psycopk Posted October 16 Report Posted October 16 Narendra Modi: మా ప్రయోజనాలే ముఖ్యం: రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ 16-10-2025 Thu 11:52 | National రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడి ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ దేశీయ వినియోగదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ ఇంధన భద్రత, ధరల స్థిరత్వమే తమ లక్ష్యమని వెల్లడి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, "రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇది వెంటనే జరగకపోయినా, ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడంతో భారత విదేశాంగ శాఖ దీనిపై అధికారికంగా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి" అని వివరించారు. "స్థిరమైన ఇంధన ధరలు, సరఫరాల భద్రత అనేవి మా ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం" అని ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికొస్తే, చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని, ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. Quote
psycopk Posted October 16 Report Posted October 16 India-US trade: అమెరికా సుంకాల దెబ్బ.. కుప్పకూలిన భారత ఎగుమతులు! 16-10-2025 Thu 11:05 | Business అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాల తీవ్ర ప్రభావం నాలుగు నెలల వ్యవధిలో 37.5 శాతం మేర పడిపోయిన ఎగుమతులు వాషింగ్టన్ విధించిన 50 శాతం టారిఫ్లే పతనానికి కారణం 3.3 బిలియన్ డాలర్ల మేర ఎగుమతి విలువ నష్టం టెక్స్టైల్, జెమ్స్ అండ్ జువెలరీ రంగాలు తీవ్రంగా దెబ్బ అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాషింగ్టన్ ప్రభుత్వం భారత వస్తువులపై 50 శాతం మేర భారీ సుంకాలను విధించడంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అమెరికాకు మన ఎగుమతులు 37.5 శాతం మేర కుప్పకూలాయి. ఈ ఆందోళనకర విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. జీటీఆర్ఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మే 2025 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో అమెరికాకు భారత ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. మే నెలలో 8.8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, సెప్టెంబర్ నాటికి 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే, ఈ నాలుగు నెలల్లోనే నెలవారీ ఎగుమతుల విలువలో భారత్ ఏకంగా 3.3 బిలియన్ డాలర్లను కోల్పోయింది. వరుసగా నాలుగు నెలల పాటు ఎగుమతులు క్షీణించడం ఇదే తొలిసారి. అమెరికా విధించిన 50 శాతం సుంకాలు పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత, సెప్టెంబర్ నెలలో అత్యంత తీవ్రమైన ప్రభావం కనిపించింది. ఆగస్టులో 6.87 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, సెప్టెంబర్లో ఏకంగా 20.3 శాతం తగ్గి 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025లో ఒకే నెలలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి అని నివేదిక స్పష్టం చేసింది. ఈ సుంకాల ప్రభావం ముఖ్యంగా టెక్స్టైల్, జెమ్స్ అండ్ జువెలరీ, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాల వంటి కీలక రంగాలపై పడింది. ఈ రంగాల నుంచి ఎగుమతులు భారీగా పడిపోవడంతో మొత్తం ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, అమెరికా వంటి అతిపెద్ద మార్కెట్లో భారత తయారీ, ఎగుమతి రంగాల పోటీతత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్ విధించిన సుంకాలే ఈ పతనానికి ప్రత్యక్ష కారణమని స్పష్టం చేసిన జీటీఆర్ఐ, భారత వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి తక్షణమే విధానపరమైన సమీక్ష చేపట్టాలని సూచించింది. Quote
psycopk Posted October 16 Report Posted October 16 Rahul Gandhi: మోదీకి ట్రంప్ అంటే భయం.. అందుకే రష్యా ఆయిల్పై మౌనం: రాహుల్ గాంధీ 16-10-2025 Thu 10:46 | National రష్యా నుంచి చమురు కొనబోమని మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ మోదీకి ట్రంప్ భయం పట్టుకుందంటూ రాహుల్ ఎద్దేవా సెప్టెంబర్లోనూ రష్యా నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి ట్రంప్ ప్రకటనపై ఇంకా స్పందించని కేంద్ర ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ అంటే భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు నిలిపివేస్తుందని ట్రంప్ చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించక ముందే రాహుల్ ఈ విమర్శలు చేయడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీని 'గొప్ప వ్యక్తి' అని, భారత్ను 'అద్భుతమైన దేశం' అని పొగిడిన ట్రంప్, అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని మోదీ తనకు హామీ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈ ప్రక్రియ వెంటనే పూర్తికాదు. కానీ త్వరలోనే ముగుస్తుంది. వారు తక్కువ సమయంలోనే రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తారు" అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. "ప్రధాని మోదీకి ట్రంప్ అంటే భయం" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. "రష్యా నుంచి ఆయిల్ కొనబోమని చెప్పే నిర్ణయాన్ని, ఆ ప్రకటనను కూడా ట్రంప్కే వదిలేశారు. ఎన్నిసార్లు అవమానించినా అభినందన సందేశాలు పంపుతూనే ఉన్నారు. ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను కూడా రద్దు చేశారు" అని రాహుల్ ఆరోపించారు. గత సెప్టెంబర్ నెలలో కూడా భారత్ తన మొత్తం ముడిచమురు దిగుమతుల్లో 34 శాతం రష్యా నుంచే కొనుగోలు చేసింది. భారత్ ఇప్పటికీ రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అమెరికా నుంచి సరైన ధరకు లభిస్తే సుమారు 12-13 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం వాషింగ్టన్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. Quote
megadheera Posted October 16 Report Posted October 16 1 hour ago, psycopk said: Narendra Modi: మా ప్రయోజనాలే ముఖ్యం: రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ 16-10-2025 Thu 11:52 | National రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడి ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ దేశీయ వినియోగదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ ఇంధన భద్రత, ధరల స్థిరత్వమే తమ లక్ష్యమని వెల్లడి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, "రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇది వెంటనే జరగకపోయినా, ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడంతో భారత విదేశాంగ శాఖ దీనిపై అధికారికంగా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి" అని వివరించారు. "స్థిరమైన ఇంధన ధరలు, సరఫరాల భద్రత అనేవి మా ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం" అని ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికొస్తే, చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని, ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. Inthaki yes or no.. no clarity same like Rafael down Quote
2024 Posted October 16 Report Posted October 16 23 minutes ago, megadheera said: Inthaki yes or no.. no clarity same like Rafael down indirect gaa yes ani antunna @congress Quote
Raisins_72 Posted October 16 Report Posted October 16 2 hours ago, megadheera said: Inthaki yes or no.. no clarity same like Rafael down Ayipaayey 😂 1 hour ago, psycopk said: Quote
EggpuffReddy Posted October 16 Report Posted October 16 ayina russia nunchi cheap ga oil konna kuda India lo petrol rate em tagginchadamledu kada, భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. domestic users ki em help avutundi asalu Quote
11MohanRedddy Posted October 16 Report Posted October 16 31 minutes ago, EggpuffReddy said: ayina russia nunchi cheap ga oil konna kuda India lo petrol rate em tagginchadamledu kada, భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. domestic users ki em help avutundi asalu Russia nunchi cheap ga kontunnaru kabatti petrol rates didn't go off the roof. Don't expect petrol rates to ever go down. India has close 10% inflation rates, it is never going to go down. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.