేస్‌లో ఎన్నో కంపెనీలు వచ్చాయని, రేపు సత్వాలోనూ అలాగే వస్తాయని తెలిపారు.
  • Author

Pawan Kalyan: కూల్చివేతలతో గత ప్రభుత్వం మొదలైంది.. కూటమి ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తోంది: పవన్ కల్యాణ్

02-08-2025 Sat 21:11 | Andhra
Pawan Kalyan Says Coalition Govt Building Roads After Demolitions
 
  • ఒక దేశ ప్రగతికి చిహ్నాలు రోడ్లు, రవాణా మార్గాలేనని పవన్ కల్యాణ్ వ్యాఖ్య
  • ఏపీలో రూ. 5 వేల కోట్లతో 29 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు వెల్లడి
  • 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నామన్న పవన్ కల్యాణ్
గత ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభమైతే, కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చి కొత్త రహదారులను నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒక దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలని ఆయన అన్నారు. రూ. 5 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఏపీలో రూ. 5 వేల కోట్లతో 29 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో కీలకమైన ప్రాజెక్టులను చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం హైవేల నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అడవితల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లను నిర్మిస్తున్నారని తెలిపారు. 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు.

డోలీ మోతలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగైన రోడ్లపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. నిన్నటి వరకు కూల్చివేతల ప్రభుత్వం, రోడ్లు వేయని ప్రభుత్వాన్ని చూశామని, మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలన్నింటిని ఐక్యతతో ఛేదిద్దామని పిలుపునిచ్చారు. కూటమి నాయకుల మధ్య పొరపొచ్చలు వచ్చినా పరిష్కరించుకొని కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు ప్రధాన ఆదాయం మౌలిక వసతుల కల్పన అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
  • Author

 

..

  • Author

 

  • Author

 

  • Author

 

 

@Android_Halwa enti nuvvu jagan ki bebba veseattu vunnav gaa, ila ithe 2029 koda kastamee. 

Ohhh ee 4 years lo avvavantavaa ivanni, jagan list lo add chestavaa

  • Author

 

 

Create an account or sign in to comment

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.